జాతీయ వార్తలు

మాకో ‘శతాబ్ది’ని మంజూరు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: విజయవాడ-విశాఖపట్నం నగరాల మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేయాలని కేంద్ర పౌన విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును కోరారు. అశోక్ గజపతి రాజు గురువారం సాయంత్రం రైల్ భవన్‌లో సురేష్ ప్రభును కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా దాఖలైన రైల్వే కేసుల్లో హింసలేని కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సురేష్ ప్రభు ఆయనకు హామీ ఇచ్చారు. అశోక్ గజపతిరాజు కొంతకాలం క్రితం సురేష్ ప్రభును కలిసి విజయవాడ-విశాఖపట్నం మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఏర్పాటు చేయాలనికోరుతూ వినతిపత్రం అందజేయటం తెలిసిందే. ఆయన ఈ రోజు రైల్వే మంత్రిని కలిసి గతంలో తానిచ్చిన వినతిపత్రం గురించి గుర్తు చేశారు. రానున్న రైల్వే బడ్జెట్‌లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను చేర్చాలని విజ్ఞప్తి చేశారు.