మెయిన్ ఫీచర్

బాల్యాన్ని బహుమతిగా ఇద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేటి బాలలే రేపటి పౌరులు.. బాలలే భారత భాగ్య విధాతలు..’ -ఇలాంటి నినాదాలు వింటున్నప్పుడు మధురాతిమధురమైన అనుభూతి ఏదో మనల్ని మైమరిపిస్తుంది. మనం మన పిల్లలను నిజంగా ప్రేమిస్తున్నామా? ఈ విషయమై మనల్ని మనం ప్రశ్నించుకోగలమా? మన దేశంలో బాల్యం అనేక దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. కొన్ని దృశ్యాలు మనసును పరవశింపచేస్తాయి. మరికొన్ని దృశ్యాలు గుండెను బరువెక్కిస్తాయి. బాల్యం ఎవరికైనా మధుర జ్ఞాపకమే. కానీ, అందరి బాల్యం ఒక్కలా ఉండదు. ఒక చోట బాల్యం ఉరకలెత్తే కడలి ప్రవాహం. మరోచోట అది ఎండిపోయిన సాగర గర్భం. కొందరికీ పట్టు మంచాలు సేద తీరిస్తే ,మరి కొందరిని కళ్లు తెరచీ తెరవక ముందే మృత్యువు వెంటాడుతుంది. మన దేశంలో ఏటా దాదాపు పనె్నండు లక్షల మంది శిశువులు నెల నిండకుండానే కన్నుమూస్తుండడం ప్రపంచంలో మరెక్కడా లేని విషాదం.
బాల్యం ఓ అద్భుత వరం.. పెద్దలకు బాల్యం గుర్తుకొస్తే చాలు భారమైన వయసు తేలికవుతుంది. అలనాటి జ్ఞాపకాలను మరోమారు మనసులోనే బాల్యం ఆవిష్కరింపజేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా బాల్యాన్ని తలుచుకోని మనిషి ఉండడు. ముద్దు ముద్దు మాటలతో, అల్లరి చేష్టలతో ఇంటిల్లిపాదినీ అలరించే బాలలంటే అందరికీ ప్రేమే. ప్రకృతి సహా అందరి ప్రేమకు అర్హులైనవారు బాలలు మాత్రమే. వారికోసం ఏటా మనం ప్రత్యేకంగా బాలల దినోత్సవం నిర్వహిస్తున్నాం. బాలలంటే బడికి వెళ్ళే పిల్లలే కానక్కరలేదు. సాటి పిల్లల్లా విద్య ద్వారా ఉత్తమ భవిష్యత్తును అందుకోవాలని ఆశించినా, ఆర్ధిక స్థితిగతుల వల్ల, బడికి దూరమై బ్రతుకు భారాన్ని అతి పిన్నవయసులో మోయవలసిన పరిస్థితిలో ఉన్నవారూ బాలలే. భవిష్యత్తంటే ఏ పూటకాపూట కడుపు నింపుకోవడమే అనే లక్ష్యానికి ఎదురీది బతికే ప్రతి బాలుడు, ప్రతి బాలిక బాల్యాన్ని ఆస్వాదించవలసిందే. మరి.. వారు బాల్యాన్ని ఎందుకు కోల్పోతున్నారు? అని ఆలోచిస్తే అనేక కారణాలు కనిపిస్తాయ. ప్రధాన కారణం మాత్రం బాలల హక్కులను కాలరాస్తున్న మన పాలకుల నిర్లక్ష్యధోరణి.
