కర్నూల్

షాదీఖానాకు స్థలం కేటాయించాలి:ఎమ్మెల్యే సాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, జూలై 31:ఎంపి బుట్టారేణుక నిధులతో నిర్మించనున్న షాదీఖానాకు రాంజలకు వెళ్ళే ప్రధాన రోడ్డులో స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ షాధీఖానాకు రాంజల వద్ద లోపల లక్ష్మమ్మ అవ్వ దేవాలయం వద్ద స్థలం కేటాయించడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయని అందువల్ల తాము ముందుగానే ప్రధాన రోడ్డులో ఉన్న స్థలాన్ని గురించి అక్కడ క్లిన్ చేయడం జరిగిందని అన్నారు. అయితే రెవెన్యూ అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి స్థలాన్ని లక్ష్మమ్మ అవ్వ దేవాలయం వద్ద కేటాయించడం తగదని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు వస్తున్నాయని సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ స్థల సమస్యలపై తీర్మాణం పెండింగ్‌లో ఉంచామని అధికారులు స్థలం కేటాయింపు మార్పు చేసి అందరికి సహకరించాలని ఆయన కోరారు. ఈసమావేశంలో వైస్ చైర్మన్ అల్తాప్ అహ్మద్, మాజీ వైస్ చైర్మన్ సునార్ అబ్దుల్ ఖాదర్, కౌన్సిలర్ ఇబ్రహీం, వైకాపా కన్వీనర్ చంద్రకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.