జాతీయ వార్తలు

మార్చి 19, 20లో బిజెపి జాతీయ కార్యనిర్వాహక వర్గం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బిజెపి జాతీయ కార్యవర్గం వచ్చే నెలలో సమావేశ మవుతుంది. మార్చి 19, 20 తేదీల్లో ఈ సమావేశం ఢిల్లీలో జరిగే అవకాశం వుంది. జాతీయ కార్య నిర్వాహక వర్గ సమావేశానికి ముందు బిజెపి అనుబంధ సంస్థలను అధ్యక్షుడు అమిత్‌షా పునర్‌వ్యవస్థీకరిస్తారు. జాతీయ స్థాయిలో పార్టీకి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఈ జాతీయ కార్యనిర్వాహక వర్గ భేటీకి ప్రధాన్యత చేకూరింది. అలాగే జెఎన్‌యు వివాదం అసహనం సహా అనేక అంశాలపై విపక్షాలు చేస్తున్న దాడులను ఏ విధంగా తిప్పికొట్టాలన్నది కూడా ఈ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశం కాబోతోందని అభిజ్ఞవర్గాలు తెలిపాయి.