కర్నూల్

చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 31:దేశంలో అధిక జనాభా కలిగి ఉన్న బిసిలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. స్థానిక బి.క్యాంపులోని బిసి భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ సాధన కోసం బిసిలందరూ ఏకతాటిపై నిలబడి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. బిసిలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఎదిగినప్పుడే వారికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో బిసి, బిసి విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.