మెయన్ ఫీచర్

సమర్ధుడికి సవాలక్ష సవాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్ర పోనివ్వను..’’
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్ళకు పైగా ముఖ్య మంత్రిగా పనిచేసిన రోజుల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడి డైలాగ్ ఇది. ఆ రోజుల్లో సంగతేమో కానీ, 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన కంటినిండా కునుకు తీసిన దాఖలాలు కానరావడం లేదు. మొదటిది ఆయన రాజకీయ జీవితంలో స్వర్ణ యుగం. రెండోది ఏమిటన్నది కాలమే చెప్పాలి!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంలోకి ఆయన భార్యగా లక్ష్మీపార్వతి ప్రవేశం అనేది- ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన ఇద్దరు నేతల జీ వితాలను పెద్ద మలుపు తిప్పిందనే చెప్పాలి. అందులో ఒకరు ఎన్టీఆర్ కాగా, రెండో వ్యక్తి చంద్రబాబు. అయిదేళ్ళ విరామం తర్వాత అధికార పీఠం ఎక్కిన కొద్ది మాసాలకే ఒకరు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగా, మరొకరు అనూహ్యంగా ముఖ్యమంత్రి కాగలిగారు. 1995లో తెలుగుదేశం పార్టీలో ఊహకు అందకుండా జరిగిన రాజకీయ పరిణామాల దరిమిలా ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఏడాది కాలాన్ని ఆయన తన అధికారాన్ని పదిలం చేసుకోవడం పట్లనే ఎక్కువ శ్రద్ధ చూపారు. ఎన్టీఆర్ ఆకస్మిక మరణం తర్వాతి పరిణామాలు బాబుకు పరిస్థితి అనుకూలంగా మారడానికి దోహదం చేశాయ. 1996 లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని తెదేపా మొత్తం 42 స్థానాల్లో 16 సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీ అధినాయకుడిగా ఆయనకు ప్రజల ఆమోదం లభించి నట్టయింది. ఆ విజయం ఆయనకు ఎంతో నైతిక బలాన్ని ఇవ్వడంతో ఆ తర్వాత పరిపాలనా వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ కనబరచడం మొదలుపెట్టారు. యువకుడు కావడం, ఆలోచనల్లో నవ్యత్వం, వాటిని ఆచరణలో పెట్టడంలో కొత్తదనం, వీటికి తోడు పత్రికల ద్వారా లభించే సా నుకూల ప్రచారం చంద్రబాబును యువతరానికి ఆరాధ్య రాజకీయ నాయకుడిగా మార్చివేశాయి. సీఎం పేషీలో సమర్ధులు, విధేయులైన అధికారుల సాయం కూడా ఆయనకు అక్కరకు వచ్చింది. అప్పుడు కేంద్రంలో తన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వం ఉండడం చంద్రబాబుకు కలిసివచ్చిన మరో అంశం.
ఎన్టీఆర్‌ను గద్దె దించి అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ, (1983లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ స మయంలో మాదిరిగా) ప్రజల నుంచి వ్యతిరేకత పెద్దగా వ్యక్తం కాకపోవడంతో- చంద్రబాబు అనేక కొత్త పథకాలతో, ప్రణాళికలతో పనిచేయడం ప్రారంభించారు. రాష్ట్రం కోసం తాను రోజుకు పద్దెనిమిది గంటలు కష్టప డుతున్నట్టు ప్రజలు నమ్మేలా చేయడంలో ఆయన కృతకృత్యులు కాగలిగారు. పనిచేస్తున్న ముఖ్యమంత్రి అనే పేరు ఇంటాబయటా మారుమోగడంతో చంద్రబాబు ధైర్యం చేసి, ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సబ్సిడీ బియ్యం పథకం, వ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీ పథకాలతో పాటు పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి దోహదం చేసిన సంపూర్ణ మద్య నిషేధాన్ని కూడా ఎత్తి వేశారు. రాజకీయ ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలకు దిగినా, అప్పటికే చంద్రబాబు సమర్ధత పట్ల నమ్మకం పెరిగిన ప్రజలు ఈ నిర్ణయాల పట్ల పెద్దగా విముఖత చూపలేదు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళకు మోక్షం కల్పించడానికి ఉద్యమ రూపంలో చేసిన ప్రయత్నాలు, రేడియో, దూ రదర్సన్‌ల ద్వారా ప్రజలతో వారం వారం