కర్నూల్

మరణంలోనూ వీడని బంధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడుతూరు, మార్చి 22:తాను చనిపోతే నేనూ బతకనని, బతికున్న రోజుల్లో అతను తరచూ అంటున్న మాటను నాగన్న నిజం చేస్తూ భార్యను వీడకుండా మరణంలో కూడా ఆమెకు తోడుగా తనువు చాలించాడు. జీవితాంతం తోడూ నీడగా వుంటానంటూ వివాహం చేసుకున్న రోజు తాళి కట్టిన భర్త మరణంలో కూడా భార్యను వీడకుండా ఇద్దరూ మృత్యు ఒడికి చేరారు. పెళ్లి బంధంతో కలిసి చావులో కూడా ఇద్దరూ ఒక్కటై కానిరాని లోకాలకు కలిసివెళ్లారు. ఈ విషాద సంఘటన మండలంలోని పీరుసాహేబ్‌పేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని పీరుసాహేబ్‌పేట గ్రామానికి చెందిన నాగన్న(75), వెంకమ్మ(72) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ముగ్గురు కుమారులు సంతానం కాగా, అందరికీ వివాహం చేసి సంతోషంగా జీవిస్తున్నారు. మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా వుండే ఆ కుటుంబంలో గురువారం చోటుచేసుకున్న ఒక్క సంఘటన కుటుంబంతో పాటు గ్రామస్థులను సైతం కంటతడి పెట్టించింది. ఉదయం అల్పాహారం తీసుకుని పొలానికి వెళ్తున్న వెంకమ్మ వడదెబ్బకు గురై రోడ్డుపైనే కుప్పకూలి తనువు చాలించింది. భార్య మరణం తెలుసుకున్న భర్త నాగన్న వెంటనే గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు నందికొట్కూరుకు తరలించగా అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలుపడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కొన్ని గంటల వ్యవధిలో భార్యభర్తలిద్దరూ మృతి చెందడంతో వృద్ధ దంపతుల మృతదేహాలను చూసి గ్రామస్థులు సైతం కంటతడి పెట్టారు.