కరీంనగర్

పడాలకు ఘన సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, ఆగస్టు 12: బ్రిటిష్ దొరలను పారద్రోలిన క్విట్ ఇండియా ఉద్యమ నాయకుడు రాష్టప్రతి సన్మానానికి ఎంపికైన పడాల చంద్రయ్య అని కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మీస బీరయ్య పేర్కొన్నారు. మండలంలోని ముల్కనూరులో కుర్మ సంఘం భీమదేవరపల్లి శాఖ అధ్యక్షుడు గౌడ బాలాజీ ఆధ్వర్యంలో పడాల చంద్రయ్యను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మీస బీరయ్య మాట్లాడుతూ పడాల కరవు ప్రాంతమైన భీమదేవరపల్లిలో 50 యేళ్ల క్రితమే ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంక్ నెలకొల్పినారన్నారు. ఆయన కృషి వల్లనే నేడు ఏడు వేల రైతు కుటుంబాల్లో వెలుగులు నిండినాయన్నారు. ఇల్లంతకుంట ఎంపిపి ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చంద్రయ్య జీవిత చరిత్రను పొందుపర్చాలన్నారు. సమావేశంలో ఎంపిటిసి కంకల సమ్మయ్య, మాజీ సర్పంచ్ చవ్వాల బుచ్చయ్య, కోహెడ మండల అధ్యక్షుడు కోనె శేఖర్, సర్పంచ్ పర్శరాములు పడాల చంద్రయ్యను ఘనంగా సత్కరించారు.