రాష్ట్రీయం
లోక్ అదాలత్లో 1,06,117 కేసులు పరిష్కారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 13 December 2015
హైదరాబాద్, డిసెంబర్ 12: జాతీయ లోక్అదాలత్లో ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 1,06,117 కేసులు పరిష్కారం కాగా, రూ.63.46 కోట్లు పరిహారంగా అందజేయాలని ఆదేశించినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఎపిలో 33,154 కేసులు పరిష్కారమైనట్లు ఎపి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తెలిపింది. తద్వారా రూ.45.91 కోట్లను పరిహారంగా అందజేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసేల్ ఎపి, తెలంగాణలోని అదాలత్ల నిర్వహణకు ప్యాటరన్ ఇన్ చీఫ్గా వ్యవహరించగా, ఆయన ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో ఒకేసారి జరిగిన అదాలత్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించినట్లు అథారిటీ పరిపాలనాధికారి వి.శ్రీనివాస శివరామ్ తెలిపారు.