కరీంనగర్
పల్లెల ప్రగతికి రహదారులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 16 June 2016
ఎల్లారెడ్డిపేట, జూన్ 16: పల్లెల అభివృద్ధికి రహదారులు ముఖ్యమని టెస్కాబ్ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు అన్నారు. కరీంనగర్-నిజామాబాద్ జిల్లాలను కలిపే మండలంలోని మద్దిమల్ల సోమారిపేట, గుండారం అంతర్గత రహదారుల పనులను ఆయన గురువారం పరిశీలించారు. పనుల ప్రగతిపై అధికారులతో చర్చించారు. త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. రూ.5.50 కోట్లతో రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయని చెప్పారు. పనులు పూర్తయితే రెండు జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతోందని రవీందర్రావు అన్నారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు సుదర్శన్, సతీష్రావు, చాంద్పాషా, రఫీ, నాయకులు కొండ రమేశ్, లచ్చిరాం, తదితరులు ఉన్నారు.