దేశంలో బాల్యాన్ని హాయగా అనుభవిస్తున్న పిల్లల సంఖ్య చాలా తక్కువ. తల్లిదండ్రుల పేదరికం పిల్లలను ఆనందానుభూతుల్లోకి కాకుండా నరకంలోకి నెడుతోంది. బాలకార్మికులు, ఆకలితో అల్లాడే పిల్లలు మన దేశంలోనే ఎక్కువ. కొన్ని కోట్ల మందికి అసలు బాల్యమే లేదు. ఎందుకంటే పుట్టిన 5 ఏళ్ల లోపే వారు మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న ఐదేళ్ళ వయస్సు లోపు పసి పిల్లల సంఖ్య భారత్‌లోనే అత్యధికంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ళ వయస్సు లోపున్న పిల్లల మరణాలలో మూడో వంతు మన దేశంలోనే జరుగుతున్నాయి. 2017 లో మరణించిన పిల్లల్లో 22 శాతం మంది భారత్‌లోనే ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. భారత్‌లో పుట్టిన వెయ్యిమంది శిశువుల్లో 62 మంది ఏడాదిలోపే చనిపోతుంటే, మిగిలిన వారిలో కొంతమంది పోషకాహార లోపంతో మృతి చెందుతున్నారు. ఏటా 14.5 కోట్ల మంది పిల్లలు పుట్టిన రెండుమూడేళ్లకే తనువు చాలిస్తున్నారని ఐరాస తెలపడం మనదేశ పాలనలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది. శిశు మరణాలను నివారించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలవౌతున్నాయి. వాగాడంబరం... ఆచరణశూన్యత శైశవానికి శాపాలుగా మారుతున్నాయి. చాలా గ్రామాల ఆసుపత్రులలో వౌలిక వసతులు లేకపోవడం, ఆసుపత్రులున్నా డాక్టర్లు లేకపోవడం,మందులు లేకపోవడం ... మరణాల రేటు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. ఏజెన్సీ ప్రాంతాలలో సరైన వసతులు లేకపోవడం వలన కలిగే చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని పౌర సమాజం, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నా పాలకులకు చీమకుట్టి నట్లయినా లేకపోవడం భాధాకరం.
నేడు మనిషి తన బాల్యదశను క్రమ క్రమంగా కోల్పోతూ వస్తున్నాడు. నవ నాగరిక సమాజంలో బాల్యం చిదిమివేయబడుతోంది. లేనివాళ్లింటో ఆకలి, అనారోగ్యం, అవిద్యతోనూ బాల కార్మికులుగాను చిదిమివేయబడుతున్న బాల్యం, ఉన్నవాళ్లింట్లో రెండు మూడేళ్లకే ప్రారంభమవుతున్న ప్రైవేటు, కానె్వంటు చదువులు, కార్పొరేట్ స్కూళ్లలో సర్వనాశనం అయిపోతోంది. మానవ ధర్మం ఛిద్రమైన ఈ సమాజంలోకి రావాలంటేనే శిశువుకు వేదన కలుగుతోంది. ఈ లోకంలో జరిగే అకృత్యాలను చూసే ధైర్యం లేక బాలలు వౌనంగా రోదిస్తున్నారు. అందుకే ఆరోగ్యవంతమైన శిశువులను స్వేచ్ఛగా ఎదగనిద్దాం.
మన దేశంలో కోట్లాది చిన్నారుల్లో చాలామంది శారీరకం గా మానసికంగా ఎదుగుదల లోపించి ఉంటున్నారు. ఆర్థిక, సామాజిక స్ధితిగతుల కారణంగా ఈ అభివృద్ధి లోపం ఏర్పడుతున్నమాట వాస్తవం. రేపటి జ్ఞానవంతమైన శక్తిమంతమైన, ఆరోగ్యవంతమైన నవభారతాన్ని నిర్మించాలంటే... నేటి బాలల అవసరాలను తీర్చడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. అందుకు సమయమాసన్నమైనది.
ఇక బాలికల సంగతి చెప్పనక్కరలేదు ఇంట్లో, బడిలో, గుడిలో ఎక్కడా వీరికి సరైన రక్షణ లేదు. స్వేచ్చగా ఎదగడం సంగతి అటుంచి, నిర్భయంగా బతకలేని పరిస్థితి ఏర్పడుతోంది. చదువుకున్న తల్లిదండ్రులు, సంపన్న కుటుంబాల పరిస్థితి వేరు. వలస వెళ్ళేవారు, తల్లిదండ్రులు పట్టించుకోని వారు, తాగుబోతుల పిల్లలు, అనాథలు ఇలాంటి వారి పరిస్థితి గురించి తలుచుకుంటే ఎవరికైనా బాధ కలగడం ఖాయం. ప్రభుత్వ బాలికల వసతి గృహాలు, హాస్టళ్ల గురించి చెప్పనవసరం లేదు. వసతి గృహాలలో బాలికలు సౌకర్యాలకు నోచుకోవడం లేదు. పైగా పలురకాల వేధింపులకు లోనవుతున్నారు. హాస్టళ్లలో పేద బాలికలపై లైంగిక వేధింపులు యథేచ్ఛగా గురవుతున్నారు.
