మెయన్ ఫీచర్

జల ఒప్పందాల్లో నూతన ఒరవడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మూడు అంతర్ రాష్ట్ర జల ఒప్పందాలపై 2016 ఆగస్టు 23న సంతకాలు చేయడంతో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్టయింది. పెన్‌గంగా, ప్రాణహిత, గోదావరి నదులపై, చనాఖా కోరటా, తుమ్మిడి హట్టి, మేడిగడ్డ ప్రాజెక్టుల వద్ద బ్యారేజీల ని ర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రాణహితపై తుమ్మిడిహట్టి బ్యారేజి ద్వారా ఆదిలాబాద్‌లో 148 మీటర్ల సామర్ధ్యం కలిగిన పూర్తిస్థాయి రిజర్వాయర్, కరీంనగర్ జిల్లాలో మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై వంద మీటర్ల సా మర్ధ్యం కలిగిన పూర్తినీటి స్థాయి రిజర్వాయ ర్, ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగా నదిపై చ నాఖా-కోరటా రిజర్వాయర్ వల్ల 213 మీటర్ల పూర్తిస్థాయి రిజర్వాయర్ నిర్మాణం కానున్నాయి. ఒప్పందంలో భాగంగానే మేడిగడ్డ వ ద్ద నిర్మించనున్న రిజర్వాయర్ ఎత్తును మరో మీటరు ఎత్తుకు పెంచే అవకాశాన్ని, అవసరాన్ని ఆవశ్యకతను బట్టి పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మూడు రిజర్వాయర్‌ల నీటి నిల్వ సామర్ధ్యం వరుసగా 1.8 టిఎంసీలు, 16.17 టిఎంసీలు, 0.85 టీఎంసీలు. గోదావరి నీటినుండి తెలంగాణాకు కేటాయించిన 950 టిఎంసీల నీటినుండి 200 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుంది. ఈ బ్యారేజీల ద్వారా రాష్ట్రంలో రమారమి 40 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు వెసులుబాటు కలుగుతుంది. చారిత్రాత్మకమైన ఒప్పందాల ద్వా రా ప్రధానంగా ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లాకు గణనీయంగా లాభం కలుగుతుంది.
తెలంగాణ, మహారాష్టల్ర ముఖ్యమంత్రుల నేతృత్వంలో మార్చి 8, 2016 గోదావరి ప్రాజెక్టులపై అంతర్ రాష్ట్ర నీటి బోర్డును ఏర్పాటు చేసే అంశంపై అవగాహన పత్రాలపై సంతకాలు జరిగిన నాడే మొన్న జరిగిన ఒప్పందాలకు బీజం పడింది. తద్వారా దశాబ్దాల కా లంగా బ్యారేజీల నిర్మాణం విషయంలో చోటుచేసుకున్న అనవసర జాప్యానికి, అం తర్ రాష్ట్ర జలవివాదానికి తెరపడి, గోదావరి తదితర ఉప నదుల జల వినియోగానికి శ్రీకా రం చుట్టబడింది. ఈ ఒప్పందాలను ఒక చారిత్రాత్మక ఘట్టంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా, కోర్టులను, ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించకుండా దశాబ్దాల కాలంగా నలుగుతు న్న సమస్యకు అవగాహనా ఒప్పందం ఓ చరమ గీతం పలికినట్టుగా ఇరు రాష్ట్రాల ము ఖ్యమంత్రులు సంతకాల అనంతరం పేర్కొనడం విశేషం.
నేడు ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకించి మరీ ముఖ్యంగా జల వనరుల వినియోగం విషయంలో ఇరుగు పొరుగున వున్న వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించునే దిశగా జరిగిన అనేక ఒప్పందాల నేపథ్యంలో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వ పాలకులు గానీ, పూర్వ ఆంధ్రప్రదేశ్ పాలకులు గానీ ఏ విధమైన ఆలోచన చేయకపోవడం, చొరవ చూపకపోవడం విచారకరం. వాస్తవానికి అప్పట్లో అటు కేంద్రంలోను, ఇటు ఉభయ రాష్ట్రాల్లోను ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే! అలాగే పెన్‌గంగ, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో అంతర్ రాష్ట్ర వివాదాలు అనేకం చోటు చేసుకున్నా వాటి పరిష్కారానికి ఏవిధమైన చర్య తీసుకోలేదు. క్రమేపీ సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత జటిలం కాసాగాయి.
