కరీంనగర్

ఆసుపత్రి దుస్థితిపై స్పందించిన హెచ్‌ఆర్‌సి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 7: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఇటీవలే పిల్లల వార్డులో స్లాబ్ పైపెచ్చులు పడి పలువురికి గాయాలైన సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి దుస్థితిపై రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేయగా, కమీషన్ స్పందించింది. ప్రభాకర్ అందించిన ఫిర్యాదును పరిశీలించిన అనంతరం హెచ్‌ఆర్ నం.6545/2016గా కేసు నమోదు చేసి కమీషన్ ఈ నెల 17 లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీతో పాటు జిల్లా వైద్యాధికారికి నోటీసులు జారీ చేసింది. 17న ఉదయం 11 గంటలకు కేసు విచారణ జరుగుతుందని, విచారణకు హాజరు కావాలని హెచ్‌ఆర్‌సి ఆ నోటీసులో పేర్కొంది.