మెయిన్ ఫీచర్

తెలుగు ఫైర్‌బ్రాండ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లవి పెళ్లి చాలా సింపుల్‌గా ఓ గుడిలో
సంప్రదాయం ప్రకారం చేసుకుంది.
ఎందుకంటే గుడిలో పెళ్లి చేసుకోవడం ద్వారా మిగిలిన డబ్బుతో ముగ్గురు
పేద పిల్లలను చదివిస్తున్నారు.
ఈ ముగ్గురు కూడా మూడు మతాలకు సంబంధించిన వారు
కావటం గమనార్హం.పల్లవి పెళ్లి చాలా సింపుల్‌గా ఓ గుడిలో
సంప్రదాయం ప్రకారం చేసుకుంది.
ఎందుకంటే గుడిలో పెళ్లి చేసుకోవడం ద్వారా మిగిలిన డబ్బుతో ముగ్గురు
పేద పిల్లలను చదివిస్తున్నారు.
ఈ ముగ్గురు కూడా మూడు మతాలకు సంబంధించిన వారు
కావటం గమనార్హం.

కర్నాటకలో బలంగా వేళ్లూనుకుపోయన ఎగ్జామ్ మాఫియా
భరతం పట్టటానికి ఆమె జగమొండిగా వ్యవహరించారు.
ఇంటర్‌బోర్డు వాళ్లు ఆ మాఫియాకు ఏ రేంజ్‌లో సహకరిస్తున్నారో పల్లవికి అర్థమైంది. ఈ పేపర్ లేకేజ్ ముఠాలు వందల కోట్ల టర్నోవర్‌తో
వ్యాపారాలు చేస్తున్నాయి. పల్లవి పుణ్యమా అని వాళ్ల గుట్టు రట్టయింది. ఈ సందర్భంగా బెదిరింపులు వచ్చినా వెరవలేదు.

ఆకురాతి పల్లవి. కర్ణాటకలో
ఈ పేరు ఓ సంచలనం. నిజాయితీగల ఐఎఎస్ ఆఫీసర్. విక్రమార్కుడులో ప్రకాశ్‌రాజ్ భాషలో చెప్పాలంటే.. ‘2009 బ్యాచ్.. కర్ణాటక కేడర్.. 6 సంవత్సరాల సర్వీస్, 9 ట్రాన్స్‌ఫర్లు.. అంటే కెరీర్‌లో ఎక్కడా రాజపడలేదన్నమాట’.

విధి నిర్వహణలో రాజీ పడదు. మాఫియా బెదిరింపులు, నాయకుల హెచ్చరికలు అసలే లెక్కచేయదు. సమర్థత నిజాయితీనే నమ్ముకుని తనదైన శైలిలో పరిపాలనాధికారిగా ముద్రవేసుకున్న తెలుగు ఐఏఎస్ ఆఫీసర్. సాదాసీదాగా కనిపించే ఆమె కర్ణాటకలో రాజకీయనాయకులకు, మాఫియా గ్యాంగ్‌లకు ముచ్చెమటలు పోయస్తోంది. కర్ణాటక ప్రజల గొంతుకలో పల్లవిగా మారింది. వివరాల్లోకి వెళితే...
ఆకురాతి పల్లవి. కర్ణాటకలో ఈ పేరు ఓ సంచలనం. ఆమె ఎక్కడకు వస్తే అక్కడ అవినీతిపరులు హడలెత్తాల్సిందే. పనిచేయని ఉద్యోగులు విలవిల్లాడాల్సిందే. కొందరు మొండివాళ్లుంటారు. రాజకీయ నాయకులకు లొంగరు. తమ పని తాము చేసుకుపోవడమే కాదు, తమ పరిధిలో పని కూడా తమ కనుసన్నల్లోనే చేయిస్తుంటారు. పల్లవి కూడా ఆ బాపతే. అందుకే ఆమె అంటే రాజకీయ నాయకులకు మంట. ఇష్టం వచ్చినన్నిసార్లు ఆమెను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆమె మాత్రం వారికి తలవంచలేదు. ఎక్కడా తగ్గలేదు.
మాఫియా గుట్టు రట్టు
పల్లవి విధి నిర్వహణలో ఎంత ఖచ్చితంగా ఉంటారో ఎన్నో ఘటనలు నిదర్శనంగా నిలుస్తాయ. ఆవిడ ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ ఘటన జరిగింది. కర్ణాటకలో ఇంటర్ పరీక్షలంటే పిచ్చ లైట్. ఇంటర్ పేపర్లు లీక్ అవడం అక్కడ మామూలు విషయం. పల్లవి బోర్డు డైరెక్టర్ పదవిలో ఉన్నప్పుడు ఓ ఘటన జరిగింది. ఆమె వాట్సప్‌కి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఆరోజు జరగాల్సిన కెమిస్ట్రీ పేపర్ ఉంది. ఇంటర్ ఎగ్జామ్ రాయాల్సిన ఓ కుర్రాడు పంపిన మెసేజ్ అది. వాట్సప్ చూసి లైట్ తీసుకోలేదు. వెంటనే పరీక్ష రద్దుచేశారు. మళ్లీ ఎగ్జామ్ పెట్టారు. రీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయింది. ఎగ్జామ్ మాఫియా, ఇంటర్‌బోర్డు వాళ్లు కలిసి విద్యార్థుల జీవితాలను ఆడుకుంటున్నట్లు అర్థమైంది పల్లవికి. మళ్లీ రెండో ఎగ్జామ్ కూడా రద్దుచేశారు. దీంతో మాఫియా నుంచి బెదిరింపులు వచ్చినా పల్లవి తగ్గలేదు. కేసు నమోదుచేసి, విచారణ సిఐడికి అప్పగించారు. విచారణలో ఈ పేపర్ లేకేజ్ ముఠాలు వందల కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాలు చేస్తున్నాయి. పల్లవి పుణ్యమా అని వాళ్ల గుట్టు రట్టయింది.

