జాతీయ వార్తలు

సిబిఐ కోర్టులో హాజరైన లాలూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ (ఝార్ఖండ్): పశుదాణా కేసులో నిధుల దుర్వినియోగం విషయమై సాక్ష్యం ఇచ్చేందుకు బిహార్ మాజీ సిఎం, ఆర్‌జెడి పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సోమవారం ఉదయం ఇక్కడి సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ట్రజరీ కార్యాలయం నుంచి 3.31 కోట్ల నిధులను విత్‌డ్రా చేసిన వ్యవహారంలో ఆయనను సిబిఐ న్యాయమూర్తి ప్రశ్నించారు. పశుదాణా కుంభకోణం కేసులో దోషిగా నిరూపణ కావడంతో లాలూకు 2013లో అయిదేళ్ల జైలుశిక్షను విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.