కర్నూల్

కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు, సెప్టెంబర్ 11: కాంగ్రెస్ పార్టీతోనే ఎపికి ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో అయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ రోజు కేంద్ర ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హోదా చట్టంలో అంశాన్ని చేర్పించలేదని చేప్పడం సరికాదని, ఆ రోజు 5సంవత్సరాలు కాదు 10సంవత్సరాలు ఇవ్వాలని చెప్పారు. ఇప్పడు బిజెపి ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల ఇవ్వాలని మికు తెలియద అని అయన విమర్శించారు. ఈ రోజు బిజెపి, టిడిపి ప్రభుత్వాలు తెలుగు ప్రజలకు మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసే తప్పుడు అందరితో మాట్లాడి అమోదించారని పేర్కొన్నారు. విభజన తరవాత కేంద్రం, రాష్ట్రంలో ప్రజలు ఎన్నికల్లో ఒడించారని దీనికి మేము అంగీకరిస్తున్నామని, రాబోవు రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం వస్తుందన్నారు. బిజెపి, టిడిపి పార్టీలకు ప్రజలు వ్యతీరేకంగా ఉన్నారని అయన పేర్కొన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఎదురుచూస్తున్నారని అయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని, ఈ రోజు బిజెపి ప్రభుత్వం గిట్టుబాటు కల్పించడంలో ఘోరంగా విఘలమైందన్నారు. రైతులను అదుకోవడమే కాంగ్రెస్ ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు టిడిపిలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను విలేఖర్లు ప్రశ్నించగా అయన సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు డిసిసి ప్రసిడెంట్ లక్క సాగరం లక్ష్మిరెడ్డి,కర్నూలు ఇన్‌చార్జి తులసి రెడ్డి, సుధాకర్ శేట్టి, మాజీ మార్కెట్ చైర్మన్ పార్ధసారధి రెడ్డి, మాబాషా, అంజి తదితరులు పాల్గొన్నారు.