కరీంనగర్

అణగారిన వర్గాలను అణచివేస్తున్న బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల టౌన్, జూలై 24: అణగారిన వర్గాలను బిజెపి పాలిత రాష్ట్రాలు అణచివేస్తున్నాయని డిసిసి ఉపాధ్యక్షుడు బండ శంకర్ ఆరోపించారు. ఈమేరకు ఆదివారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బండ శంకర్ మాట్లాడుతూ బిజెపి పాలిత రాష్ట్రాల్లో అణగారిన వర్గాలను అవమానిస్తూ వేధిస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌లో చనిపోయిన ఆవు చర్మాన్ని తీస్తున్న నలుగురు దళిత యువకులను రోడ్డుపైనా కట్టివేసి తీవ్రంగా దాడి చేయగా, అందులో ఒకరు మృతి చెందడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రధాని సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు రఘువీర్‌గౌడ్, మెరుగు లక్ష్మన్, జీవన్, రియాజ్, నాగార్జున, మహముద్, రాజు, రంజిత్, రవి, ప్రశాంత్, ఉమేష్, వీరేందర్, విష్ణు, ప్రవీణ్, సంజీవ్, రాకేష్, సురేష్, సాయికిరణ్, వంశీ, జయసింహా, లచ్చయ్య, బాపు, గంగాధర్ పాల్గొన్నారు.

-