క్రైమ్/లీగల్

ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్వశ్రీరాంపూర్, జూలై 9: కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన పురం మధూకర్(25) ఆదివారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్ జానీపాషా తెలిపారు.

ఆర్టీసీ బస్సు బోల్తా
* డ్రైవర్‌తోబాటు నలుగురికి గాయాలు
సైదాపూర్, జూలై 9: మండలంలోని పెర్కపల్లి పంచాయతీ పరిధి సర్వాయిపేట గ్రామ శివారులో హుజూరాబాద్‌కు చెందిన (ఎపి.28జడ్.1935) అనే నంబర్ గల ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుంచి సర్వాయిపేట-సైదాపూర్ మీదుగా 12 మంది ప్రయాణీకులతో హుజూరాబాద్‌కు వస్తుంది. సోమవారం సాయంత్రం శివారు గుట్టల వద్ద ఇరుకు రోడ్ కావడంతో మేకలను తప్పించబోయి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్ రాంరెడ్డికి తలకు గాయమైంది. కాగా, ముగ్గురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి హుజూరాబాద్ డిఎం ధరం సింగ్ పరిశీలించి సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.