తెలంగాణ

భూ వివాదాల వల్లే లాయర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కీసర మండలం కీసరదాయర వద్ద కారులో న్యాయవాది ఉదయ్‌కుమార్ యాదవ్‌ను సజీవ దహనం చేసిన ఉదంతంలో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు సంబంధించి మిస్టరీని పోలీసులు ఛేదించారు. భూ వివాదాల కారణంగానే న్యాయవాదిని హత్య చేశారన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. తన భర్త కనిపించకుండా పోయినట్టు మృతుని భార్య ఫిర్యాదు చేయడంతో మృతదేహానికి సంబంధించిన భాగాలను డిఎన్‌ఎ పరీక్షలకు పంపారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో అక్కడ దొరికిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు.