మెయిన్ ఫీచర్

పాలి ‘ట్రిక్స్’ ఈజీ కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిమానుల ఈలలు, కేకలు, గోల చూసి, ఉబ్బితబ్బిబ్బైపోయిన మన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ప్రజానాడి అంటే ఓటర్లనాడి తెలియక, ఎన్నికలపై అవగాహన లేకుండా, పార్టీ రాజకీయాలను అర్థం చేసికోకుండా పరుగులు తీసారు. సభలకు చిరంజీవిని దగ్గరగా వచ్చి చూద్దామనుకుని వచ్చిన ప్రజలను, వారితోపాటు ఈలలువేస్తున్న అభిమానులను చూసి, జనసంద్రం నావైపు వుంది. నాకోసం వచ్చారు- ఓట్లు కుప్పలుతెప్పలుగా వచ్చి, బ్యాలెట్ బాక్సులు నిండిపోతాయి. నేనే ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుకుంటూ కలర్‌లో డ్రీమ్ సాంగ్ వేసుకుని, చివరకు బోర్లాబొక్కల పడ్డాడు. ప్రజారాజ్యం పార్టీ టైటానిక్ నవలలా ముక్కలు-చెక్కలైపోయింది. కల కరిగిపోయింది. సరే అదంతా విషాధ గాథగా మరచిపోదాం. నేడు అదే డ్రీమ్ సాంగ్, తమిళనాట ‘కమల్‌హాసన్-రజనీకాంత్’ తెలుగునాట ‘పవన్‌కళ్యాణ్’ ముఖ్యమంత్రి హోదాలో సీటుపై ఆశీనులైనట్లు కలలుకంటున్నారు. వారికంతా అభిమానులపై నమ్మకం, గెలిపిస్తారని భరోసా వుండి వుండవచ్చు. కాని అభిమానులలో సగం మంది మైనర్లని, వారికి ఓటుహక్కు వుండదని మాత్రం గ్రహించలేకపోవడం విచారకరం.
*
చలనచిత్ర హీరోలు (నటులు) వెండి తెరపై తళుక్కున మెరుస్తూ, అప్పుడప్పుడు రాజకీయాలలో ‘గెస్ట్‌రోల్స్’పోషిస్తుంటారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ‘రోనాల్డ్ రీగన్’, నేటి అమెరికా ప్రెసిడెంట్ ‘డోనాల్డ్ ట్రంప్’, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ‘అర్నాల్డ్ స్వార్జనెగ్గర్’ (టెర్మినేటర్ చిత్ర హీరో) ఆ కోవకు చెందినవారే. మన టాలీవుడ్ రంగానికి వస్తే చాలామంది నటీనటులు యం.ఎల్.ఏలుగా, ఎంపీలుగా, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా అలా కనిపించి వెళ్లినవారే. కనిపిస్తున్నవారే. అయితే రాజకీయాలకు అంకితమైపోయి అక్కడ సైతం ఉజ్వలంగా వెలిగిపోయింది. తమిళ నాట భారతరత్న దివంగత ‘యంజిఆర్- దివంగత జయలలిత’ అయితే, మన తెలుగునాట ‘దివంగత నందమూరి తారకరామారావు’ మాత్రమే. వారు పేదల పాలిట పెన్నిధిగా గుర్తింపుతో చక్కని పరిపాలన చేశారు. కీర్తిప్రతిష్ఠలు మూటకట్టుకున్నారు. చరిత్రలో గొప్పవారుగా మిగిలిపోయారు. అభిమానుల ఈలలు, కేకలు, గోల చూసి, ఉబ్బితబ్బిబ్బైపోయిన మన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ప్రజానాడి అంటే ఓటర్లనాడి తెలియక, ఎన్నికలపై అవగాహన లేకుండా, పార్టీ రాజకీయాలను అర్థం చేసికోకుండా పరుగులు తీసారు. సభలకు టైంపాస్‌కు వచ్చిన ప్రజలకు ఏంచెబుతారో విందామనుకుని వచ్చిన ప్రజలను చిరంజీవిని దగ్గరగా వచ్చి చూద్దామనుకుని వచ్చిన ప్రజలను, వారితోపాటు ఈలలువేస్తున్న అభిమానులను చూసి, జనసంద్రం