జాతీయ వార్తలు

రాయితీ వంటగ్యాస్‌ ధర పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాయితీ వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.1.93 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. నెల వ్యవధిలో రాయితీ సిలిండర్‌ ధర పెరగడం ఇది రెండోసారి. దిల్లీలో 14.2 కేజీల రాయితీ సిలిండర్‌ ధర రూ.423.09గా ఉంది. వంటగ్యాస్‌, కిరోసిన్‌ రాయితీలను తగ్గించేందుకు ప్రభుత్వం నెలవారీగా ధరలను పెంచే పద్ధతిని చేపట్టింది. ఇప్పటికే ప్రతినెలా లీటర్‌ కిరోసిన్‌పై రూ.25 పెంచాలని నిర్ణయించగా.. తాజాగా రాయితీ వంటగ్యాస్‌పై కూడా దాదాపు రూ.2 పెంచేందుకు సిద్ధమైంది.