కరీంనగర్

1న జిల్లాకు సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌టౌన్, ఏప్రిల్ 29: ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా పర్యటన పైన జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసమిబసు శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మే 1న రాత్రి కరీంనగర్‌కు చేరుకొని బస చేస్తారని, 2న ఉదయం కరీంనగర్ నుండి కాళేశ్వరం చేరుకుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం కనె్నపల్లిలో పంపుహౌజ్, మేడిపల్లిలో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. పర్యటనకు వివిధ శాఖల అధికారులు చేయవలసిన ఏర్పాట్లపై జెసి ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. ప్రోటోకాల్ ఏర్పాట్లపై పర్యవేక్షించాలని మంథని, కరీంనగర్ ఆర్డీవోలకు సూచించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎజెసి నాగేంద్ర, డిఆర్‌ఓ వీరబ్రహ్మయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.