మెయిన్ ఫీచర్

గతానికి, వర్తమానానికి వారధి అమితవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవలలే అయినప్పటికీ ఘోష్ రచనలు అన్ని సంస్కృతులలోనూ, జాతులలోను వ్యాపించి ఉన్న చారిత్రక అనిశ్చితికి, మానవ ఆందోళనలకు మధ్య ఉన్న సంబంధాన్ని, ఒకదానితో ఒకటి విడదీయలేని గట్టి పోలికలను చెప్పడంలో గొప్ప ఘనతను సాధించాయి. ఒక చారిత్రక అధ్యయన కారుడిగా, పరిశోధకుడిగా, సామాజిక ఆంత్రో పాలజిస్టుగా ఘోష్‌కున్న నేపధ్యం లోతులకు వెళ్ళి పరిశోధించడానికి ఉపయోగపడింది. బహుశ ఇది మొట్టమొదటిసారిగా ఆంగ్ల రచనలకు, ఆంగ్ల సాహిత్యంలో చేసిన కృషికి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. 54వ జ్ఞానపీఠ్ పురస్కారం అందుకోబోతున్న సందర్భంలో, అమితవ్ ఘోష్ నవలల్లోకి ఒక్కసారి పరికించి చూసే ఒక చిన్న ప్రయత్నమే ఈ అక్షరాల సంగాతం.

His fiction is endowed with extraordinary depth and substance through his
academic training as a historian and a social anthropologist.His major thematic concerns include migration and inter connection across places, cultures, and races and human distress and suffering caused by historical turbulences,
especially at the level of girmitiyas, coolies and lascars.

- అని జ్ఞానఫీఠ్ పురస్కార కమిటి కితాబు ఇచ్చిన తర్వాత అమితవ్‌ఘోష్ నవలా ప్రయాణాన్ని తలుచుకోవడం అవసరం. 1986లో అతని మొదటి నవల ‘ది సర్కిల్ ఆఫ్ రీజన్’ దగ్గర నుండి 2015లో వచ్చిన నవల ‘్ఫ్లడ్ ఆఫ్ ఫైర్’ వరకు ఆరు నవలలను పరిశీలిస్తే.. అమితవ్‌ఘోష్ ప్రయాణంలోని కొత్తదనం సృష్టమవుతుంది. 1986లో అతని మొదటి నవల ‘ది సర్కిల్ ఆఫ్ రీజన్’ ప్రచురితమవగానే రుకున్ అద్వాని, హరిష్ త్రివేదీ లాంటి వాళ్ళు ‘ఘోష్ జనరేషన్’ ప్రారంభమయ్యిందని వ్యాఖ్యానాలు చేశారు. Stephanine School అని భారతీయ ఆంగ్లనవలా సాహిత్యానికి కొత్త అద్భుతాలు అద్దే సమయానికి శ్రీకారం చుట్టిందని కితాబు ఇచ్చాయి. అంతకు ముందు ఆర్.కె. నారాయణన్, కుష్వంత్‌సింగ్, ఉపమన్యు చటర్జీ లాంటి ఎందరో నవలా రచయితలు చరిత్రను అక్షరబద్ధం చేసి ఫిక్షన్‌లైజ్ చేశారు. ‘‘వెయిటింగ్ ఫర్ మహాత్మా’’, ‘‘ట్రెయిన్ టు పాకిస్తాన్’’ లాంటి నవలలు సూక్ష్మ పరిశీలనలోంచి వచ్చినవి. సాల్మన్ రష్దీ ‘మిడ్‌నైట్ చిల్డ్రన్’ స్థూల పరిశీలనలోంచి వచ్చిన నవలగా మనకు తెలుసు.
