జాతీయ వార్తలు

కోర్టు ఆదేశాల్ని పాటించనందునే మథురలో అల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: హైకోర్టు ఆదేశాలను యుపి ప్రభుత్వం పాటించకపోవడం వల్లే ఇటీవల మథురలో అల్లర్లు జరిగాయని ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ గురువారం కాన్పూరులో మీడియాతో అన్నారు. మథురలోని జవహర్‌బాగ్ పార్కును కోర్టు ఆదేశాల మేరకు ఎపుడో ఖాళీ చేయించి ఉంటే ఇద్దరు పోలీసు అధికారులు సహా 29 మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కారన్నారు. కోర్టు ఆదేశాలు అమలు కానందునే ఈ దారుణం జరిగిందన్నారు. యుపిలో ఇప్పటికే అనేక చోట్ల ప్రభుత్వ స్థలాలు ఇతరుల అధీనంలో ఉన్నాయని, ఆక్రమణలను తొలగించాలని కోర్టులు ఆదేశిస్తున్నా అవి అమలు కావడం లేదని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.