ఒకచోట బడి పిల్లలు రాజ కుమారుల్లా దర్శనమిస్తారు. మరోచోట యోగి వేమనల్లే ఎదురొస్తారు. ఒకరికి వంటినిండా మోయలేనన్ని బరువులు. షూ, టై, బ్యాడ్జి, రిబ్బన్, వీపు మీద బ్యాగ్. వీటిలో ఏది లోపించినా అది నేరం. వాటిని మరచిపోయినా, దుస్తులు మాసిపోయినా వళ్లంతా వాతలతో శిక్ష. మరొకరిది శరీరాన్ని కప్పుకోలేని దైన్యం. సుర్రున కాలే రోడ్డుమీద నడవాలన్నా, ముళ్ల బాటలో పరుగెత్తాలన్నా కనీసం చెప్పులేసుకోలేని దౌర్భాగ్యం కొందరిది. అతుకుల బొంతలే వారికి యూనిఫాం. ఎందుకీ దుస్థితి ? ఎవరిదా పాపం? బంగారు చెంచాలో తినాలని కొందరి నొసటఎవరు వ్రాసారు ? చెత్త కుప్పల్లో మెతుకులు ఏరుకొని తినమని మరికొందరికి ఎవరు చెప్పారు? ఇదంతా తలరాత అని సర్దుకుందామా ? ఏమిటీ దౌర్భాగ్యం ? మరెందుకీ దైన్యం? బాలబాలికలకు అందమైన బాల్యాన్ని ఇవ్వలేమా?
పిల్లలకి బహుమతిగా ఏమివ్వబోతున్నారు? ఖరీదైన ఎలక్ట్రానిక్ ఆట వస్తువులు, థీమ్ పార్కు, మాల్స్‌కు పర్యటనలు..? ఖరీదైన మొబైల్ ఫోన్ ఇస్తారా? భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి.. ఆర్థిక బాండ్లూ, బీమా పథకాలను కానుకగా ఇవ్వాలనుకుంటున్నారా? వారి పేరు మీద లక్షలు కాదు కాదు కోట్లు కూడబెట్టాలనుకుంటున్నారా..? ఇవన్నీ చేయండి మంచిదే! కానీ వీటన్నింటికంటే మించినది ఒకటుంది అదే నేటి పిల్లలకి వాళ్ల బాల్యానే్న వారికి బహుమతిగా ఇవ్వండి! నిజానికిది బహుమతి కూడా కాదు. వాళ్ల నుంచి మనం బలవంతంగా దూరం చేసిన ఒక అద్భుతమైన వరం. దాన్ని కచ్చితంగా వారికి తిరిగి ఇవ్వండి.
మనకున్న ఎన్నో కోరికల మధ్య వాళ్లని వర్తమానంలో పిల్లలుగా చూడటం మరిచిపోతున్నాం. మార్కుల కోసం కొందరు, ర్యాంకుల కోసం మరికొందరు, మంచి భవిష్యత్తునిస్తున్నామనే భ్రమలో ఇంకొందరు.. చిన్నారుల బాల్యాన్ని తీసేసుకుంటున్నాం! వారి నుంచి బలవంతంగా లాక్కుంటున్న దాన్ని మనం తిరిగివ్వాలి? ఉన్నదాన్ని ఎలా కాపాడాలి? తరగని ఆనందం, నియంత్రణలేని ఉద్వేగం... ఇవే బాల్యం లక్షణాలు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత గత ఏడు దశాబ్దాల కాలంలో నిశ్చితమైన నిబద్ధతతో కూడిన రాజ్యాంగం, చట్టనిబంధనల ద్వారా బాలల కోసం మనం ఏం చేశాం? వారి కోసం మరిన్ని అవకాశాలను, కార్యాచరణ విధానాలను, కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ శతాబ్దపు చివరి దశకంలో సాంకేతిక అభివృద్ధిలో భాగంగా ఆరోగ్యం, పోషణ, విద్య అంశాలతో బాటు నూతన ఆకాంక్షలను, అవకాశాలను పిల్లలకు కల్పించేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వారి హక్కులను సంరక్షించే చర్యలు పూర్తి స్థాయలో తీసుకోవడం లేదు. చిన్నారులపై ఎలాంటి ఒత్తిడి తేకుండా వారి మనోభావాలను, కనీస హక్కులను మనం గుర్తించాలి. మంచి బాల్యాన్ని బహుమతిగా అందించినపుడే వారి పట్ల మన బాధ్యతకు సార్థకత సమకూరినట్టు.

-కాళంరాజు వేణుగోపాల్ 8106204412