Others

దుఃఖ నివారిణి శ్రీ దుర్గామాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుష్టత్వాన్ని అణచి, సాధుత్వాన్ని పెంచి శాశ్వతమైన శాంతి సౌఖ్యాలను ప్రసాదించే జగన్మాత- శ్రీ దుర్గాదేవి. పండు వెనె్నలను నిండుగా పండించే శరదృతువులో, చంద్రునిలాగా, బిడ్డలను చల్లగా కాపాడే జనని- శ్రీ దుర్గామాత. అష్టకష్టాలతో సతమతమవుతున్న ప్రజలను, అష్టమినాటి దుర్గ అన్ని విధములా ఆదుకొని కటాక్షించి ఆనందింపజేస్తుందని పురాణ ప్రశస్తి.

లోక కళ్యాణం, లోకపోషణ, శ్రీమహాదుర్గ లక్ష్యం. దుష్టశిక్షణలో ఎంత కాఠిన్యం వహిస్తుందో, శిష్టరక్షణలో అంత దయార్ద్ర హృదయ భావనాశక్తిని ప్రసాదించే తల్లి- దుర్గామాత. అద్వైత ఐక్యతాభావనతో భయాన్ని తొలగించి, భక్త్భివాన్ని కలిగించి, శాంభవీ ముద్రలో, భక్తులకు అభయమిచ్చి, ఆశ్రయమిచ్చి, శ్రేయస్సును చేకూర్చి, భవాని విభవంగా అందించే భవాని- శ్రీ దుర్గామాత. అందుకే మంచి భావనాశక్తిని ప్రసాదించమని పోతన, శరణాగతితో ఆర్ద్రతతో ఆర్తిగా అపార భక్తి తత్పరతతో దుర్గామాతను ప్రార్థించాడు, ఈ విధంగా:
‘‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడియమ్మ దుర్గామా
యమ్మ కృతాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
ముగురమ్మలు ఎవరు? మూలపుటమ్మ ఎవరు? మూల పుటమ్మ ఎవరో ఆయనే చెప్పాడు- శ్రీ దుర్గాదేవి అని.
దుర్గాదేవి అంటే శివుని అర్ధాంగి, పార్వతి అని గదా ప్రసిద్ధి. అయితే ఈ ముగ్గురమ్మలలో పార్వతీదేవి లేదా? సరస్వతి లక్ష్మి పార్వతి వీరు ముగ్గురూ చేరితేనే ముగురమ్మలవుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులయినట్లు. కాని చివరలో ‘దుర్గమాయమ్మ’ అన్నాడు పోతన.
పోతన మనసు ఉన్నది, దుర్గ అంటే పార్వతి కాదు, ఎంతో కష్టంమీద గాని గ్రహించలేనిదేదో అది ‘దుర్గ’. పరమాత్మ మాయాశక్తికే దుర్గ అని పేరు. అన్నింటికీ మూలభూతమయినది ఆ శక్తి- ఆదిశక్తి, పరాశక్తి. ఆ మహాశక్తే సృష్టించవలసి సరస్వతి అయింది, పోషించవలసి లక్ష్మీదేవి అయింది. ఉపసంహరించవలసి పార్వతి అయింది. వీరికి మూలభూతమైన ఏకైక శక్తి ఆ పరాశక్తి. కనుక పరాశక్తే, ఈ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయింది.
మరి త్రిమూర్తులుగదా సృష్టి, స్థితి, లయాలు చేసేది? ఔను వారే చేసేది. వారు స్వయంగా తమ పాటికి తాము చేయలేదా పనులు. తమ తమ శక్తులనాధారంగా చేసికొని చేస్తారు. శక్తి కూడా వారిని ఆశ్రయించి ఉంటుంది. కనుక వారు ముగ్గురే ముగురమ్మలు. త్రిగుణాత్మకమయిన ఈ మూల ప్రకృతే ముగురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాతే- శ్రీ దుర్గామాత.
ద్, ఉ, ఋ, గ్, ఆ అను అక్షరముల కలయికయే ‘దుర్గ’. అనగా సర్వపాపములను శమింపజేసి, శమదమాది గుణ సంపత్తి నొసగి, సంసారాంబుధిని దాటించి తరింపజేయు మార్గమును చూపి, దుష్టులకు వశముగాని అజేయశక్తులను భక్తులకొసగి, రక్షణ ఇవ్వగల దుర్గము అనగా ఒక ‘కోట’ వంటి శ్రీ దుర్గామాత.