ముఖాముఖి, రైతులు, ఇతర బలహీన వర్గాల కోసం వినూత్నంగా ప్రారంభించిన రైతుబజార్లు, దీపం వంటి పథకాలు, ఎక్కడ ఏ సంఘటన జరిగినా రెక్కలు కట్టుకుని హెలికాప్టర్‌లో వాలిపోవడం, రాజధాని నగరం పొ లిమేరల్లో సైబరాబాదు పేరుతో నవనగర నిర్మాణం, ప్రపంచ కంప్యూటర్ పఠంలో హైదరాబాదుకు స్థానం లభించేలా కృషి చేయడం, ప్రతిష్టాత్మక కంప్యూటర్ కంపెనీలు హైద రాబాదుకు తరలి వచ్చేలా చేయడం ఇవన్నీ... ఒక కొత్త తర హా ముఖ్యమంత్రిని చంద్ర బాబులో చూస్తున్నామని ప్రజానీకం అనుకునేలా చే యగలిగాయి. ఎన్నికల వేళ మాత్రమే తాను రాజకీయాలు మాట్లాడతానని, మిగిలిన స మయాల్లో రాష్ట్భ్రావృద్ధి మి నహా తనకేదీ పట్టదని అ ప్పట్లో ఆయన తరచూ చెబు తుండేవారు. ‘పరిపాలనను మెరుగు పరచడానికి ఏమి చేస్తే బాగుంటుంద’ని చంద్రబాబు తనను చూడవచ్చిన మేధా వులను, విలేకరులను అడిగేవారు. తన వేగాన్ని పాలనా యంత్రాంగం అందు కోలేకపోతున్నదని, వాళ్ళలో ఆశించిన స్పందన కానరావడం లేదని మధ నప డేవారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో చంద్రబాబు తరహా వేరని ఆయనతో కలసి పనిచేసిన ఆనాటి అధికారులు చెబుతారు.
ఆయన తన మనసులో మాట బయట పెట్టరు. ‘నేనిలా చేద్దామనుకుంటున్నాను, మీ అభిప్రా యం ఏమిటి?’-అని అడగరు. కానీ, కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యులు అని ఆయన అనుకున్నవాళ్ళ సలహాలను విధిగా తీసుకునేవారు. వాటన్నిటినీ కూ లంకషంగా ఆలోచించుకుని ఒక అభిప్రాయానికి వచ్చేవారు. దాన్ని తన ముఖ్య సలహాదారులతో ముందు పంచు కునే వారు. ప్రజలనుంచి, పత్రిక లనుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని ఆరా తీసేవారు. ఈ రీతిలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే చంద్రబాబును చూసి ఆయన ప్రజ్ఞకు అంతా ముగ్డులయేవాళళు. అయితే, ఈ క్రమంలో చాలా కాలయాపన జరుగుతోందనే విషయాన్ని ఆయన అసలు పట్టించుకునేవారు కాదు.
దేశ విదేశాల్లో తన సమర్ధత గురించి మాట్లాడుకునేలా చేయడంలో కూడా ఆయన విజయం సాధించారు. ‘బిజినెస్ వీక్’ పత్రిక, 1999 జూన్ సంచికలో చంద్రబాబుపై ప్రచురించిన ప్రత్యేక వ్యాసంలో ఆయన గురించి ప్రశంసలు గుప్పించింది. ఆయనను ‘స్టార్ ఆఫ్ ఆసియా’గా అభివర్ణించింది. అలాగే, టైమ్ మేగజైన్- ‘తన సంస్క రణలతో దేశంలో ఇతర ప్రాంతాలను అధిగమిస్తూ, ఆంధ్రప్రదేశ్ స్వరూపానే్న మారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు’ అంటూ ప్రస్తుతించింది. ‘ఇతను మామూలు రాజకీయ నేత కాదు. శాంతియుతమైన విప్లవకారుడు’-అని ‘న్యూస్‌వీక్’ పత్రిక కితాబు ఇచ్చింది. లండన్ నుంచి వెలువడే ఫైనాన్సియల్ టైమ్స్ పత్రిక ‘్భరత దేశపు దార్శనికుడు’ అనే శీర్షికతో ఓ వ్యాసం ప్రచురించింది. ‘ఆయన నిజాయితీ, ఈ-గవర్నెన్స్ పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి రాజకీయ రంగంలో అగ్రభాగానికి చేరుకునేలా చేశాయి’ అని పొగిడింది. ‘ఎకనమిస్ట్’ పత్రిక ‘డిజిటల్ విప్లవం పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్దత చాలా గొప్పది. నిజానికి ఈ విషయంలో మొత్తం భారత దేశానికి ఉండాల్సిన తెగువను ఆయన ఒక్కరే ప్రదర్శించి చూపారు’ అని రాసింది. ఇలా ప్రశంసల వర్షంలో చంద్రబాబు తడిసిముద్దయ్యారు. దేనికీ పడని వారు పొగడ్తకు పడ తారంటారు. తనకు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఈ పేరు ప్రఖ్యా తులు ‘ఇంకా ఏదో చేసి చూపిద్దాం’ అనే యావను ఆయనలో రగిలించాయి. మరింత ముందుకు దూకేలా ఆయనను ప్రోత్సహించాయి. ఈ క్రమంలో ఒకవైపు ముందుకు దూసుకుపోతున్నా, మరో వైపు పాల కుడిగా నిర్వర్తించాల్సిన కొన్ని ముఖ్యమైన వి షయాల్లో వెనుకపడి పోతున్న విషయాన్ని ఆయన విస్మరించారేమో అనిపిస్తుంది.
