కర్నూల్

వడదెబ్బతో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడబూరు : పెద్దకడబూరుకు చెందిన కోరి పార్వతమ్మ (60) వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది. మిరపపంట గ్రేడింగ్ చేయడానికి కూలీ పనికి వెళ్లి వడదెబ్బ సోకి అస్వస్థతకు గురైంది. బంధువులు చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు కర్నూలు ఆసుపత్రికి రెఫర్ చేశారు. పార్వతమ్మను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగానే మార్గ మధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
చాగలమర్రిలో..
చాగలమర్రి : మండలంలోని జ్ఞానాపురం గ్రామానికి చెందిన కాకర్లపల్లె నాగమ్మ (63) వడదెబ్బ సోకి మంగళవారం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండు మూడు రోజుల నుండి ఎండవేడిమికి, అస్వస్థతకు గురై కోలుకోలేక మరణించిందన్నారు. ప్రభుత్వం వారు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని తెలిపారు.