క్రైమ్/లీగల్

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, జూన్ 21:పగిడ్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని వనములపాడు గ్రామంలో గురువారం అనుమానంతో భార్యను భర్తే నరికి చంపిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. పగిడ్యాల మండలం వనములపాడు గ్రామానికి చెందిన ఏసన్న కుమారుడు ముత్తయ్యకు కొత్తపల్లె మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన చెన్నయ్య, చంద్రమ్మ దంపతుల కూతురు రూతమ్మను ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. పెళ్లైన కొంత కాలం తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న ముత్తయ్య నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసయ్యాడు. అనుమానం పెనుభూతంగా మారి రూతమ్మ(32)ను గొడ్డలితో నరికి చంపాడని మృతురాలి సోదరుడు లోకేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య అనంతరం ముత్తయ్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి, సీఐ వెంకటరమణ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.