అగ్ని స్వరూపంగా ఈ సమస్త జగత్తును సస్యశ్యామలంగా సుభిక్షంగా చేసి, దుఃఖముల బారినుండి రక్షించి, సదా శ్రేయస్సును ఇస్తుంది. భక్తులు తరింపజే మంచి మర్గాన్ని చూపి జీవిత పరమార్థాన్ని తెలియజేసి, సంప్రాప్తింపజేస్తుంది. అందుకే దుర్గాసూక్తంలో ‘కాత్యాయ నాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్’’ అని చెప్పబడింది.
‘‘దుర్గాత్తారయసే దుర్గే తత్త్వం దుర్గా స్మృతాజనైః’’-కష్టములనుండి తరింపజేయునది గావున జగన్మాతకు ‘దుర్గ’ అనే పేరు వచ్చింది.
‘క్షపిత పశు పాశ వ్యతికరః పరానందభిఖ్యం రసయతి రసం’ అని వచించారు శ్రీ శంకర భగవత్పాదులు, సౌందర్యలహరిలో. పశుపతి అగు సదాశివునితో కలిసి యున్న పరాశక్తి, ఆదిత్య మండలాంతర్గతమైన బైందవీ శక్తినిచ్చి, అవిద్యాకరమైన పాశబంధాన్ని, విమోచనము కల్గించు మాత- దుర్గాదేవి. ఇక్కడ పశువు అంటే జీవుడు, పాశము ‘అవిద్య’. పశుపాశము అనగా జీవ అవిద్యల సంబంధమును నశింపజేసి, పరమానందమనబడు జ్యోతి రూపముగా, సదాశివ తత్త్వాత్మకమును, ప్రసాదించు భగవతి- శ్రీ దుర్గామాత.
‘‘అనిర్వేద శ్రీయోమూల మనిర్వేదః పరం సుఖం అనిర్యేదో సతతం సర్వార్దేషు ప్రవర్తకః కరోతి సఫలం కర్మ యత్తత్కరోతిసః తస్మా దనిర్వేద కృతం యత్న చేష్టే అహముత్తమం’’ అన్నారు వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో.
నిర్వేదమంటే విచారము అనగా దుఃఖము. అనిర్వేదమంటే విచారము, దుఃఖము లేకుండుట. శ్రీయోమూలమంటే, శ్రేయస్సునకు మూలకారణం. దుఃఖము లేకుండా ఉండటమే ఐశ్వర్యమునకు మూలకారణం. అదే పరమసుఖం. దుఃఖము లేకుండా ఉంటే సకల కార్యములు సకల వాంఛలు నెఱవేరుతాయి. కనుక దుఃఖాన్ని దరిచేరనీయకుండా ప్రతివారూ ప్రయత్నించాలి. దుఃఖము విచారభారంతో మానవుడు కృంగిపోతాడు. దుఃఖభారాన్ని తొలగించుకొని, ద్విగుణీకృతోత్సాహంతో ధైర్యసాహసములతో మానవుడు ముందడుగు వేయాలన్న మహోదాత్త సందేశాన్ని మనకందించారు-వాల్మీకి మహర్షి. అటువంటి దుఃఖాన్ని పోగొట్టే ‘దుఃఖహంత్రిణి’ దుర్గామాత.
క్షేత్రము, తీర్థము దైవము- అనే మూడూ, దేనికవే పవిత్రమైనవి. అవి మూడూ త్రిపుటిగా ఒక్కచో నెలకొని ఉంటే అది మహా పవిత్రమైన పుణ్యక్షేత్రం. క్షేత్రము- ఇంద్రకీలాద్రి, తీర్థము- కృష్ణవేణీ నది, దైవము- స్వయంభువు శ్రీ కనకదుర్గాదేవి. మరి ఆ ప్రదేశం విజయవాడ.
