కర్నూల్

ఆర్డీఎస్ ఆనకట్టపై సిఎం దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోసిగి, మే 24: మూడు రాష్ట్రాల మధ్య నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్టపై ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు దృష్టి సారించి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన సిఎంలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహులు, సుధాకర్, బిజెవైఎం ప్రధాన కార్యదర్శి కునిగిరి నీలకంఠ అన్నారు. మంగళవారం మంత్రాలయం నియోజకవర్గ బిజెపి ఇన్‌చార్జి శివన్న ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి బృందం ఆర్డీఎస్ ఆనకట్టను ఇరిగేషన్ డిఇ విశ్వనాథ్‌రెడ్డి, జెఇ దేవదాసు, ఎస్‌ఐ ఇంతియాజ్ బాషాలతో చర్చించి ఆనకట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీఎస్ ఆనకట్టను ఎత్తు పెంచితే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన రైతులకు నష్టం జరుగుతుందన్నారు. కర్నాటక మాత్రం జలదోపిడీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సిఎం చంద్రబాబునాయుడు పట్టిసీమ నుంచి 20 టిఎంసిల నీటివాట రాయలసీమ ప్రాంతానికి వస్తుందని చెప్పడం హాస్యాపదం అన్నారు. పట్టిసీమ, కృష్ణా డెల్టాప్రాజెక్టుల దగ్గర చంద్రబాబునాయుడు నిద్రపోవడం కంటే ఆర్డీఎస్ ఆనకట్ట, సిద్ధేశ్వర, గండికోట వంటి ప్రాజెక్టుల దగ్గర నిద్ర చేస్తేనే రాయలసీమ ప్రాంత రైతులకు లాభం ఉంటుందన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్డీఎస్ కుడివైపుల ఉన్న ఐదు స్లూయిజ్‌లగాను ఒక స్లూయిజ్‌ల నుంచి మాత్రమే ఆంధ్రవైపుకు నీరు వస్తోందన్నారు. మిగిలిన స్లూయిజ్‌లపై పాలకులు దృష్టి సారించి స్లూయిజ్‌లు తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. కుడి కాలువను మేలిగనూరు వద్ద ఏర్పాటు చేస్తే 40 టిఎంసిల నీటివాటతో రాయలసీమ ప్రాంతం ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుందని వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గుడి కాలువను ఏర్పాటు చేస్తే రాయలసీమలో కరవు ఉండదని వారు స్పష్టం చేశారు. ఆయన వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు ఆనంద్, ఉపాధ్యక్షులు నరసింహశర్మ, మంత్రాలయం నియోజకవర్గ నాయకులు రామకృష్ణ, బంగారయ్య, నల్లారెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, రామాంజి పాల్గొన్నారు.