మెయన్ ఫీచర్

కమ్యూనిస్టుల కలహం.. తెరాసకు వరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అర్జునా.. వినుము.. యుద్ధంలో చంపెడివాడు ఒకడు, చచ్చెడివాడు మరొకడును కాడు..’-అని శ్రీకృష్ణుడు తన గీతోపదేశంలో చె ప్పాడు. ఎన్నికల సమరంలోనూ ఓడే వాడొకడు, ఓడించేవాడు మరొకడు లేడు. ఎవరికివారే తమనుతాము ఓడించుకుంటున్నారు. ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు తమను తామే ఓడించుకున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టులు ఖాయంగా గెలిచే సీట్లు సైతం తెరాసకు దక్కాయి. కమ్యూనిస్టులకు అనాదిగా స్పష్టమైన ఒక ఆర్థిక సిద్ధాంత ప్రాతిపదిక ఉంది. తెరాస మాత్రం ప్రాంతీయ అభిమానం, సెంటిమెంట్‌పై ఆధారపడి గెలిచింది.
కాంగ్రెస్ అత్యాశకు పోయి అవలీలగా గెలువగలిగిన దాదాపు పాతిక సీట్లను చేజేతులా పోగొట్టుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ హైదరాబాద్ వచ్చి మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీని కలసుకొని- ‘ముస్లింలంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలి’ అని వేడుకున్నా ఫలితం లేకపోయింది. తెలంగాణ ఎన్నికల్లో ముస్లింలు మూకుమ్మడిగా తెరాసకు ఓట్లు వేశారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో బిజెపి అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కొన్నిచోట్ల టిఆర్‌ఎస్ వందల ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలిచింది. హైదరాబాద్‌లో శివసేనకు అడ్రస్ లేకున్నా, బిజెపికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి పరిమితంగా ఓట్లు చీల్చింది. రాజాసింగ్‌కు టిక్కెట్ ఇవ్వవద్దని బిజెపి స్క్రీనింగ్ కమిటీ వారించింది. చివరకు ఆయన గోషామహల్‌లో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను తన స్వీయప్రతిభతో చిత్తుచేశాడు. ‘నేను కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తానన్నా నన్ను ఆ పార్టీ ఉపయోగించుకోలేదు’ అని ప్రజాగాయకుడు గద్దర్ చెప్పాడు. ఎన్నికలలో తాము గెలిస్తే కెసిఆర్ ‘గడీ’ని బద్దలు చేస్తామని ‘తెజస’ అధినేత ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్య విపరీత ఫలితాలకు దారితీసింది.
***
బయోపిక్‌లను తీసి, సంచలనాలు సృష్టించటంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సిద్ధహస్తుడు. లోగడ ఆయన నిర్మించిన బయోపిక్‌లు ఆర్థికంగా విజయం సాధించకపోయినా వివాదాలను రేకెత్తించాయి. ఆయన ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్’ పేరిట బయోపిక్ తీసేందుకు కసరత్తు ప్రారంభించాడు. ఇందులో ఎన్‌టిఆర్ హీరో, లక్ష్మీపార్వతి హీరోయిన్, చంద్రబాబు విలన్. ఈ సినిమాకు సంబంధించి ‘దగా-కుట్ర- కుట్ర’ అనే ఒక పాట కూడా విడుదలైంది. ఈ ట్రయిలర్ ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. వర్మ దిష్టిబొమ్మలను తెలుగు తమ్ముళ్లు తగలబెట్టారు. అంటే వర్మ సినిమాకు అవసరమైన ప్రీ (ఫ్రీ) పబ్లిసిటీ లభించిందని అర్థం.
రాజకీయ నాయకులపై సినిమాలు రావటం లోగడ చాలాసార్లు చూశాం. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఆత్మకథకు సంబంధించి ‘ఆంధీ’ అనే హిందీ వ్యంగ్య చిత్రం వచ్చింది. మహమ్మద్ బిన్ తుగ్లక్, మండలాధీశుడు, ఇద్దరు (తమిళం) వంటి చిత్రాలు లోగడ వచ్చాయి. వీటిలో కొన్ని సూపర్ హిట్ చిత్రాలు. ఇవాల్టి సంఘటన రేపటికి చరిత్ర అవుతుంది. ఎన్‌టిఆర్ అప్పుడే ఒక చారిత్రక పురుషుడు అయినాడు. ఆయన మీద 2019 జనవరిలో రెండు మూడు సినిమాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని విడుదల కాబోతున్నాయి. వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో త్వరలోనే తేలుతుంది. ఒకటి మాత్రం నిజం! ఎవరు ఔనన్నా కాదన్నా ఎన్‌టిఆర్‌పై ఇందిరా గాంధీ, రాంలాల్, నాందెడ్ల భాస్కర్‌రావులు కుట్ర చేసిన మాట వాస్తవం కాదా? హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ఎంఎల్‌ఎలను బంధించి క్యాంప్ రాజకీయాలు నిర్వహించిన మాట నిజం కాదా?? ఎన్టీఆర్‌కు అన్యాయం జరిగినప్పుడు చంద్రబాబును ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు బహిరంగంగా బలపరిచారు. ఈ చరిత్రను ఈనాటికీ ఎవరూ మార్చలేరు. ఈ వాస్తవాలన్నీ ఎన్టీఆర్ బయోపిక్‌లలో చూపిస్తారా?