పవిత్ర కృష్ణానదీ తీరం విజయవాడలో నెలకొన్న దుర్గామాతను గురించి స్కాంద పురాణంలో వివరించబడింది. ‘ఇంద్రకేలుడ’డనే శాక్తేయుడు దుర్గామాతను గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన పరాశక్తిని, తన గర్భములో వశింపుమని ప్రార్థించాడు. ‘‘నీవు పర్వత రూపాన్ని పొందుతావు. తగిన సమయంలో నీ కోర్కె నెరవేరగలదు’’ అని అభయమిచ్చింది మాత. అందుకే విజయవాడలోని పర్వతానికి ‘ఇంద్రకీలాద్రి’ అని పేరు వచ్చింది. మహిషాసుర వధానంతరం, మహిషాసురమర్దినిగా, దుర్గాదేవి ఇంద్రకీలాద్రిపై, స్వయంభువుగా వెలసింది. అరుణోదయ రాగ శోభతో, రక్తాంత నేత్రములతో అతి భయంకరంగానున్న దుర్గామాతను సామాన్యులు వీక్షించలేరన్న దృష్టితో ఆదిశంకరులు, శాంతి యంత్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుండి దుర్గాదేవి ప్రసన్న వదనంతో భక్తుల కోర్కెలను నెఱవేరస్తూ, కన్నతల్లిలాగా కరుణిస్తోంది. ఇక్కడ కుంకుమతో శ్రీచక్రార్చన, లలితా సహస్రనామములతో జరపటం విశేషం.
పూర్వము మాధవ వర్మ అనే రాజు ప్రజారంజకముగా ధర్మపరిపాలన చేస్తుండేవాడు. ఒక రోజున అతని కుమారుడు కట్టిన గుఱ్ఱపు బండి క్రిందపడి, నిరుపేద అయిన బాలుడు మరణించాడు. ధర్మప్రభువైన మాధవ వర్మ, తన కన్న కుమారునికే మరణశిక్ష విధించాడు. అతని ధర్మబుద్ధికి సంతుష్ఠురాలైన దుర్గామాత, ఆ బాలకుణ్ణి జీవింపజేసి కనకవర్షం కురిపించింది. ఆనాటినుండి దుర్గామాతకు ‘కనకదుర్గ’ నామము సార్థకమయింది.
దుర్గముడనే రాక్షసుడు వేద విజ్ఞానాన్ని తన వద్దే నిక్షిప్తమయ్యేటట్లుగా బ్రహ్మ వద్ద వరం పొంది, ప్రజాపీడనంగా రాజ్యమేలుతున్నాడు. వర్షములు లేక, పంటలు పండక అనాష్టితో ప్రజలు అన్నపానములు లేక అలమటిస్తున్నారు. ఇతరులను కష్టాలపాలుచేసి, వారు బాధపడుతుంటే సంతోషించే స్వభావముగలవారు రాక్షసులు. దేవతలందరూ పరాశక్తికి ఈ వృత్తాంతం తెలిపి, రక్షించమని ప్రార్థించారు. ‘శతాక్షి’ అయిన జగన్మాత కన్నులనుండి సంతతధారగా సర్వౌషధములతో గూడిన వర్షము తొమ్మిదిరోజులు వర్షించగా, సర్వ జలాశయములు నిండి, సస్యశ్యామలమయినది. తన హస్తములందుండిన శాకములతో గూడిన భోజన పదార్థములను సమంగా అందరకూ పంచి ‘శాకాంబరి’ నామాంకిత అయినది దుర్గామాత.
ఆపదలు వచ్చినపుడు, దుర్గాదేవిని స్మరించి శరణు వేడికొంటే తల్లి రక్షిస్తుంది. కనుకనే ఆమె ‘దుర్గా’ అని పిలువబడుతోంది. మహాభారతం విరాట పర్వంలో, విరాట నగరంలో అజ్ఞాతవాసం చేయబోయే ముందు ఇతరులు తమను గుర్తించకుండా కాపాడమని ధర్మరాజు దుర్గాదేవిని ప్రార్థించాడు. దేవి కరుణించింది. శ్రీకృష్ణుని ఆదేశం మేరకు అర్జునుడు కురుక్షేత్రంలో తమకు విజయం సిద్ధించాలని దుర్గాదేవిని స్తోత్రం చేసి విజయాన్ని పొందాడు. దుర్గాదేవిని సరస్వతిగాను, వేదమాతగాను ‘స్వాహాకార స్వధా చైవా కలాకాష్ఠా సరస్వతీ సావిత్రే వేదమాతాచ తధా వేదాన్త ఉచ్యతే’’ అని ప్రార్థించాడు.
భక్తుల కష్టాలను కడతేర్చి, సంసార సముద్రాన్ని దాటించి కర్మఫలాలను ప్రసాదించేది దుర్గామాత అని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. అందుకే లలితా సహస్రనామం ‘నిస్తులా నీల చికురా నిరపాయా నిరత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖ హంత్రీ సుఖప్రదా’ అన్నది, దుఃఖాన్ని పోగొట్టి, భయాన్ని తొలగించి, ధైర్యాన్ని ప్రసాదించి, శతృవులు అంతఃబాహ్య శతృవులనుండి రక్షించే జగన్మాత దుర్గామాత.
