క్రైమ్/లీగల్

లారీని ఢీకొన్న కారు.. ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, నవంబర్ 10: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, నర్సయ్యపల్లి గ్రామాల మధ్య రాజీవ్ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాలకు చెందిన ఒకే కుటుంబం కారులో హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి మంచిర్యాలకు వస్తున్న క్రమంలో ఈప్రమాదం జరుగడంతో కారులో ఉన్న ఎండీ కుశదార్ ఉల్లా అతని భార్య ఇస్రాత్, కుమారుడు జీదన్, 5నెలల కూతురు అమేదాజరీన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కు పోయిన క్షతగాత్రులను పోలీసులు వెంటనే బయటకు తీసి చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఇస్రాత్ (26) మృతి చెందింది. ముందు వెళుతున్న లారీని కారు డీ కొట్టడంతో ఈప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జైంది. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.