కర్నూల్

మాలోల నారసింహునికి పీఠాధిపతి ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, అక్టోబర్ 23:ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం కొండల్లో వెలసిన నవనారసింహుల్లో ఒకరైన శ్రీమాలోల నరసింహస్వామికి ఆదివారం 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథయతీంద్ర మహాదేశికన్ స్వా మి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దిగువ అహోబిలం నుంచి ఎగువకు చేరుకున్న పీఠాధిపతికి ఆల య ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన పల్లకిలో ఎగువ అహోబిలంలో కొండపైన వెలసిన శ్రీ మాలోల నరసింహస్వామి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ ఆయనే స్వయంగా శ్రీ మాలోల నారసింహుడిని సేవించి ప్రత్యేక పూజలు చేశారు. స్వయంగా పసిడి నరసింహస్వామితో వెళ్లి మా అంటే లక్ష్మిదేవి, లోలుడు అంటే కలిగినవాడు కనుక స్వామి వారే ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ పీఠాధిపతి స్వయంగా తమ వద్ద వున్న పసిడి నరసింహస్వామిని తీసుకెళ్లి జియర్‌స్వామి వద్ద వున్న ఆభరణాలతో స్వయంగా అలంకరించి తానే స్వయంగా పూజాధి కార్యక్రమాలు నిర్వహించి, సహస్రనామార్చనలు చేశారన్నారు. ఆయా కార్యక్రమాలను తిలకించడానికి తమిళనాడు, కర్ణాటక నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నిత్యపూజలలో భాగంగా మఠంలో కొలువు ఉంచిన నరసింహస్వామికి పీఠాధిపతి స్వామి పూజలు చేశారు.