ఇంకా ఎనె్నన్నో విజయాలు...

ఎండోమెంట్ కమీషనర్‌గా పల్లవి విజయాలు కూడా చాలా గొప్పవే. తన హయాంలో దాదాపు 600 కోట్ల రూపాయల విలువైన దేవాదాయ ఆస్తులను కాపాడారు. రాజకీయ నాయకులు ఆక్రమించుకున్న కోట్లాది రూపాయల దేవాదాయ భవనాలు విడిపించారు. బెంగుళూరు సిటీ మధ్యలో అసలు గవర్నమెంట్ భూమి అని ఎవరికీ తెలియనంతగా ఆక్రమణలు జరిగిపోయాయి. వాటిని కూడా వదల్లేదీమె. చివరకు ఖాళీ స్థలాలు కనిపిస్తే ఎక్కడ ఆక్రమిస్తారో అని, ఖాళీ దేవాలయ స్థలాల్లో ఫంక్షన్ హాల్స్ కట్టించేసి, వాటిని అద్దెకు ఇచ్చే ఏర్పాటుచేశారు. దీంతో సర్కారు స్థలానికి రక్షణ, ఆదాయం రెండూ వస్తున్నాయి. పల్లవి తీరు గురించి చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే. సకలేశ్‌పూర్‌లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు ఓ ముస్లిం మహిళ పొలానికి వెళ్లే దారిని ఓ నాయకుడు ఆక్రమించుకుంటే, పల్లవి ఆ భూమిని విడిపించారు. ఆ తరువాత పల్లవి గుల్బర్గా ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోతుంటే ఆ మహిళ వచ్చి పల్లవి చేతులు పట్టుకుని ఏడ్చేసిందట. అది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంటారు పల్లవి.
తెలుగు మీడియంలో ఐఎఎస్ పాస్ అయిన మొదటి మహిళ
గుంటూరు జిల్లాకు చెందిన పల్లవి తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తల్లి గృహిణి. సివిల్స్‌లో 101వ ర్యాంకు సాధించింది పల్లవి. పల్లవి మూడుసార్లు సివిల్స్ పాసయింది. తక్కువ ర్యాంక్‌వల్ల వేరే సర్వీసులు వచ్చాయి. కానీ ఈమెకు ఐఎఎస్ అంటే ఇష్టం. ఆఖరికి ఐపిఎస్ వచ్చినా తీసుకోలేదు. ఖచ్చితంగా ఐఎఎస్ మాత్రమే కావాలని పట్టుదలతో మూడోసారి ర్యాంక్ కొట్టింది. ఐఎఎస్ ప్రిపరేషన్‌కి పల్లవికి 8 సంవత్సరాలు పట్టింది. దానికి ప్రత్యేక కారణం ఉంది. చిన్నప్పటినుంచీ తెలుగు మీడియంలోనే చదివింది. సివిల్స్ కోసం చాలా కష్టపడింది. ఇంగ్లీష్ రాకపోవడంతో ఓ దశలో దెబ్బతిని, మళ్లీ పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకుంది. తెలుగుమీడియంలో, గవర్నమెంటు స్కూళ్లలో చదివినా ఐఎఎస్ సాధించడానికి ఇబ్బంది కాదని నిరూపించడానికి పల్లవి ఓ ఉదాహరణ. తెలుగులో సివిల్స్ రాసినా, ఇంటర్వ్యూలో ఇబ్బంది అయింది. ఇంటర్వ్యూ చేసేవాళ్లకు, అభ్యర్థికీ మధ్య ఉండే తెలుగు అనువాదకులతో సమస్య వచ్చింది. దానికితోడు తెలుగులో సిలబస్ దొరక్క కష్టపడాల్సి వచ్చింది. ఇంగ్లీషులో మెటీరియల్ చదివి, వాటిని ట్రాన్సిలేట్ చేసుకుని.. ఇలా ఎంతో కష్టపడి సివిల్స్ కొట్టింది. తెలుగు మీడియంలో ఐఎఎస్ పాస్ అయిన మొదటి మహిళ ఆకురాతి పల్లవే.
