కర్నూల్

వైభవంగా శ్రీసుశమీంద్రతీర్థుల ఆరాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఏప్రిల్ 24: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం వైభవంగా శ్రీ సుశమీంద్ర తీర్థుల ఆరాధన మహోత్సవం వేడుకలు జరిగాయి. మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ముందుగా శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి తదితర ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. పూర్వపు పీఠాధిపతి శ్రీసుశమీంద్ర తీర్థుల ఏడవ ఆరాధన వేడుకలను పురస్కరించుకుని బృందావనానికి పంచామృతాబిషేకం, తులసి అర్చన తదితర ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం శ్రీసుశమీంద్ర తీర్థుల చిత్రపటాన్ని బంగారు రథంపై ఉంచి ప్రత్యేక పూజలు చేసి మఠం ప్రాకారంలో అశేష భక్తుల నడుమ వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాలు మధ్య వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ధార్మిక సిబ్బంది ప్రకాష్, వ్యాసరాజాచార్, ప్రిన్సిపాల్ వాదిరాజాచార్, తదితర మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.