కర్నూల్

మోదీ అంటే చంద్రబాబుకు భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఫిబ్రవరి 23: నోటుకు ఓటు కేసులో దొరికినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ అంటే చాలా భయంగా ఉందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే శిబిరానికి వెళ్లి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మోదీ నుంచి రాష్ట్భ్రావృద్ధికి నిధులు తీసుకుని రావడంలో చంద్రబాబునాయుడు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రజలందరు కోరినప్పటికీ వారి మాటలను పెడచెవిన పెట్టిన బాబు ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్భ్రావృద్ధి అవుతుందని ప్రకటించి నిధులు తీసుకురావడంలో చేతకాక ఇప్పుడు చేతులు ఎత్తేశారన్నారు. ప్రత్యేక హోదా కావాలంటే మంత్రి వర్గంలో ఉన్న కేంద్ర మంత్రులను వెంటనే రాజీనామా చేయించి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఆయన పిలుపు నిచ్చారు. సీఎం ఇచ్చిన హామీలను కూడా మరిచిపోయారని, సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు చెప్పిన ఆ తీర్పును అమలు చేయుండా విద్యుత్ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కేంద్రం పంపిన నిధులకు లెక్కలు కూడా చెప్పడం లేదని, మొత్తం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నిధులను స్వాహా చేశారన్నారు. ఓటుకు నోటుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కోట్లు రూపాయాలు ఖర్చు చేసిన చంద్రబాబు విద్యుత్, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు మాత్రం పెంచకపోవడం శోచనీయమన్నారు. తన కుమారుడు మాత్రం పదవి ఇచ్చి ఇతరులకు మొండి చెయ్యి చూపడం దారుణమన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే విద్యుత్ కార్మికులకు న్యాయం జరుగుతుందని, వారికి మద్దతు ఇచ్చారు. అనంతరం విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.