మార్కండేయ పురాణాంతర్గత దుర్గా సప్తశతి, కాళీపురాణం, దేవీ భాగవతం దుర్గామాతను గురించి విశేషంగా తెలియపరచినాయి. ఈతిబాధా నివారణార్థం, దుర్గాసప్తశతి పారాయణం చేస్తారు. జాతకభాగంలో లగ్నం నుంచి రాహుగ్రహం- అష్టమంలో, చతుర్థంలో, వ్యయంలో, లగ్నంలో ఉంటే వివాహములు ఆలస్యమవుతాయి, సంతాన భాగ్యానికి ఆటంకములు కలుగవచ్చు. వారు దేవీ సప్తశతిలోని దేవీ కవచం, దేవీ కీలకస్తోత్రం, దేవీ అర్గల స్తోత్రం పారాయణ చేసి, తీర్థం ప్రసాదం స్వీకరిస్తే, గ్రహబాధలు తొలగి, అన్నీ శుభంగా జరుగుతాయి. ‘చండీహోమం’ చేస్తే దోషములు తొలగి, సర్వకార్యసిద్ధి చేకూరుతుంది. ఇది దుర్గామాత అనుగ్రహం.
మహాదుర్గను ‘దుర్గామాత’ అని ఆర్తితో ఆర్ద్రతగా సంపూర్ణ శరణాగతితో, స్మరిస్తే సమస్త జీవుల భయాన్ని, దుఃఖాన్ని పోగొడుతుంది. సకల విద్యలను కరుణిస్తుంది. జగన్మాతను ‘వనదుర్గా మహామంత్రంతో’ ఆవాహన చేసి, శారదామాతగా ప్రతిష్ఠించారు శ్రీ శంకర భగవత్పాదులు, శృంగేరీ మహాక్షేత్రంలో.
‘శ్రీ దుందుర్గే, శివసంసర్గే, చిత్రసవర్గే, స్థిరేహపవర్గే, శ్రీ నవదుర్గే, శ్రీ దుందుభివాద్య భౌదనాద వినోదిని, మోదిని, వీణావాదిని, సంవేదిని, అభేదిని, సుందరి, శ్రీరంజని, నిరంజని, జయజనని, కరుణారసాలయే, కలికల్మషవిలయే, కరావిధృత కువలయే, స్వర సంగీతలయే, సురు చిరమలయే, గురుగుహోదయే, సదయే, విజయ, అభయే, సరసమయే, షట్సమయే, సమయే, కలయే.. శ్రీ దుందుర్గే అంటూ తిరువారూరులోని దుర్గను, దుం అను బీజాక్షర రూపిణిని, లలితమైన పదజాలంతో, అంత్యప్రాసలతో మహాలక్ష్మీ స్వరూపంగా కూడా భావించి, శ్రీయుతము చేసి, శ్రీరంజని రాగంలో ఘనంగా కీర్తించాడు శ్రీ విద్యోపాసనాసిద్ధుడు, నాదయోగి, సద్గురు శ్రీముత్తుస్వామి దీక్షితులు.
వంశవతి, శివయువతి, పాలయమాం శాంభవి.. ఉరిత ధ్వంసి జనని అని వంశవతీ రాగంలో కీర్తించాడు. ప్రపంచమందలి జీవరాశియను వంశమునకు తల్లి శ్రీ దుర్గామాత. స్వరములు ఏడు. వాటికి ఇరువది రెండు శ్రుతులు. షడ్జమమునకు నాలుగు, రిషభమునకు మూడు, గాంధారమునకు రెండు, మధ్యమునకు నాలుగు, పంచమమనకు నాలుగు, ధైవతమునకు మూడు, నిషాదమునకు రెండు. ఈ ఇరువది రెండు శ్రుతి స్వరూపిణి శ్రీ దుర్గామాత.
శక్తి స్వరూపాన్ని తెలిసికొని, స్ర్తిలను జననీ సోదరీ భావంతో గౌరవించి, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని కాంక్షించాలని, శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవములలో, శ్రీ దుర్గాపూజ హెచ్చరిస్తోంది.

-- పసుమర్తి కామేశ్వరశర్మ 94407 37464