కరీంనగర్

వారం రోజుల్లో యుటిలైజేషన్ సర్ట్ఫికేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 16: వారం రోజుల్లోగా ప్రాజెక్టుల భూసేకరణకై విడుదలైన నిధులకు సంబంధించి వినియోగ ధృవ పత్రాలు సమర్పిస్తామని కలెక్టర్ కృష్ణ్భాస్కర్ మంత్రి టీ.హరీష్‌రావుకు తెలిపారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు, రెవెన్యూ అధికారులతో భారీ నీటి పారుధల శాఖ మంత్రి హరీష్‌రావు, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్‌తో కలిసి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా భూ సేకరణకు మంజూరు చేసిన నిధులు, ఖర్చు తదితర అంశాలపై దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. దీనికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్ కలెక్టరేట్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణకు విడుదలైన నిధులు, ఇప్పటి వరకు వెచ్చిందిన మొత్తం వివరాలను వారం రోజుల్లో అందిస్తామన్నారు. మంత్రి మాట్లాడుతూ భూసేకరణకై ప్రభు త్వం మంజూరు చేసిన నిధులకు సంబంధించి వీసీలు వెంటనే పంపాలన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. కార్య క్రమంలో అధికారులు, సిబ్బంది, సంబంధితులు పాల్గొన్నారు.