పల్లవిలో చాలా కళలున్నాయి
మామూలుగా ఐఎఎస్ ఆఫీసర్ల గురించి బయటకు చాలా తక్కువ విషయాలు తెలుస్తాయి. పుస్తకాల పురుగుల్లా వుంటేనే ఐఎఎస్ అవుతారని చాలామంది అనుకుంటారు. కానీ పల్లవిలో మాత్రం చాలా కళలు ఉన్నాయి. ఆమె ఒక కూచిపూడి డాన్సర్. తెలుగులో కవితలు రాస్తుంటారు. వాటిని ఇంగ్లీష్ అనువాదాలతో తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తారు. శ్లోకాలు రాగయుక్తంగా పాడతారు. పెయింటింగ్ పల్లవి హాబీ. ఇంటిముందు ముగ్గులు పెట్టడం, అరచేతిలో గోరింటాకు (మైదా/మెహందీ) పెట్టడం, బట్టలపై డిజైన్లు దిద్దడం (ఎంబ్రాయిడరీ)లో పల్లవి దిట్ట. ఐఎఎస్ స్థాయికి వెళ్లిన అమ్మాయిలు ఇన్ని విషయాల్లో బెస్ట్‌గా వుండడం, వాటిని ప్రాక్టీసు చేయడం అరుదైన విషయమే. పల్లెటూళ్లలో పర్యటనలకు వెళ్లినపుడు ఐఎఎస్ అంటే ఏంటో తెలియని ముసలమ్మలు కూడా పల్లవిని బాగా అభిమానిస్తారట. పల్లవి పరిపాలన గురించి వాళ్లకేమీ తెలియదు. కానీ ఆమెను అభిమానించడానికి ఇంకో కారణం ఉంది. అది పల్లవి డ్రెస్సింగ్. అవును.. ఆమె చీర కట్టుకునే తీరు. జడలో పువ్వులు, బొట్టు. కర్ణాటకలో ఓ పెద్దావిడ పల్లవికి ఓ ముద్దుపేరు పెట్టింది. కణమ్మ అని ముద్దుగా పిలుస్తుంది. కణమ్మ అంటే బంగారుబొమ్మ అనే అర్థం చెప్పుకోవచ్చు.
ముగ్గురు పిల్లలను చదివిస్తోంది...
విధి నిర్వహణలో చూపించే సమర్థతే కాదు. అంతకుమించిన సేవా దృక్పథం కూడా ఆమెలో మెండుగా ఉంది. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా శిక్షణ ఇస్తుంది. పేద అమ్మాయిలకు తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి కోచింగ్ ఇస్తోంది. పల్లవి పెళ్లి చాలా సింపుల్‌గా ఓ గుడిలో సంప్రదాయం ప్రకారం చేసుకుంది. ఎందుకంటే గుడిలో పెళ్లి చేసుకోవడం ద్వారా మిగిలిన డబ్బుతో ముగ్గురు పేద పిల్లలను చదివిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా మూడు మతాలకు సంబంధించిన వారు కావటం గమనార్హం. ఇంటి పేరుతో పాటు అసలు పేరును సార్థకం చేసుకుంటున్న ఈ అధికారిణి ఆమె మాటల్లో అవి వెల్లడవుతాయ. పల్లవి ఇంటిపేరు ఆకురాతి. తన హృదయం చిగురుటాకులాంటిదనీ.. కానీ తన ఆలోచన, బుద్ధి మాత్రం వజ్రం అంత కఠినమనీ తన గురించి చెబుతారు పల్లవి.
*