ఒక మోడల్ డాక్యుమెంటుగా పేర్కొనాల్సి న ఈ అవగాహన ఒప్పందంలో భవిష్యత్తు లో, బ్యారేజీల నిర్మాణ క్రమంలో ఇరు రాష్ట్రా లు చేయాల్సిన, చేయకూడని పలు అంశాలు పొందుపరిచారు. ప్రామాణికతలకు అనుగుణంగా పొందాల్సిన అనుమతులు, చేపట్టవలసిన చర్యలు, వరద నీటి సంబంధమైన అధ్యయనాలు, భూసేకరణలు, ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం, నీటి సామర్ధ్యం పరీక్షలు, ఖర్చులు, నీటి బట్వాడా, తాగునీటి అవసరాలు, మత్స్యకారుల సమస్యలు, నావిగేషన్ హక్కులు లాంటివి ఇందులో ప్రధానంగా వున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒప్పందం మేరకు పనులను వేగవంతం చేసి బ్యారేజీల త్వరితగతి నిర్మాణానికి దోహదపడే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ఇరుగు పొరుగున వున్న రాష్ట్రాలు కానీ, దేశాలు కాని, సమర్ధవంతంగా సక్రమంగా జలాలను పంచుకునే విషయంలో దౌత్యం- రాజనీతి ప్రధానమనేది ప్రపంచ వ్యాప్తంగా అనుభవం నేర్పిన పాఠం. అంతర్జాతీయంగా చరిత్రను నిశితంగా పరిశీలించినట్టయితే జలాల విషయంలో ప్రప్రథమ ఒప్పందం క్రీస్తుపూర్వం 2500లో మొదలైంది. అప్పట్లో నిరంతరం విభేదించుకుంటున్న మెసపొటేమియా పట్టణాలు-రాష్ట్రాలైన లగాస్, ఉమ్మా ప్రాంతాలు తొలి సంధి సంతకాలు చేపట్టడం ద్వారా టైగ్రిస్ నదిపై నీటి వినియోగ పంపకాలకు ఆస్కారం కలిగింది. ఆ క్రమంలో జలవనరుల వినియోగంపై ఇప్పటివరకు రమా రమి 3600 వరకు ఒప్పందాలు అంతర్జాతీయంగా కుదిరాయ. ఎన్ని విభేదాలు చోటుచేసుకున్నప్పటికీ, యుద్ధాలు జరిగినప్పటికీ సంబంధిత దేశాలు, రాజ్యాలు, అందుకు బద్దులై ఆయా సంధి ఒప్పందాలను తుచ తప్పక పాటించడం పరిపాటైంది. ఇందుకు చక్కని మచ్చుతునక ఇండస్ రివర్ కమిషన్. ఈ రివర్ కమిషన్ ఏర్పాటు అనంతరం భారత పాకిస్తాన్‌ల మధ్య మూడుమార్లు యుద్ధాలు జరిగినప్పటికీ నిలదొక్కుకోగలిగింది. ఇప్పటికీ నిరంతరాయంగా సంప్రదింపులు, స్వల్ప సమస్యల పరిష్కార చర్యలు, సమన్వయం, పర్యవేక్షణ, గణాంకాల పరిశీలన ద్వారా కొనసాగిస్తు న్నారు.
భారత పాకిస్తాన్ దేశాల మధ్య జలదౌత్య ఒప్పందం అంతర్జాతీయ ఒప్పందాలలో అత్యంత ప్రముఖమైందిగా పేర్కొంటారు. బ్రిటిష్ ఇండియా పునర్విభజన నేపథ్యంలో ఇండస్ బేసిన్‌లో ఎక్కువ స్థాయిలో జలాలు వుండడం వివాదాలకు దారితీసింది. అప్పటి నూతన దేశాలు జల వినియోగం, సాగునీటి అవసరాల సర్దుబాట్లు ఏ విధంగా చేపట్టాలి అన్న దిశలో మొదట్లో ఏకపక్షంగా వ్యవహరించాయి. ఏది ఏమైనప్పటికీ ఇండస్ వాటర్ ట్రీటీగా పేర్కొనబడ్డ జలదౌత్యం ప్రపంచ బ్యాంక్ ద్వారా భారత పాకిస్తాన్ దేశాల మధ్య కరాచీలో సంధిపత్రాలపై సంతకాలు చేసుకోవడానికి ఊతమిచ్చింది. నాటి భారత ప్రధాని దివంగత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, నాటి పాకిస్తాన్ అధ్యక్షులు దివంగత ఆయూబ్‌ఖాన్‌లు సెప్టెంబర్ 19, 1960లో సంతకాలు చేసారు. ఈ జలసంధి ఒప్పందం ద్వారా తూర్పున ఉన్న బీయాస్, రావి, సట్లెజ్ నదుల నియంత్రణ భారతదేశానికి, పడమటి దిక్కున ఉన్న ఇండస్, భిసాబ్, జీలమ్ నదుల నియంత్రణ పాకిస్తాన్‌కు అప్పజెప్పారు. పాకిస్తాన్ నదులు తొలుత భారతదేశం మీదుగా ప్రయాణిస్తాయి కాబట్టి సంధిలో మన సాగునీటి అవసరాల వినియోగానికి ప్రయాణానికి విద్యుత్ అవసరాలకు అనుమతించడం జరిగింది. దరిమిలా 1960లో జరిగిన ట్రీటీ రాటిఫికేషన్ ద్వారా భారత పాకిస్తాన్ దేశాల మధ్య నీటి యుద్ధాలకు పూర్తిగా ముగింపు పలికినట్టయింది.