నావైపు వుంది. నాకోసం వచ్చారు- ఓట్లు కుప్పలుతెప్పలుగా వచ్చి, బ్యాలెట్ బాక్సులు నిండిపోతాయి. నేనే ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుకుంటూ కలర్‌లో డ్రీంసాంగ్ వేసికుని, చివరకు బోర్లాబొక్కల పడ్డాడు. ప్రజారాజ్యం పార్టీ టైటానిక్ నవలలా ముక్కలు-చెక్కలైపోయింది. కల కరిగిపోయింది. సరే అదంతా విషాధ గాథగా మరచిపోదాం. నేడు అదే డ్రీంసాంగ్, తమిళనాట ‘కమల్‌హాసన్-రజనీకాంత్’తెలుగునాట ‘పవన్‌కళ్యాణ్’ ‘రోం నగర శిథిలాల’వద్ద, ‘ప్యారిస్ ఈఫిల్ టవర్’వద్ద, అద్దాల మేడలతో నిండిన ‘న్యూయార్క్ మహానగరం’లో, న్యూజిలాండ్ ‘మంచు పర్వతముల’వద్ద ముఖ్యమంత్రి హోదాలో సీటుపై ఆశీనులైనట్లు కలలుకంటున్నారు. వారికంతా అభిమానులపై నమ్మకం, గెలిపిస్తారని భరోసా వుండి వుండవచ్చు. కాని అభిమానులలో సగం మంది మైనర్లని, వారికి ఓటుహక్కు వుండదని మాత్రం గ్రహించలేకపోవడం విచారకరం. రాజకీయ నాయకులు ‘ఓట్లు కొనడంలోను, మందు విందులతో ఓటర్లను ప్రలోభపెట్టడం, రిగ్గింగ్, దౌర్జన్యాలు చేయడంలో సిద్ధహస్తులు. అసలు మన దేశంలో ఎన్నిక సరళే బూటకం అనుకోవలసిందే. న్యాయబద్ధంగా ఏనాడు ఎన్నికలంటూ జరగలేదు. ఆర్థిక బలం- అంగబలం వున్న రాజకీయ రక్కసులనెదిరించడం అంత సులభం కాదు. పదవికోసం గెలుపుకోసం రాజకీయ నాయకులేమైనా చేయగల సమర్థులు. ఏ చట్టం వారిని ఎదిరించలేదు. శిక్షించలేవు. అలాంటి చచ్చు చట్టాల దేశం మనది. ఉన్నవన్నీ వేస్ట్ చట్టాలే. ఆ వేస్ట్‌ను కూడా అమలుపరచలేని ప్రభుత్వాలు మనవి. కాబట్టి మన దేశంలో చట్టాలున్న విషయం మనం మరచిపోవలసిందే. యం.జి.ఆర్. తన సేవాగుణంతో, ధర్మగుణంతో ప్రజాహృదయాలను గెలుచుకుని రాజకీయ విజయం సాధించారు. మచ్చలేని నాయకుడిగా కీర్తించబడ్డాడు. అదే బాటలో పయనించి, రాజకీయ ఓనమాలు యం.జి.ఆర్.వద్ద దిద్దుకుని తిరుగులేని నాయకురాలైంది. ‘జయలలిత’ (ఆస్థులు-సంపాదనలు ఆమె స్వవిషయం ఇక్కడ ఆ చర్చవద్దు) ‘ఆంధ్రుల ఆత్మగౌరవ’ నినాదంతో ఎన్‌టిఆర్ ముందుకు వచ్చి, ఎన్నికల్లో విజయ దుందుభి మ్రోగించి, చక్కని పరిపాలనతో ఆకట్టుకుని ముఖ్యమంత్రి పదవికే వనె్నతెచ్చారు. పలు పథకాలతో అవినీతికి చెక్‌పెట్టి ప్రజారంజకంగా పరిపాలన సాగించి కన్నుమూశారు. నేడు రాజకీయాలలో అరంగేట్రం చేయాలనుకుంటున్న హీరోలు నాలుగు పాటలు, ఐదు ఫైటింగులు కాదని, అవినీతిని, స్వార్థాన్ని, మోసాలను, నమ్మక ద్రోహాలను, వంచనను, చెడును ఎదుర్కోగల సత్తావుండాలని గ్రహించినట్లు లేరు. రాజకీయ రంగమంటే ‘స్టైల్‌గా ఫోజులుకొట్టడం కాదు, అందమైన అందాల బొమ్మలను కౌగలించుకోవడం కాదు. పిచ్చిపిచ్చి అష్టవంకరల స్టెప్పులుకాదు, దెబ్బకు పది మంది వస్తాదులను కొట్టడంకాదు. పల్లీని, సిగరెట్‌ను పైకెగరేసి నోట్లోకి వేసికోవడం కాదు, చలువ అద్దాలను అటుఇటు తిప్పి పెట్టుకోవడం కాదు, పంచ్ డైలాగులు వల్లించడం