కరీంనగర్

నావల్లే ఎల్లంపల్లి నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జూన్ 17: హైదరాబాద్ వెళ్తున్న సుజల ద్వారా పైపులైనును సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ధ్వంసం చేసి ప్రజల ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు తెలిపారు. తాను సాహసం చేయడం వల్లే ప్రభుత్వం దిగివచ్చి పెద్దపల్లికి గోదావరి జలాలను అందిస్తోందన్నారు. శుక్రవారం స్థానిక ఐబి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరించారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన టిఆర్‌ఎస్ నాయకులు ప్రజా సమస్యలు గాలికి వదిలి 3 శాతం కమీషన్‌ల వసూలుకే దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. ఈసందర్భంగా మండలంలోని అప్పన్నపేట, చందపల్లి గ్రామాలకు చెందిన యువకులు టిడిపిలో చేరారు. వారికి పార్టీ కండువాకప్పి సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఎడెల్లి శంకర్, ఉప్పు రాజు, నూగిళ్ల మల్లయ్య, శ్రీనివాస్, సంపత్, వినాయకరావు పాల్గొన్నారు.