కరీంనగర్
గల్ఫ్లో ముస్తాబాద్ వాసి మృతి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 12 May 2016
ముస్తాబాద్, మే 12: ఉపాధి కోసం ఎడారి దేశం వెళ్లిన ముస్తాబాద్ వాసి దరిపెల్లి రాజం(45)ను రోడ్డుప్రమాద ఘటన రూపంలో కబళించింది. ఒమన్ దేశంలోని మస్కట్లో గత శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృత్యువాతపడ్డాడు. మృతునికి భార్య కనకలక్ష్మీ, కుమార్తెలు దివ్య, దీపిక, కొడుకు ప్రశాంత్, తల్లి ఉన్నారు. స్థానికంగా ఉపాధి అందక, ఏడాది కిందట మస్కట్ వెళ్లాడు. వీసా కోసం లక్షలు అప్పుచేసి, గల్ఫ్ కెళ్లగా, శవంగా మారి గురువారం స్వగ్రామం చేరిన ఘటన గ్రామంలో తీవ్ర విషాధాన్ని నింపింది. మృతుని బంధుమిత్రుల రోధనలు మిన్నంటాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని శాలివాహన సంఘనేత రాములు, మల్లయ్య, ఎంపిటిసి రాజు కోరారు.