మెయిన్ ఫీచర్

త్యాగానికి ప్రతీక మొహర్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్యాగానికి, మహోన్నత సనాతన సాంప్రదాయానికి, మత సామరస్యానికి ప్రతీక మొహర్రం వేడుక. ధర్మసంస్థాపన లక్ష్యంగా, నమ్మిన సిద్ధాంతాల కోసం పలువురు ప్రాణాలర్పించిన మాసం మొహర్రం. ధర్మసంస్థాపనార్థం హజ్రత్ ఇమాం హుస్సేన్, హసన్‌లు తమ ప్రాణాలను అర్పించి 1380 సంవత్సరాలు కావస్తున్నా అమరవీరుల త్యాగాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో స్మరిస్తూ, అమరుల త్యాగశీలతకు జోహార్లను అర్పించడం సత్సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు.
మొహర్రం మాసమంటే రక్తపుటేరులతో ఎర్రబారిన కర్బల మైదానం ముస్లిం సోదరుల కళ్లలో సజీవంగా సాక్షాత్కరిస్తుంది. ధర్మాధర్మాలకు జరిగిన సంఘర్షణ ఫలితమే కర్బల దుర్ఘటనగా ముస్లింలు భావిస్తారు.
ఇస్లాం మత స్థాపకుడు ప్రవక్త మహమ్మద్ పరమపదించిన అనంతరం సమ సమాజ స్థాపనకోసం, ప్రజాస్వామ్య పద్ధతిలో, సౌదీ అరేబియాలో తమ ప్రతినిధిని ఎన్నుకొనే కార్యక్రమాన్ని చేపట్టారు. తదనుగుణంగా మదీనా రాజధానిగాగల రాజ్యానికి హజ్రత్ అబూబకర్‌ను తొలి ఖలీఫాగా ఎన్నుకొనగా, అనంతరం హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీలను ఖలీఫాలుగా ఎన్నుకున్నారు.
వీరి పరిపాలనా సమయంలో న్యాయం, ధర్మం నాలుగు పాదాలపై నడిచాయని చెపుతారు. ధార్మిక, సామాజిక, ఆర్థిక, రాజకీయాది రంగాలలో సమానత్వం వెల్లి విరిసిందంటారు. ఐదవ ఖలీఫాగా ప్రజలు ఇమాం హుస్సేన్‌ను తమ ప్రతినిధిగా ఎన్నుకోగా, సిరియా ప్రాంతానికి గవర్నరుగా ఉన్న హజ్రత్ మివాయా అధికార దాహంతో ఖలీఫా పదవిని ఆశించి, పోటీపడగా, ఇరువర్గాల మధ్య యుద్ధానికి నాంది పలికింది. యుద్ధ పరిణామాలను గ్రహించిన హుస్సేన్, రక్తపాత నివారణకై రణరంగం నుండి నిష్క్రమించి, ప్రజలు తమకు విశ్వాసంతో కట్టబెట్టిన అధికారాన్ని త్యాగం చేశారు. పదవీకాంక్షాలోలుడైన మివాయ తన కుమారునికి పట్టం కట్టాలని ప్రజలపై ఒత్తిడి తెచ్చిన స్థితిలో, ప్రాణభయంతో ప్రజలు మివాయ కొడుకు యజీద్‌ను రాజుగా గుర్తిస్తారు. అయితే ఈచర్యలు ప్రజాస్వామ్యవాదులకు మింగుడుపడలేదు. తత్ఫలితంగా ప్రజలు రాజుకు ఎదురు తిరిగి ఉద్యమిస్తారు.
ఉద్యమ నాయకత్వ బాధ్యతలను హజ్రత్ హుస్సేన్‌కు అప్పగిస్తారు. ఇస్లాం నిబంధనల ప్రకారం ఏ సమస్యకైనా చర్చలు సంప్రదింపులే పరిష్కార మార్గాలు కావడం మూలంగా, హజ్రత్ హుస్సేన్ సిరియా రాజధాని కుఫాకు సంప్రదింపులకై బయలుదేరి వెళుతుండగా, రాజు యజీద్ విషయాన్ని తెలుసుకుని, హుస్సేన్ రాజధానికి వెళ్ళి చర్చలు జరిపితే తన అధికారానికి ముప్పు వాటిల్లక తప్పదని గ్రహించి, హుస్సేన్‌ను అడ్డుకోవడానికి పెద్ద సైన్నాన్ని పంపుతాడు.
మార్గ మధ్యలో కర్బల మైదానంలో యజీద్ సైన్యం ఎదురై హుస్సేన్ పరివారాన్ని అడ్డగిస్తారు. యజీద్‌ను రాజుగా స్వీకరించాలని సైన్యాధిపతి హుస్సేన్‌కు అల్టిమేటం ఇవ్వగా, తాను చర్చలకు వెళుతున్నానని, తనకు ప్రతిబంధకాలు కల్పించవలదని హుస్సేన్ కోరగా, సైన్యాధిపతి పట్టించుకోకుండా యజీద్‌ను రాజుగా స్వీకరించడమో లేక యుద్ధం చేయడమో తేల్చుకొమ్మని పట్టుపట్టడంతో, ఆశయసాధనకై ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధమేగాని తలవంచేది లేదని హుస్సేన్ బదులిస్తాడు. దీనితో ఇరువర్గాలమధ్య భీకరయుద్ధం జరుగుతుంది.
హుస్సేన్ పరివారం శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడినా, కొంతకాలం యుద్ధం జరిగాక చివరకు హుస్సేన్ ఒక్కడే మిగులగా, మొహర్రం మాసంలోని పదవతేది శుక్రవారం హిజ్రీ 60వ సంవత్సరం నాడు హుస్సేన్ హోరాహోరీగా పోరాడుతుండగా, సూర్యుడు అస్తమించే సమయం అసన్నమవడంతో, తనకు ప్రార్థన చేసుకోవడానికి కొంత వ్యవధి కావాలని అనుమతి గైకొనగా, శత్రువులు అదే అదనుగా భావించి నమాజ్‌లో భాగంగా సిజ్దా చేస్తుండగా బాణాలతో దారుణంగా హతమార్చి, తలను మొండెంనుండి వేరుచేసి, చేతులను ఖండించి బాణాలకు, బరిసెలకు తగిలించుకుని నాట్య విన్యాసాలు చేశారు. అట్టిరోజును ఇస్లాం మతస్తులు త్యాగదినంగా పరిగణించి మొహర్రం పండగ జరుపుకుంటారు. హుస్సేన్ త్యాగ శీలతకు ప్రతీకగా పీర్ల దినాన్ని జరుపుకుంటూ అమర వీరులను స్మరిస్తారు. పీర్ల పండగ సందర్భంగా సంతానహీనులైన హిందూ స్ర్తిలు మొక్కులు చెల్లించుకోవడం, పులుల మరియు ఇతర వేషాలతో విన్యాసాలు చేస్తూ, ఆడుతూ వారం రోజులు డబ్బులు ప్రోగుచేసుకోవడం సాంప్రదాయంగా మారింది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494