కరీంనగర్

గ్రామ రెవెన్యూ అధికారికి సంవత్సరం జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ (లీగల్), మార్చి 23: రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేపడుతూనే అవినీతికి పాల్పడుతూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ రెవెన్యూ అధికారి రాజయ్యకు సంవత్సరం జైలుశిక్ష విధిస్తూ కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు శుక్రవారం తీర్పు చెప్పారు. జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన వయ్యాల పుష్పలత తన తల్లి గారి గ్రామమైన ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలో 20 సంవత్సరాల క్రితం 28 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి స్వాధీనం చేసుకుంది. సంఘటనకు నాలుగు నెలల క్రితం పుష్పలత తాను కొనుగోలు చేసిన భూమిని రెవెన్యూ రికార్డులో నమోదు చేసి పాస్ బుక్కులు ఇప్పించాలని విఆర్‌ఓ జంగపల్లి రాజయ్యను ఆశ్రయించింది. రాజయ్య చాలాన్ కట్టాలని వెయ్యి రూపాయలు తీసుకొని రెండు నెలల అనంతరం కలవాలని పంపించేశాడు. కొద్ది రోజుల అనంతరం తన వద్ద ఉన్న పాస్ పుస్తకాలను, తన బంధువైన తిరుపతితో కలిసి రాజయ్యకు ఇవ్వగా 15 రోజుల తదుపరి ఐదు వేల రూపాయలు లంచం ఇస్తేనే పాస్ బుక్‌లు ఇస్తామని డిమాండ్ చేయగా, అంత డబ్ము ఇవ్వలేనని, నాలుగు వేలు రూపాయలైనా ఇవ్వాలని రాజయ్య డిమాండ్ చేశారు. ఆయా రూపాయలను ఇవ్వలేని పుష్పలత ఎసీబి అధికారులను 29 జనవరి, 2011న సంప్రదించింది. ఎసీబి అధికారుల సూచన మేరకు ధర్మారంలోని రాజయ్య ఇంటిలో పుష్పలత నాలుగు వేల రూపాయలు ఇస్తుండగా అక్కడే వేచి ఉన్న అధికారులు వలపన్ని రాజయ్యను పట్టుకొని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి సాక్షులను ప్రవేశపెట్టారు. తగిన సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి భాస్కర్ రావు నిందితుడైన గ్రామ రెవెన్యూ అధికారి జంగపల్లి దేవయ్యపై నేరం రుజువు కావడంతో సంవత్సరం జైలుశిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కాగా, ప్రస్తుతం వెల్గటూరు మండలంలోని అంబారిపేటలో జంగపల్లి రాజయ్య గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

ప్రాజెక్టులైతే మా భూముల్లో
నీరు మాత్రం మల్లన్నసాగర్‌కు మళ్లిస్తారా?
* రాస్తారోకోకు దిగిన నిర్వాసిత రైతులు
రామడుగు, మార్చి 23: ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోసుకోవడానికి మా భూముల్లో ప్రాజెక్టులు నిర్మించి చుక్క నీరు లేకుండా చేసి మాకు అన్యాయం చేసి నీళ్లన్నీ మల్లన్నసాగర్‌కు తరలిస్తారా? అంటూ మండలంలోని లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లి, కిష్టంపల్లి రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకోకు దిగారు. ఉదయమే రైతులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నప్పటికీ సమీపంలోనే పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నందున పోలీసులు రైతుల ఆందోళనను అడ్డుకున్నారు. అనంతరం వారికి కాసేపు బందోబస్తు మద్యన అనుమతి ఇవ్వడంతో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 8వ ప్యాకేజీ పనుల్లో సుమారు వెయ్యి ఎకరాల భూములు ప్రజావసరాల కోసం ప్రభుత్వం తీసుకుందని, మిగతా భూముల్లో పంటలు పండించాలనుకుంటే బావులు,బోర్ వెల్లులో ఉన్న నీరు అండర్ గ్రౌండు టనె్నల్ మింగేసిందన్నారు. ఉన్న భూములకు నిర్మాణంలో ఉన్న గ్రావిటీ కెనాల్ వద్ద గేటు ఏర్పాటు చేసి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీరు ఇవ్వకుండా తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతుల ఆందోళనకు మద్దతిచ్చిన టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గజ్జెల కాంతం మాట్లాడుతూ రైతులు రోడ్డుపై వేయకుండా న్యాయపరంగా నీళ్లు ఇచ్చి వారి పంటలను రక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రం డిప్యూటి తహశీల్దార్ రాజ్‌కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వంచ సుదర్శన్ రెడ్డి, పంజాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.