కరీంనగర్

రాజన్న హుండి ఆదాయం రూ 1.22కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, ఏప్రిల్ 29:శ్రీ రాజరాజేశ్వరస్వామిని హుండి ఆదాయం రూ.1.22కోట్లు సమకూరింది. శుక్రవారం ఆలయ ఆవరణలోని ఓపెన్ కాంప్లెక్స్‌లో ఇవో రాజేశ్వర్ పర్యవేక్షణలో ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాలమైన శ్రీ నగేశ్వరాలయం, భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ ఆలయాల హుండిలను లెక్కించారు. ఈ లెక్కింపు రూ.1.22కోట్లు ఆదాయం సమకూరింది. బంగారం 197 గ్రాములు, వెండి 13 కిలోలు వచ్చింది.
ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. శుక్రవారం సందర్భంగా స్వామివారిని ,అమ్మవారిని భక్తుల పెద్ద సంఖ్యలో దర్శించుకోని తరించారు. ముందుగా స్వామివారికి తలనీలాల,కోడె మొక్కులు చెల్లించుకున్నారు.అంతరాలయంలో కొలువుదీరిన స్వామివార్లకు,అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకొని దర్శించుకున్నారు. నూతన దంపతులతో స్వామి మొక్కులు చెల్లించుకున్నారు.