చంద్రుడికి పున్నమి, అమావాస్యల మాదిరిగా చంద్రబాబు నాయుడి పాల నకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా తప్పలేదు. ప్రపంచ బ్యాంకు తాబేదారుగా ప్రతిపక్షాలు ఆయనపై ముద్ర వేశాయి. సంస్కరణల వేగంలో తమకు అన్యాయం జరుగుతోందని అట్టడుగు వర్గాలు అనుమానించడం ప్రారంభించాయి. భుజాన కంప్యూటర్ బ్యాగ్ తగిలించుకుని వెడితే చాలు సచివాలయం గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయనీ, ముఖ్య మంత్రి దర్శనం ఇట్టే జరిగి పోతుందనే వ్యంగ్య వ్యాఖ్యానాలు వినబడడం మొదలైంది. ఈ ఆరోపణలు, విమర్శల హోరులో ఆయన చేసిన మంచి కొట్టుకుపోయింది. ‘చేయని మంచి’ సామాన్య జనా లకు కనబడింది. ఎందుకు చేయ లేదనే ప్రశ్న ఎదురుగా నిల బడింది. ఫలితం అందరికీ తెలిసిందే.. దాదాపు పదేళళు దూరమై, ఇక చేతికి అందడం అసాధ్యమేమో అనుకున్న అధికార అందలం రాష్ట్ర విభజన కారణంగా చంద్ర బాబుకు మరోసారి దక్కింది. దక్కిందనే సంతోషం తప్ప ఆనందించడానికి ఏమీ లేదు. రాష్ట్రం ఏర్పడింది కానీ రాజధాని లేదు. పాలకులు ఒక రాష్ట్రంలో.. పాలితులు మరో రాష్ట్రంలో.. అనే రీతిలో పాలన కొన్నాళళు సాగింది. ఎట్టకేలకు మంత్రులు, అధికారుల సమేతంగా ము ఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి చేరారు.
సీఎం పదవి ఆయనకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఇరవై మూడు జిల్లాలతో పాలించిన రాష్ట్రం పదమూడు జిల్లాలకు పరిమితమైంది. ఎన్నికల సమయంలో ఆయన చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలు- నిండుకున్న ప్రభుత్వ ఖజానా ఎదురుగా నిలబడి మా సంగతేమిటని అడుగుతున్నాయి. చంద్రబాబు సామర్ధ్యాన్ని విశ్వసించి రైతులు మూడుపంటలు పండే భూములు సుమారు ముప్పయివేల ఎకరాలను నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇచ్చారు. ఏళళు గడుస్తున్నా అరకొర భవనాలు తప్పిస్తే ప్రకటనల్లో కనిపించిన రమ్య హర్మ్య భవంతులు కానరావడం లేదు.