అయితే అమితవ్ ఘోష్ చారిత్రక అవగాహన, చరిత్రతో అతనికి గల సంబంధం వీటన్నింటికి పూర్తిగా భిన్నమైనది. అంతమాత్రాన చరిత్రను పలచపరచడం కాదు. చరిత్రను ఫిక్షనల్ ఫ్రేమ్ వర్క్‌లో పాఠకుడి చేత సులభంగానూ, ఆసక్తిగానూ చదివించడంలో అమితవ్‌ఘోష్ కృషి ప్రశంస నీయమైనది. ఘోష్ నవలలు ప్రత్యేకంగా రచయితకు గల చారిత్రక పరిశోధనను, అధ్యయనాన్ని తెలియచేస్తాయి. పాఠకుడిని రచన లోకి తీసుకువెళ్ళే ఒక మూడ్‌ను ఘోష్ తన మొదట నవల నుండే సృష్టించాడు. అది చారిత్రకమైన, సైన్స్ అయినా, ఆంత్రోపాలజీ అయినా పాఠకుడు అక్షరాన్ని పట్టుకుని చదువుకుంటూ... లీనమైపోవడమే ఘోష్ రచనల ప్రత్యేకత. అంతకుముందు వచ్చిన చారిత్రక నవలలకు, ఘోష్ రచనలకు తేడా ఎక్కడుందంటే రాజకీయ, చారిత్రక నేపథ్యాల మధ్య ఉన్న సంబంధాన్ని మనసులో నాటుకునేటట్లు చెప్పడమే ఘోష్ టాలెంట్. అనేక ఆసక్తికరమైన వాస్తవాలను వివిధ పార్శ్వాలలో అతను మనకు మొదటి రెండు నవలలు అయిన ‘ది సర్కిల్ ఆఫ్ రీజన్’, ‘ది షాడో లైవీన్స్’లో చెపుతాడు. మొదటి నవలలో కథానాయకుడు ‘ఆలూ’ మనకి రషీ ద‘మిడ్‌నైట్ చిల్డ్రన్’ నవలా నాయకుడిని గుర్తు చేస్తాడు. పెద్దతలకాయతో, ముందుకు పొడుచుకు వచ్చిన పెద్దపెద్ద బొడిపెతో ఉండడమే ఒక ఎత్తయతే, అతని వ్యక్తిగత జీవితంతోని విషయాలకు - అతని చుట్టూ ఉన్న రాజకీయ, సామాజిక సంఘటనలకు మధ్య అనేకమైన యాదృచ్ఛిక పోలికలు, సంబంధాలు ఉండడం మరో విశేషం. దానికి కారణం వెతకాలనే ఒక తాత్విక శోధన మొత్తం సౌత్ ఆసియాను, ఉత్తర ఆఫ్రికాను, మధ్య తూర్పు ప్రాంతాలని చుట్టేస్తుంది.
రెండో నవల ‘‘ది షాడో లైన్స్’’ (1988) కూడా మనకి రష్దీని గుర్తుకు తెస్తుంది. అయితే, ఈ నవల పాఠకుడికి సరిగ్గా అర్థం కావడానికి ఘోష్ ఉపయోగించిన వచనం అక్కడక్కడ కవిత్వ పరిమళాలని అద్దుకుని ఈ నవలకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. గతాన్ని కనుక్కునే క్రమంలోనూ, నిరంకుశమైన-అకారణమైన విభజన సమయంలోనూ జరిగిన కదలికలను మనకు బ్రిటన్ - ఇండియాకి, కలకత్తా - లండన్‌కి, రెండో ప్రపంచయుద్ధానికి -ప్రస్తుతానికి మధ్య తిరుగుతూ మొత్తం చరిత్రని పాఠకుడిలోకి సునాయసంగా ట్రాన్స్‌ఫామ్ చేస్తాడు. రాజకీయ స్వేచ్ఛ, సామాజిక హింసలతో కూడిన ఆ కాలాన్ని చెప్పడం కోసం అమితవ్‌ఘోష్ ‘ది షాడో లైవీన్స్’ అనే శీర్షికను తీసుకున్నాడు. నిజానికి జోసఫ్ కోన్రాడ్ నవల పేరు ‘ది షాడో లైవీన్స్’. అతని రచన సూటిగా పోలేని వంకరతనానికి- వెలుగులేని నీడని చెపుతుంది. విభజన కాలాన్ని, ఎమర్జెన్సీలో జరిగిన హింసని, ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన హింసని, 1964లో కలకత్తాలో జరిగిన దారుణాలని చెప్పడానికి ఘోష్ ఈ శీర్షికను తన నవలకు పేరుగా పెట్టుకున్నాడు. ఈ రెండో నవలతోనే ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరప్ దేశాలలోని పాఠకులను ఆకట్టుకోవడం మొదలు పెట్టాడు. వ్యక్తిగత జీవితాలను, సామాజిక సంఘటనలను, రాజకీయ దుర్మార్గాలను ఒక దానితో ఒకటి కలుపుకుంటూ చీకటిని ఎండేసే ప్రయత్నం చేశాడు ఘోష్. అతనే స్వయంగా ఒక చోట చెపుతూ ‘నా బాల్యంలో 1964లో కలకత్తాలో జరిగిన హింస, తర్వాత 1984లో ఢిల్లీ తదితర ప్రాంతాలలో జరిగిన హింస నా జ్ఞాపకాలలో ఉండి నన్ను కుదురుగా ఉండనీయని క్షణంలో పుట్టిందే ‘‘ది షాడో లైవీన్స్’’ అంటాడు ఘోష్. యాదృచ్ఛికంగా కొద్దిరోజుల ముందు 1984 సంఘటనలకు సంబంధించిన సూత్రధారికి యావజ్జీవ శిక్షపడడం గమనించవచ్చు.
