కరీంనగర్

అత్తారింటి వేధింపులతో.. బావిలో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జూలై 17: అత్తారింటి వేధింపులు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. మానసికంగా.. శారీరకంగా.. వేధింపులు మానస్థాపానికి గురి చేశాయి. దీంతో మూడేళ్ల కొడుకుతోసహా తన నిండు జీవితాన్ని అర్పించుకుంది ఓ తల్లి. పదేళ్ల వైవాహిక జీవితంలో తల్లెత్తిన కలహాలు, అత్త, మామ, భర్త వేధింపులు బావిలో దూకి నిమ్మల జమున (30), నిమ్మల అక్షిత్ (3) నిండుప్రాణాన్ని బలి తీసుకునేలా చేశాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం జయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలోని పుట్నూర్‌లో చోటు చేసుకుంది. బసంత్‌నగర్ పోలీసు కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు గ్రామానికి చెందిన జమునతో మండలంలోని పుట్నూర్ గ్రామానికి చెందిన నిమ్మల నారాయణతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంత కాలంగా వీరి వైవాహిక జీవితంలో గొడవలు చెలరేగుతున్నాయి. జమున అందంగా లేదని, తల్లి ఇంటి వద్ద నుంచి ఆస్తికి సంబంధించిన వ్యవహారాల విషయంలో తరుచూ ఘర్షణలు జరగడం ఈ విషయంలో కుల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. ఈ క్రమంలో కుటుంబంలో కలహాలు కొంత మేరకు తగ్గు ముఖం పట్టాయని అనుకున్నప్పటికీ గడిచిన వారం రోజులుగా ఇంట్లో తగాదాలు మరీ ఎక్కువయ్యాయి. శనివారం రాత్రి కూడా వీరి ఇంట్లో గొడవ చోటు చేసుకున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన జమున తన కొడుకు అక్షిత్‌తో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది ఇలా ఉండగా జమున తండ్రి వెంకటయ్య తన కూతురు, మనువన్ని చంపేశారంటూ ఆరోపించారు. ఘటన స్థలానికి పెద్దపల్లి సి ఐ ఎడ్ల మహేష్, బసంత్ నగర్ ప్రొబేషనరీ ఎస్‌ఐ తిరుపతి చేరుకొని వివరాలను ఆరా తీశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.