కరీంనగర్

వినాయకులకు ఘనంగా వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 23: గత తొ మ్మిది రోజులుగా అత్యంత పవిత్రం గా కొలిచిన వినాయకులకు జిల్లా వా యప్తంగా ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం సాయంత్రం నుండి జిల్లా కేంద్రమైన జగిత్యాల వివిధ మండలా లనుండి వినాయక ప్రతిమల కోలాట నృత్యాలు, భజాభజంత్రీలతో గణేష్ మహారాజ్‌కు జై, గణపతి బొప్పాబోరి యా.. తులిసా.. మొలిసా నైకరియా అంటూ యువకులు, పిల్లలు, మహిళ లు, తన్మయత్వంతో వివిధ వాడల ను ండి ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు, తదిత ర వాహనాల్లో గణపతి విగ్రహాలను శోభాయమానంగా అలంకరించి పట్ట ణ ప్రధాన వీధులగుండా భారీగా ఊ రేగించారు. ప్రధాన కూడళ్లలో యువతులు కోలాట నృత్యాలు పలువురు ఆకర్షించాయి. నిమజ్జన వేడుకలకు భక్తులు భారీసంఖ్యలో తండోపతండాలుగా తరలివచ్చి క్లాక్‌టవర్, తహశీల్ చౌరస్తాలో ఊరేగింపును వీక్షించా రు. పోలీసులు గట్టి బందోబస్తును ఏ ర్పాటు చేయడంతోపాటు వినాయక నిమజ్జనానికి ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏ ర్పాటుచేయడంతోపాటు వాహనాల రాకపోకలు బైపాస్‌గుండా మళ్లించా రు. భక్తులకు జగిత్యాల మున్సిపల్ ప క్షాన తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇదేవిధంగా భారీ క్రేన్ల వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు. రాత్రి వరకు సుమారు 350 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. క్లాక్‌టవర్‌కు చేరుకున్న వినాయక మ ండల నిర్వాహకులకు గణేష్ ఉత్సవ సమితి పక్షాల ప్రతి వినాయక నిర్వాహకులకు మెమొంటోలు అందించి వి విధ ప్రజాప్రతినిధులతో పోలీస్ అధికారుల చేతుల మీదుగా టెంకాలు కొ ట్టించారు. ప్రతిఏడాది మాదిరిగానే జి ల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సమీపంతోపాటు నిమజ్జన ప్రదేశాల్లో జగితా యల సీటీ కేబుల్, దుర్గా, శ్రీ్ఛనల్ ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయగా భక్తులు వీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గణేశ్ ఉత్సవ సమితి పోలీసులకు స హకరించడంతోపాటు భక్తులకు, గ ణేష్ ఉత్సవ మండపాల నిర్వాహకుల కు చేయూతనందించారు. తహశీల్ చౌరస్తా నుండి కొత్తబస్టాండ్, అరవిందనగర్, హౌజింగ్‌బోర్డు, విద్యానగర్, పోచమ్మవాడ తదితర ప్రాంతాల ను ండి వినాయకులను ఊరేగించి చింతకుంట చెరువులో నిమజ్జనం చేశారు. ఐజీపీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ సింధూశర్మ, డీఎస్పీ ఎం. వెంకటరమణ, ఏఆర్ డీఎస్పీ ప్రతాప్, సీఐలు రత్నాపురం ప్రకాష్, రాజేష్, ఎస్సైలు ఆరోగ్యం, సతీష్, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్లు, 250మంది పోలీసులతో భారీ భద్రత చర్యలు చేపట్టి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. కోరుట్లలో ని ఫూల్‌వాగులో వినాయకులను నిమజ్జనం చేయగా, మెట్‌పల్లిలోని వట్టివాగులో గణేష్‌లను నిమజ్జనం చేశారు. డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐలు సతీష్‌చందర్‌రావు, రవికుమార్, ఎస్సైలు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చ ర్యలు చేపట్టి శాంతిభద్రతలను పరిరక్షించారు. నిమజ్జనోత్సవంలో తాజామాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దే వేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు ఆదేశంతో ప్రభుత్వంలో కదలిక
* రైతుబంధు చెక్కులు పంపిణీకి ఆదేశాలు
* రూ. 5లక్షల బీమా సంగతేంటో ప్రభుత్వం తేల్చాలి
* ప్రవాసి సంక్షేమ వేదిక అధ్యక్షుడు మంద భీంరెడ్డి
జగిత్యాల, సెప్టెంబర్ 23: విదేశాల్లో నివసించే తెలంగాణ రైతు (ఎన్నారై) కుటుంబాలకు రైతుబంధు చెక్కులు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశం తో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ప్రవాసి సంక్షేమ వేదిక ‘ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం’ అధ్యక్షుడు మంద భీంరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కే ంద్రమైన జగిత్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంద భీంరెడ్డి మాట్లాడుతూ రైతుబంధు పథకాన్ని గల్ఫ్‌లో ఉన్న సన్నకారు, చిన్నకారు రైతాంగానికి వర్తింపజేయాలని ప్రవాస సం క్షేమ వేదిక ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం, సీఎం కేసీఆర్‌కు వినతిప త్రాలు సమర్పించినా స్పందన రాలేద ని దీంతో చేసిదేంలేక హైకోర్టులో ప్ర జా ప్రయోజనాల వ్యాజ్యం (పబ్లిక్ ఇంట్రెస్టు లిటిగేషన్ -పిల్ 196/2018) దాఖలు చేశామని వివరించారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని రెండునెలల్లోగా గల్ఫ్‌లోని ప్ర వాస భారతీయులకు రైతుబంధు వ ర్తింపు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశి ంచిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం, అధికారుల్లో కదలిక వచ్చి ఎన్నారై కుటుంబ సభ్యులకు రై తుబంధు చెక్కులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు భీంరెడ్డి వెల్లడించారు. ప్రవాసంలో ఉన్న తెలంగాణ రైతుల పక్షాన న్యాయం కోసం తనతోపాటు డాక్టర్ బిఎం.వినోద్‌కుమార్ పోరాటాలు చేశారని తెలిపారు. హైకోర్టు ఆదేశంతో ఎన్నారై కు టుంబ సభ్యులకు రైతుబంధు చెక్కులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం సంతోషదాయకమే కాని రూ. 5లక్షల బీమా సం గతేంటో కూడా ప్రభుత్వం తేల్చి చె ప్పాలని ప్రవాసి సంక్షేమ వేదిక అధ్యక్షులు మంద భీంరెడ్డి అన్నారు. స్వదేశంలో ఉన్న రైతులతో సమానంగా వి దేశాలలో ఉన్న రైతులకు ఎల్‌ఐసీ రూ. 5లక్షల గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (బృంద జీవిత భీమా)ను ‘మెయిల్ ఆ ర్డర్ బిజినెన్’ పద్ధతిలో వర్తింపచేయాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోని తీసుకొని అమలు చేయాలని సూచించారు. ప్రవాసంలో ఉన్న రైతులకు అన్ని రకాల రైతుబంధు ప్రయోజనాలు కల్పించడానికి ఒక విధానం రూపొందించాలని, ఎన్నారై రైతుల వ్యవహారాలను చూడటానికి వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో ఒక ప్రత్యేక విభాగా న్ని ఏర్పాటు చేయాలని ‘ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం’ ప్రవాసి సంక్షేమ వేదిక అధ్యక్షులు మంద భీంరెడ్డి కోరారు.