ఆత్మకథని, యాత్రా సాహిత్యాన్ని, ఫిక్షన్‌ని, చరిత్రని కలిపేస్తూ చెక్కిన అపురూప రచన ఘోష్ మూడవ నవల ‘ఇన్ యాన్ యాంటిక్ లేండ్’’ (1992). నిజానికి ఇది నవలలాకాకుండా ఒక చరిత్రలా, ఒక వ్యాసంలా రావాలి. అలాగే అనుకుంటాం కూడా. కాని, చరిత్రను చెప్పడంలో ఉన్న అనేక ఇబ్బందులను అధిగమించి, చరిత్ర మరిచిన మనుషులను చెప్పడానికి ఘోష్ ఎన్నుకున్న అయుధం ఈ నవల. హెగెల్ చరిత్రకు ఒక నిర్వచనం చెపుతాడు; చరిత్ర అంటేTravels from East to West : For Europeis the absolute end of history, Just as Asia is the begining -ధీనిమీద చాలా చర్చలు జరిగాయి. మహాత్మాగాంధీ ఒకసారి మాట్లాడుతూ ‘చరిత్ర అంటే రోజులు, యుద్ధాలు, తేదీలే కాదు... There are so many men still alive in the world అంటాడు ‘చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పనిమనిషి, ఐర్లాండున ఓడ కళాసి, అణగారిన ఆర్తులెందరో...’ అని శ్రీశ్రీ చెప్పినట్టు, ఘోష్ చరిత్రను పునర్ నిర్మించడం మొదలు పెట్టాడు... A history of merchant and his slave, two tiny dots in the vast ocean of people who are nobody in the canonical history of the world ను సరిగ్గా చెప్పడం కోసం ఘోష్ నవలలు భారతీయ ఆంగ్ల సాహిత్యాన్ని కొత్త మార్గాలు తొక్కించాయి. కేవలం అణగారిన వర్గాలను గురించి చెప్పడమే కాదు, ఒంటరి అయిపోతున్న మనుషులను, జాతులను, సంస్కృతులను చెప్పడానికి కూడా ఘోష్‌లోని ఆంత్రోపాలజిస్టు చేసిన తీవ్రమైన కృషికి, అధ్యయనానికి ఈ నవల పరాకాష్ట. విమర్శకుల మాటల్లో ఇది Supreme intellectual synthesis.
నాలుగో నవలగా ఘోష్ మనకి ‘ది కలకత్తా క్రోమోజోమ్’ అనే ఒక సైన్స్‌ఫిక్షన్‌ను అందిస్తాడు. న్యూయార్క్‌లోని ఒక ఆఫీస్ వర్కర్ ఆంతార్ ఐడి కార్డును నిరాకరించడంతో మొదలయిన అనే్వషణ, పరిశోధనాత్మక ప్రయాణం కలకత్తా చేరడమే ఈ నవల. 19వ శతాబ్దం చివర, ఇరవయవ శతాబ్దపు ప్రారంభకాలాలు ఈ నవలలో మనకి కనపడతాయి. సర్ ఆర్ధర్ కాటన్ ‘డైల్ స్ట్లెల్’లో సాగే ఈ నవల డిటెక్టివ్‌లా కనపడే ఒక సైన్స్ ఫిక్షన్. మెడికల్ కేస్ హిస్టరీని కనుక్కోవడంలోని పరిశోధన ఈ నవలంతా పరచుకుని ఉంటుంది. 1996లో ఆర్ధర్ సి క్లార్క్ సైన్స్ ఫిక్షన్ అవార్డును ఈ నవల సొంతం చేసుకుని, ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయుడుగా అమితవ్‌ఘోష్‌కు అపరిమితమైన కీర్తిని తెచ్చిపెట్టింది. టోని మార్సన్ మిల్క్ మేన్ A Song of Soloman ¥× ÀDµÜ±vxе^Ò To we come to realize that only by knowing the past can (we) hope to have a future. ‘ది కలకత్తా క్రోమోజోమ్’ అచ్చంగా మనకి భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ ఉన్నతిని చెప్పడమే కాకుండా, అటువంటి బలమైన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి వీలైన బలాన్ని ఇస్తుంది.