ఇదే తరహాలో ఇంకో చక్కని ఉదాహరణగా చెప్పుకోదగ్గ విషయం భారత బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన గంగానదీ జలాల వినియోగ ఒప్పందం. ఇరు దేశాల మధ్య పారే గంగానది ఉత్తర భారతంనుండి బంగ్లాదేశ్‌కు ప్రవహిస్తుంది. ఈ విషయంలో 35 సంవత్సరాలపాటు వివాదం చోటుచేసుకుంది. పలు రకాల అంతర్గత ఒప్పందాలు, సంప్రదింపులు పరిష్కారం చూపలేకపోయాయి. క్రమేణా సమగ్రమైన అంతర్గత ఒప్పందానికి సంబంధించిన సంతకాలు అప్పటి భారత ప్రధాని హెచ్.డి.దేవెగొడ, నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాజేద్‌ల మధ్య డిసెంబర్ 12, 1996న ఢిల్లీలో జరిగాయి. సంధివల్ల 30 సంవత్సరాల సమస్యకు, జల పంపకాలకు ఒక అవగాహన కుదిరి గుర్తింపు పొందిన బంగ్లాదేశీయ హక్కుల ఆధారంగా లోయర్ లెవెల్ రిపారియన్ పేరుతో పంపకం జరిగింది.
విజయవంతంగా నీటి వినియోగం, పంపకం, సర్దుబాట్లు అన్నవి ముఖ్యంగా నిర్దేశిత ప్రామాణికతలపై, కట్టుబాట్లపై సమగ్ర సంప్రదింపులపై ఆధారపడతాయి. పరస్పర సహకారం, సక్రమ వినియోగం సరైన ఆలోచనలతో కూడిన అవగాహన ఒప్పందాలు దీర్ఘకాలం మనుగడ సాగేందుకు దోహదపడతాయి. వీటన్నింటి సమ్మిళితమే తెలంగాణ, మహారాష్ట్ర మధ్య జరిగిన ఒప్పందం. ఈ దిశానిర్దేశాలను తుచ తప్పకుండా పాటించడంలో ఇరు రాష్ట్రాలు విజయం సాధించాయి. భవిష్యత్తులో ఇతరులకు మార్గదర్శకంగా వుండబోతున్నాయి.
భారతదేశంలో అనేక నదులు అంతర్ రాష్ట్రంగా పారుతుంటాయి. నీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్ రాష్ట్ర కలహాలు ఏర్పడటం సహజం. ముఖ్యంగా నీటి పంపకాల విషయంలో ఇది పరిపాటి. ఇందుమూలంగానే 1956లో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ పేరుతో ఆర్టికల్ 262లో పేర్కొన్న విధంగా కేంద్రం ఒక చట్టా న్ని రూపొందించింది. భాషా ప్రయుక్త రా ష్ట్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో జలవివాదాలు తలెత్తిన పక్షంలో తగుచర్యలు తీసుకోవడం కోసం ఈ చట్టాన్ని తెచ్చారు. తద్వారా నీటి వినియోగం విషయంలో, అంతర్ రాష్ట్ర సర్దుబాట్లు చేయాలన్న ఆలోచన జరిగింది. ఈ చట్టంలో అనేక మార్పులు కూడా కాలానుగుణంగా చోటుచేసుకున్నాయి. ఈ చట్ట ప్రకారం ఎగువ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు వాటి సమస్యల పరిష్కారం అన్నది ఒక అంశం.
కాకపోతే ఎంతమేరకు ఈ చట్టంవల్ల అంతరాష్ట్ర సమస్యల పరిష్కారం జరిగింది అన్నది చర్చనీయాంశం. నిజంగా ఆ చట్టమే సక్రమంగా అమలైనట్టయితే గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం 450పైగా బారేజీలను, చెక్ డ్యాంలను నిర్మించడం సాధ్యపడేదా? కేంద్ర ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ట్రిబ్యూట్ యాక్టు ద్వారా చేయలేని పని దౌత్యనీతి ద్వా రా, రాజనీతి ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేయగలిగారు. ఫలితంగానే మహారాష్ట్ర- తెలంగాణల మధ్య ఒప్పందం కుదిరింది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలబడగలిగింది.తెలంగాణ, మహారాష్టల్ర మధ్య కుదిరిన ఈ ఒప్పందాలు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఇది ప్రప్రధమ అంతర్జాతీయ ఒప్పందమైన లగాష్ ఉమ్మా ట్రీటీ, భారత పాకిస్తాన్‌ల మధ్య జరిగిన ఇండస్ వాటర్స్ ట్రీటీ, భారత బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన గేంజెస్ రివర్ వాటర్స్ ట్రీటీలకు దీటుగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతుందని అనడంలోనూ అతిశయోక్తి లేదేమో.

- వనం జ్వాలా నరసింహారావు సెల్: 8008137012