ఏం చెయ్యాలో తెలియదు. ఒకప్పుడు హైదరాబాదులో కూర్చుని ఢిల్లీలో ఫైళ్లను కదిలించిన ఆ చాతుర్యం- ఇప్పుడు ఎన్నిసార్లు హస్తిన చుట్టూ తిరిగినా కొరగాకుండా పోతోంది. ఏదో చెయ్యాలనే తాపత్రయం. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కాళ్లూ చేతులూ కట్టేసి కబాడీ ఆడమన్నట్టుగా వుంది పరిస్థితి. మరో పక్క రాజకీయంగా కలవరపెడుతున్న పరిణామాలు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ యంత్రాంగం మనసు పెట్టి పనిచేయడం లేదని అధికార పార్టీ నేతలే అంటున్నారు. ఒక నిబద్ధత కలిగిన పార్టీగా ఆనాడు ఉన్న మంచి పేరు ఇప్పుడు లేదని పార్టీవాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇక, అవినీతి గురించి అనునిత్యం వెలువడుతున్న వార్తలు నమ్మతగ్గవేనా? అని సందేహించేంత స్థాయలో- బ్యాంకు స్ట్రాంగ్ రూములను, బంగారు దుకాణాలను తలపించేలా మీడియాలో బయట పడుతున్న అవినీతి చేపల బా గోతాలు. పట్టుపడ్డ అవినీతి సొమ్మును లెక్కించడానికి అవినీతి నిరోధక శాఖ అధికారులు కరెన్సీ కౌంటింగ్ మిషన్లను వాడుతున్నారంటే- పరిస్థితి ఎంతగా ది గజారిందీ అవగతమవుతుంది.
అయితే- గుడ్డిలో మెల్లగా ఆనాడు చంద్రబాబుకు అయాచితంగా లభించిన విశేష ప్రచారం, ఈనాడు కూడా లేకపోలేదు. కాకపొతే, ఇంతటి బృహత్తర పార్టీ వ్యవస్థ, ప్రచార యంత్రాంగం ఉన్నా తన గురించి తనే చెప్పుకోవాల్సిన స్థితి రావడం ఏ నేతకైనా బాధాకరమే. పైగా, చంద్రుడిలో మరో కోణం చూపించే మీడియా ఈనాడు పుష్కలంగా ఉంది. దానికి తోడు ఎవరి అదుపాజ్ఞల్లో ఇమడని సోషల్ మీడియా రంగప్రవేశం చేసింది. అప్పటికీ ఇప్పటికీ కొట్టవస్తున్నట్టు కనబడే తేడా ఇది. పులిమీది పుట్రలా- అదురూ బెదురూ లేని ఏకైక ప్రతిపక్షం. కలిసిరాని మిత్రపక్షం. ఆ బంధమూ మొన్నీమధ్యనే తీరిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో రెండే జట్లు. చంద్రబాబు వర్సెస్ రెస్ట్ఫా ఆంధ్రప్రదేశ్!
ఒకరకంగా ఆయన యుద్ధాన్ని మళ్ళీ మొదటి నుంచీ మొదలు పెట్టాల్సిందే. పూర్తి శక్తియుక్తులు, సమస్త వనరులు సంపూర్ణంగా ప్రయోగిస్తే మరోసారి అధికారం చిక్కవచ్చునేమో? అతి కష్టమైనా సాధ్యం కావచ్చునేమో? ఏమో అనే సంశయమే కాని, కచ్చితంగా ఏదీ చెప్పలేం. కానీ, ఉమ్మడి రాష్ట్రం సీఎంగా దేశ విదేశాల్లో చంద్ర బాబుకు లభించిన ఆదరణ ఈనాడేదీ? మరోసారి ము ఖ్యమంత్రి అయిన తరువాత కూడా లభిస్తుందన్న పూచీ ఏదీ?
‘‘ఏవి తల్లీ నిరుడు కురిసిన
హిమ సమూహములు!’’
ఈ పుట్టిన రోజున అయినా పాత వైభవం రావడానికి ఏదైనా చేయకపోతారా?-అని చంద్రబాబుకున్న అసం ఖ్యాక అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానులు కదా! వారి ఆశలు అలాగే వుంటాయి. అందుకు విరుద్ధంగా జరిగితే, వారి నిరాశ కూడా అదే స్థాయిలో ఉంటుంది. తాను పాత చంద్రబాబునే అని నిరూ పించుకోవడం ద్వారా- ఈ తడవ తన పుట్టిన రోజు కానుకను ఆ రూపంలో వారందరికీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు మీదే ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే అంతటి వ్యవధానం వున్నట్టు కనిపించడం లేదు.

-భండారు శ్రీనివాసరావు bhandarusr@gmail.com 98491 30595