కాదు. అధికారంతో అందిన కాడికి దోచుకోవాలి. ఆ సొమ్మును స్విస్ బ్యాంకుకు దొంగదారిలో పంపించుకోవాలి. అక్రమాలు-అన్యాయాలు- అవినీతి పనులకు అలవాటుపడాలి, మానం-అభిమానం- నిజాయితీ- వ్యక్తిత్వాన్ని చంపుకుని పార్టీలు మోయాలి. పని వున్న లేకపోయినా ఇతర పార్టీలపై, నాయకులపై దుమ్మెత్తిపోస్తుండాలి. తమ పార్టీని వెనుకేసుకు రావాలి, పదవులకై కుట్రలు పన్నాలి. కోట్లుచేతులు మార్చాలి. దిక్కుమాలినన్ని వెధవ పనులుచేయాలి. నిజజీవితంలో ‘విలన్’పాత్రలు చేయాలి. పలు సనిమాలలో రాజకీయ నాయకుల విశ్వరూప పాత్రలు చూసి వుంటారు. అలాంటి అసహ్యమైన రాజకీయాలలోకి వెల్లడమంటే గంజాయివనంలో తులసి మొక్క నాటడమే ఔతుంది. రాజకీయాలలో మార్పురావడంకల్ల, అవినీతిని అంతం చేయడంకల్ల, రామరాజ్యం స్థాపించడంకల్ల. తెలిసి తెలిసి ‘వైకుంఠపాళి’ ఆడడం కొరివితో తలను గోక్కున్నట్లేనని ఈ నూతన హీరోలు తెలిసికోవాలి. సభకు జనం రావాలంటే లారీలు లారీలు తోలాలి. మందు- బిర్యానీ ప్యాకెట్లు వెదజల్లాలి. పార్టీలుమారే గోడమీది పిల్లులను, రంగుల ఊసరవెల్లులను, ఏ ఎండకాగొడుగు పట్టే అవకాశవాదులపై ఓ కనే్నసి వుంచాలి. వారి వారి కుట్రలను ఊహించగలగాలి. అలాఅలా చేయగలిగిన వారే రాజకీయాల్లో రాణించగలరు. సంపాదించిన కోట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందం కాకుండా చూసుకోండి. బుద్ధి-జ్ఞానం- క్యారెక్టర్- నిజాయితీ- మానం- అభిమానం లేనివారు తప్ప మరెవ్వరూ నేటి రాజకీయాలలో రాణించలేరు. అందరూ యం.జి.ఆర్., ఎన్.టి.ఆర్.లు కాలేరు. వాపును బలుపుగా భావించకండి. అభిమానులందరూ ఓటర్లుకాదని, అభిమానులు- కార్యకర్తలు రాజకీయ రౌడీలకు గుండాలకు సరిరారని, వారిని ఎదిరించి ఓట్లు దండుకోలేరని ‘ప్రజాపార్టీ’ ఋజువుచేసింది. అందువలన ఆచితూచి అడుగులు వేయవలసిందిగా ఈ నూతన పార్టీల హీరోలను కోరుకుందాం. ఓటర్లువేరు- అభిమానులు వేరన్నది గ్రహిస్తే చాలు. రాజకీయ కుళ్లు- కుతంత్రాల నెలా ఎదిరిస్తారన్నదే ముఖ్య ప్రశ్న.
ఎవరోవస్తారని ఏదో చేస్తారని అనుకుంటూ ప్రజలు (ఓటర్లు) ఈ ముగ్గురు అరంగేట్రంచేస్తున్న హీరోలను ఆదరిస్తారో లేదోనన్నది కాలమే (ఎన్నికలే) నిర్ణయిస్తుంది. తెరపై హీరోలు ముగ్గురు ఎన్నికల్లో హీరోలుగా నిలబడతారో లేక జీరోలుగా చిరునామా కోల్పోతారో చూద్దాం. ఏది ఏమైనా ప్రజాసేవ చేయాలన్న దృక్పధంతో ముందుకు వచ్చారు. పార్టీలను స్థాపించుకున్నారు, ఎన్నికల రణరంగమునకు సిద్ధవౌతున్నారు. వారి ఆశయాలు-ఆలోచనలు సిద్ధించాలని ఆశిద్దాం. వారివారి సేవా తపనను ఓటర్లు ఎలా గుర్తిస్తారో చూద్దాం. కొత్తతరం రాజకీయాలను ఆహ్వానిద్దాం. ఎందరినో చూశాం. నెట్టివేశాం. వీరిని ఒకసారి గెలిపించి చూస్తే పోయేదేమి లేదు. ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు. ఈ హీరోలు ఎలా కృషిచేస్తారో చూద్దాం.

-మురహరి ఆనందరావు