కర్నూల్

డిసిసి అధ్యక్షుడిగా లక్ష్మిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఆగస్టు 6 : కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు(డిసిసి)గా లక్కసాగరం లక్ష్మిరెడ్డిని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం కోట్ల పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. లక్కసాగరం లక్ష్మిరెడ్డి డోన్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా పని చేస్తున్నారన్నారు. పార్టీ తనపై పెట్టిన బాధ్యతను గుర్తించి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోతం చేయడానికి కృషి చేయాలని సూచిం చారు. డిసిసి నూతన అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ అప్పగించిన జిల్లా అధ్యక్ష బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. అలాగే పార్టీ శ్రేణుల సహకారంతో జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.