కర్నూల్

మళ్లీ టీడీపీదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బండి ఆత్మకూరు, జూన్ 24 : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని, మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుందని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం బండి ఆత్మకూరు మండలంలోని జీసీ పాలెం గ్రామంలో రూ.1.25 కోట్ల పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచి రాష్ట్రాన్ని విడదీసి అప్పుల పాలు చేస్తే బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్రాన్ని, ప్రజలను నట్టేట ముంచిందని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని పరిపాలించడానికి చంద్రబాబే అర్హుడని రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని, లోటు బడ్జెట్‌లో ఉన్నా గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరుస్తూ రుణమాఫి, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయడంతోపాటు రూ.వెయ్యి పెన్షన్ పేదలకు వరంగా మారిందని తెలిపారు. మన నియోజకవర్గంలో ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు వచ్చి ఎన్నికల సమయంలో డబ్బులు వెచ్చించడానికి ప్రయత్నిస్తారు కాని తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. జీసీ పాలెంలో రూ.50 లక్షల విలువైన సిమెంటు రోడ్లు, మురుగు కాల్వలు ప్రారంభించగా, నెమళ్ల కుంటలో ఎస్‌డీఎఫ్, ఐటీడీఏల ద్వారా వచ్చిన రూ.35 లక్షల సీసీ రోడ్లు, మురుగు కాల్వలను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వం ద్వారా ఆర్‌డీటీ సంస్థ అనుసంధానంగా చెంచులకు 35 ఇళ్లను కట్టిస్తున్నట్లు తెలిపారు. అలాగే జీసీపాలెంలో 40 మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. సర్పంచ్ నాతక్క, ఉప సర్పంచ్ లింగారెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి మోడల్ విలేజ్‌గా తయారు చేసినందుకు ఎమ్మెల్యే వారిని అభినందించారు. నీరు చెట్టులో భాగంగా శ్రీశైలం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వద్ద అధిక నిధులు తీసుకువచ్చి రైతులకు పొలాలకు రహదారులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్క జీసీపాలెం గ్రామానికే రూ.1.30 కోట్లు నీరు చెట్టు నిధుల కింద పనులు జరుగగా, పుష్కరాల సందర్భంగా కాని, గత రెండేళ్ల నుండి నీరు చెట్టు నిధులు ప్రభుత్వం నుండి వస్తున్నా అప్పటి ఎమ్మెల్సీ నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోలేదని, ప్రజలకు మేలు చేస్తే ప్రజలు మనలను దీవిస్తారని తెలిపారు.