కర్నూల్

సీమ అభివృద్ధికి చంద్రబాబే అడ్డంకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జూన్ 24 : రాయలసీమ ప్రాంతాన్ని ఎలాంటి అభివృద్ధి చేసే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య విలేఖర్ల సమావేశంలో స్పష్టం చేశారు. పట్టణంలోని బీజేపి కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో కపిలేశ్వరయ్య మాట్లాడుతూ రాయలసీమలో అభివృద్ధికి ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారని ఆదే దోరణిలో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. గత కొన్నిరోజుల క్రితం గండికోట ప్రాజెక్టు ప్రాంతంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కడప జిల్లా ప్రజలుసీమ ప్రాంతాల ఓటర్లు తనకు ఓటు వేయలేదు కాబట్టి సీమ అభివృద్ధికి పని చేయనని బహిరంగంగానే ముఖ్యమంత్రి నిండు సభలో చెప్పారన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలాంటి భాష మాట్లాడడం తగదని ఆయన మనసాక్షికి వదిలివేస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతపు ప్రతినిధిగా ఒక ముఠాయి నాయకుడిగా మాట్లాడుతున్నారని అన్నారు. పట్టిసీమ నుంచి లేదా ఏ ఇతర నీటి ట్యాంకు నుంచి రాయలసీమ ప్రాంతానికి లేదా శ్రీశైలం నుంచి సీమ ప్రాంతానికి ఎంత నీటిని అందించారో తెలియజేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అపద్దాల ప్రచారంతో ముఖ్యమంత్రి పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. రాయలసీమను తెలుగుదేశం పార్టీ ఎంత వరకు అభివృద్ధి చేసిందో కర్నూలుకు వస్తే చర్చించడానికి సిద్దంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వం సీమకు చేసిన అభివృద్ధిపైన శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్రతి సంవత్సరం రూ.50కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం రూ.750కోట్లును విడుదల చేసిందని అన్నారు. కేంద్రం విడుదల చేసిన నిదులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని స్పష్టం చేశారు. సమాచార చట్టం కింద కేంద్రం విడుదల చేసిన నిధుల గురించి అడుగగా కంప్యూటర్లు కొనుగోలు చేశామని సమాదానం చెప్పారని అన్నారు. కేంద్రం అభివృద్ధి కింద రూ.లక్ష 20వేల కోట్లు విడుదల చేయగా వాటిని దారి మళ్ళించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుందన్నారు. బీజేపీ రాష్ట్ర అభివృద్దికి పాటుపడుతుంటే టీడీపీ నేతలు దోపిడి చేస్తున్నారన్నారు. జన్మభూమి పేర్లు చేబితోనే పనులు జరుగుతున్నాయని చెప్పారు.