కర్నూల్

బ్రిడ్జి పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాములపాడు, ఏప్రిల్ 12:ఎస్‌ఆర్‌బిసి సర్కిల్ కింద గాలేరు నగరి సుజల స్రవంతి 24,25 ప్యాకేజీల కింద చేపడుతున్న బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయమోహన్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండల పరిధిలోని గాలేరు నగరి సుజల స్రవంతి ప్యాకేజీ బ్రిడ్జి పనులు, కాలువ వెడల్పు పనులతో పాటు ఎర్రగూడూరు గ్రామం వద్ద జరుగుతున్న 24వ ప్యాకేజీ బ్రిడ్జి పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రిడ్జి, కాలువ వెడల్పు పనులు వేగవంతంగా పూర్తిచేసి ఈ ఏడాది రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించటడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ చిట్టిబాబు, ఎస్‌ఇ శ్రీనివాసరావు, ఇఇ గంగయ్య, క్వాలిటీ కంట్రోల్ ఇఇ ఉమామహేశ్వరరావు, తెలుగుగంగ ప్రాజెక్టు ఇఇ శ్రీనివాసరెడ్డి, ఎంపిడిఓ సుధాకరయ్య, గాలేరు నగరి సుజల స్రవంతి ప్యాకేజీ ఇఇ, డిఇ, ఏఇలు, కాంట్రాక్లర్లు ఉన్నారు.