***
గత నెలలో సుమారు రెండు లక్షల మంది రామభక్తులు న్యూ ఢిల్లీ రామలీల మైదానంలో విరాట్ ప్రదర్శనను నిర్వహించారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మించండి’ అని వారు కోరారు. అయోధ్య శ్రీరాముని రాజధాని, అక్కడ రామాలయం నిర్మించాలా? వద్దా?? అనేది దాదాపు 200 సంవత్సరాలుగా పెను సమస్యగా మారింది. క్రీ.శ.10వ శతాబ్దంలో గజినీ మహమ్మద్ గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయాన్ని, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత 15వ శతాబ్దంలో సమర్‌ఖండ్ నుండి వచ్చిన బాబర్ అయోధ్య రామాలయాన్ని ధ్వంసం చేశారు. 17వ శతాబ్దంలో ఔరంగజేబు కాశీలోని విశే్వశ్వర దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. 1775లో తిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని దోచుకున్నారు. 1309లో మాలిక్ కాఫిర్ ఓరుగల్లులోని స్వయం భూ దేవాలయాన్ని, తమిళనాడులోని శ్రీరంగం, కర్నాటకలోని హళిబీడు, బేలూరు దేవాలయాలను ధ్వంసం చేశాడు. నాదిర్షా ఢిల్లీ వీధుల్లో ఓ సాయంత్రం ముప్పదివేల మంది హిందువులను సంహరించాడు. గజనీ మహమ్మద్ సుమారు 50వేల మంది బ్రాహ్మణులను సోమనాథ్ దేవాలయం పరిసరాల్లో హత్యచేసి సోమనాథ శివలింగాన్ని ముక్కలుగా చేసి, వాటిని మసీదుకు మెట్లుగా వాడుకున్నాడన్నది చరిత్ర. ఈ దారుణాలను ఎవరూ కాదనలేరు. అంతా సెక్యులరిస్టులే- అంటే హిందూ ద్వేషులే. ఇండియా ఉప్పు తింటూ పాకిస్తాన్, చైనాలకు కొందరు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ‘సైన్యాన్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టండి- మా తడాఖా ఏమిటో చూపిస్తాము’- అని మజ్లిస్ నేత హెచ్చరించడం ఇటీవలి సంఘటనయే. పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న అమాయక భారతీయ జాలర్ల మాటేమిటి? కులదీప్ యాదవ్ ఏమయ్యాడు? పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రపంచం చేత గుర్తింపజేయటంలో ఐక్యరాజ్యసమితి దారుణంగా విఫలమైంది.
***
తెలంగాణలోని మిర్యాలగూడలో ఇటీవల ఒక సంఘటన జరిగింది. వైశ్యకులానికి చెందిన అమ్మాయిని క్రైస్తవ మతస్థుడు వివాహం చేసుకున్నాడు. మతాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించి ఆ అమ్మాయి తండ్రి వరుణ్ణి హత్యచేయించాడు. నాగరికత పెరిగిన 21వ శతాబ్దంలో ఇలాంటి పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? కులాంతర, మతాంతర దేశాంతర వివాహాలు జరుగుతున్న కాలంలో ఈ కల్లోలం ఏమిటి? ఎవరైనా లోతుగా పరిశీలించారా? కళాశాలలోనో, ఉద్యోగం చేసే చోటో ఇరువురు పరస్పరం ప్రేమించుకుంటారు. అసలు సమస్య వివాహం తర్వాత మొదలవుతుంది. ఎవరి ఆహారపు అలవాట్లు, ఎవరి మత విశ్వాసాలు వారివి. అంటే క్షణికమైన ఆవేశాలు తగ్గిన తర్వాత వాస్తవం కళ్లముందు కఠోరంగా కన్పడుతున్నది. ఇదే కులాంతర మతాంతర వివాహాల వైఫల్యానికి కారణం. దీనిపై సామాజిక శాస్తవ్రేత్తలు లోతైన అధ్యయనం చేయాలి.
