కర్నూల్

నాగలదినె్న బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు, జూన్ 10: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నాగలదినె్న బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితరిగతిగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ఆర్‌అండ్‌బి అధికారులకు శుక్రవారం ఆదేశించారు. రూ.42 కోట్ల వ్యయంతో నిర్మింపనున్న బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మాణం నత్తనడకగా సాగుతోందని వెంటనే అధికారులు చర్యలు చేప్పటి పూర్తి చేయాలన్నారు. ఈ బ్రిడ్జి లేకపోవడంతో ఆంధ్ర, తెలంగాణ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని, ఈ బ్రిడ్జి పూర్తి అయితే రెండు రాష్ట్రాల వ్యాపార లావదేవిలు బాగా జరుగుతాయన్నారు. ఇక్కడి నుండి హైదరాబాద్‌కు వెళ్తే 70 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని, వర్షాకాలం దృష్ట్యా ఈ బ్రిడ్జిను త్వరితిగా పూర్తి గాచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నందవరం ఎంపిపి నరసింహారెడ్డి, నాయకులు ముగితి ఈరన్న గౌడ్, నందవరం దేశాయి, మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సంజన్న చౌదరి, నాయకులు రాందాస్ గౌడ్, ఆర్‌అండ్‌బి అధికారులు పాల్గొన్నారు.