జాతీయ వార్తలు

ఫడ్నవీస్ క్యాబినెట్ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రధాని మోదీ క్యాబినెట్ విస్తరణలో తమకు అవకాశం లభించలేదని అలక వహించిన శివసేన నేతలను బిజెపి నాయకత్వం మరో రూపంలో మచ్చిక చేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శుక్రవారం కొత్తగా 9 మందితో తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. అయిదుగురు బిజెపి ఎమ్మెల్యేలకు, ఇద్దరు శివసేన సభ్యులకు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. మహారాష్టల్రో బిజెపి, శివసేన ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.