***
సెక్యులర్ మేధావిగా చలామణి అవుతున్న కంచె ఐలయ్య ఒక వ్యాసంలో- ‘2019లో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశంలో ఇక ఎన్నికలు అనేవి లేకుండా చేస్తాడు’ అని రాశాడు. ఐలయ్య భాజపాపై ఎందుకింత విషం చిమ్ముతున్నాడు? మోదీ ఓటమిని ఎందుకింతగా కోరుకుంటున్నాడు? ఇతనికి కొలరాడో (అమెరికా) నుండి మతం మార్పిడులకు నిధులు వస్తున్నాయి. అంటే ఆయన అమెరికా ఏజెంట్. నరేంద్ర మోదీ అధికారంలో ఉండటం అమెరికా, పాకిస్తాన్, చైనాలకు ఇష్టం లేదు. మతం మార్పిడుల కోసం విదేశాల నుండి భారత్‌లోని క్రైస్తవ సంస్థలకు వస్తున్న నిధులపై మోదీ ప్రభుత్వం ఆంక్షలు విధించడమే ఐలయ్య ఆగ్రహానికి అసలు కారణం.
***
కర్నాటకలోని మాండ్యా జిల్లాలో జెడిఎస్ పార్టీకి చెందిన ప్రకాశ్ అనే కార్యకర్తను ఎవరో హత్య చేయటం గొడవలకు దారితీసింది. కర్నాటకలో రైతుబంధు దేవగౌడ సుపుత్రుడు హెచ్.డి.కుమారస్వామి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 225 మంది ఎమ్మెల్యేలున్న శాసనసభలో ముప్పది స్థానాలు కూడా లేని జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా కుమారస్వామి పాలనాపగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి ఇతనితో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. కుమారస్వామి అధికారంలోకి వచ్చిన కొద్దినెలల్లోనే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఇటీవల కుమారస్వామి ఇలా అన్నారు..‘పోలీసు అధికారులారా? వెళ్లి అక్కడ నిరసన తెలుపుతున్న వారిని నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్ చేయండి. ఎటువంటి ‘లా అండ్ ఆర్డర్’ సమస్య వచ్చినా నేను చూచుకుంటాను. సాక్షాత్తూ కర్నాటక ముఖ్యమంత్రి ఇలా పోలీసులను ఉసిగొల్పుతుంటే- మానవ హక్కుల సంఘాలు, దేశభక్తులైన మన మహానేతలు ఏం చేస్తున్నారు? అయినదానికీ కానిదానికీ కొవ్వుత్తులతో ఊరేగింపులు జరిపి భాజపా పాలిత రాష్ట్రాల్లో ఆందోళనలను చేసే ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ కార్యకర్తలు కుమారస్వామి వ్యాఖ్యలను మాటవరసకైనా ఎందుకు ఖండించలేదు? అఫ్జల్‌గురు అనే నరహంతకుణ్ణి పాతికేళ్ల విచారణ తరువాత ఉరితీస్తే- ‘అది దుర్మార్గం’ అంటూ ఊరేగింపులు జరిపిన ఏచూరి సీతారాంలు, కన్హయకుమార్‌లు ఇపుడు ఎందుకు నోరుమూసుకొని ఊరుకున్నారు? ఎందుకంటే కుమారస్వామి కాంగ్రెసు అండదండలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి!
***
ఇంతకూ హనుమంతుడు ఎవరు? ఆయన కులం ఏమిటి? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు ఆదివాసీ దళితుడు అని అన్నారు. ఆయన మంత్రివర్గంలోని క్రీడాశాఖామాత్యుడు లక్ష్మీనారాయణ చౌదరి హనుమంతుణ్ణి జాట్ కులస్థుడని పేర్కొన్నారు. బిజెపి ఎంఎల్‌సి భుక్కల్ నవాబ్ మాత్రం హనుమంతుడు ముస్లిం అని తేల్చేశారు. ఇలా ఇష్టానుసారం నేతలు వ్యాఖ్యానించడాన్ని మధురకు చెందిన శంకరాచార్య ఖండించారు. ఇంతకూ హనుమంతుడు ఎవరు? ఇతడు దక్షిణాది బ్రాహ్మణుడు. నవవ్యాకరణ పండితుడు. ఇంకా చెప్పాలంటే తెలుగువాడు. రామాయణంలో ఇందుకు ఆధారాలున్నాయి. హనుమంతుడు త్రేతాయుగానికి చెందినవాడు. ఇస్లాం పుట్టి 1400 సంవత్సరాలు అయింది. అలాంటప్పుడు హనుమంతుడు ముస్లిం ఎట్లా అవుతాడు? ఆకాశంలో స్వాతి నక్షత్రం ఎర్రగా ఉంటుంది. ‘స్వాతి ప్రవాళం ఏకం’ అన్నారు పెద్దలు. ఇది వాయుదైవత్వం కలది. అంటే హనుమంతుడిని వాయుపుత్రుడు అనడం ప్రతీకాత్మకం. త్రేతాయుగంలో వేదాధ్యయనం చేసినవాడు బ్రాహ్మణుడే కానీ ముస్లిం ఎట్లా అవుతాడు?

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్