ఆ తరువాత వచ్చిన ఘోష్ ఐదవ నవల ‘ది గ్లాస్ ప్యాలస్ (2000)’’ నిజానికి ఒక గొప్పSaga of Family and Individual lives. పాఠకుడికి ఒక విలువైన, సరళమైన, అవసరమైన రచనను చదువుతున్నామనే ఫీలింగ్‌ను కలగచేసే నవల ఇది. రాజ్‌కుమార్ రాహ అనే ఓడ కలాశి బర్మా కుటుంబంతో కలిసి బర్మా నుండి మలేషియా, ఇండియా, అమెరికా దాకా చేసిన ఒక యాత్ర. మూడు తరాల తోనూ, వ్యక్తులతోను సాగిన ఈ యాత్రా నవల గురించి మిన్నా ప్రోక్టర అనే ఒక విమర్శకుడు చేసిన ప్రశంస ఒక్కటి చాలు. ‘ది గ్లాస్ ప్యాలస్’ చదువుతున్న పాఠకుడు తాను స్వయంగా వంద సంవత్సరాలు నడిచిన యాత్రగా ఫీలవుతాడు. మలేషియాలోని రబ్బరు చెట్లు, బర్మాలోని టేకు అడవులు, సందడిచేసే రంగూన్, సింగపూర్ వీధులు, పతనమవుతున్న బర్మా సామ్రాజ్యం, ఎత్తుపల్లాలకు లోనవుతున్న బ్రిటీష్ రాచరికం కళ్ళముందు కట్టినట్లు ఉంటుంది. ఇది అచ్చంగా A stately and vibrantly detailed family saga set in south central Asia against the tumultuous back drop of the 20th century.
2004లో వచ్చిన ‘ది హంగ్రీ టైడ్’ భారతదేశంలోను, బంగ్లాదేశ్‌లోనూ కనపడుతున్న వేరుచేయబడిన జాతుల గురించి చెప్పిన నవల ఇది. సరిహద్దు రహితమైన, ప్రతికూలమైన, దేనికీ సంబంధంలేని భూభాగం కాని, నీరు కాని ఉన్న ఒక లాండ్‌స్కేప్‌లోని జనం గురించి చెపుతున్న నవల ఇది. దీనిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు తమదైన ప్లేస్‌ని ఈ ప్రపంచంలో కనుక్కోవడానికి పడుతున్న తపనని, చేస్తున్న పోరాటాన్ని, అనుభవిస్తున్న ఘర్షణని ఘోష్ తనదైన శైలిలో వినిపించి పాఠకుడిని కదిలిస్తారు. చరిత్రలు ఎన్నో వస్తాయి. పోతాయి. కాని చరిత్ర చెప్పిన వాస్తవాలను ఒడిసి పట్టుకుని చరిత్రను నిలబెట్టే ప్రయత్నానికి ఈ నవల చక్కటి ఉదాహరణ.
ఆ తరువాత ‘సీ ఆఫ్ పప్పీస్’ (2008)’ , రివర్ ఆఫ్ స్మోక్ (2011)’, ఫ్లడ్ అఫ్ ఫైర్ (2015) అనే మూడు నవలల ద్వారా ఒక ళఔజష ట్రెఖియాలజిని పూర్తి చేసాడు. అమితవ్ ఘోష్ సంచార జాతులు, వలసలు, వారి కదలికలు మీద వచ్చిన మూడు నవలలు ఇరవయి ఒకటవ శతాబ్దపు మాస్టర్ పీస్‌గా నిలిచాయి.
చాలామంది రచయితలు చరిత్రను క్రోనాలాజిగా ఇస్తూ వచ్చారు. ఇరవయ్యవ శతాబ్దం నుండి ఆ పద్ధతి మారింది. ఎక్కడ ప్రస్తుత అవసరం చరిత్రను కోరుకుంటుందో, అక్కడ గతం గురించిన ప్రస్తావన వస్తోంది. ఇది మనం అమితవ్ ఘోష్ నవలలో ఎక్కువ చూస్తాం. మూర్ అనే ఒక పరిశోధకుడు చరిత్ర అంటే ‘గతానికి వర్తమానానికి మధ్య జరిగే నిరంతర సంభాషణే’ అంటాడు. దీనిని సరిగ్గా అందిపుచ్చుకున్నవాడు అమితవ్‌ఘోష్.
ప్రతిభారాయ్ మాట్లాడుతూ .. ..in his novels, treads through hitorical settings to the modern era and weaves a space where the past connects with the present in relevant ways -అంటారు.
అంధుకేనేమో, ‘ఘోష్ జనరేషన్’ అంటూ తనదైన ఒక అధ్యాయాన్ని, వారసత్వాన్ని, వరసత్వాన్ని అందుకున్న ఘోష్‌కు అభినందనలు.
*
చిత్రం..అమితవ్‌ఘోష్

- నండూరి రాజగోపాల్ 98481 32208