మెయన్ ఫీచర్

తస్సాదియ్యా.. తుస్సుమంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డంత రాగం తీసి పిట్టంతపాట పాడాట్ట వెనుకటికో గానగంధర్వుడు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రకటన కూడా అలాగే ఉంది. హోదా ఇవ్వలేమని, ప్యాకేజీ ఇస్తున్నామంటూ జైట్లీ చేసిన ప్రకటన ఏపి ప్రజలను ఆగ్రహోదగ్రులను చేసింది. హోదాపై ప్రకటన చేసేవరకూ అమిత్‌షా ఏపికి రావద్దని, బిజెపి నేతలను అడ్డుకోవాలని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి గతంలో పిలుపునిచ్చారు. హోదా ఇవ్వకపోతే విడాకులేనని కేంద్రానికి బాబు స్పష్టం చేశారని, అవసరమైతే బయటకు వద్దామని, కేంద్ర వైఖరిపై అమరావతి అధినేత చాలా ఆగ్రహంతో ఉన్నారని, హోదా రాకపోతే బిజెపితో కలసి ఉండటం అనవసరమని, దానివల్ల తాము కూడా మునిగిపోతామని బాబుగారు అనేకమార్లు అంతరంగికులతో చెప్పినట్లు నయా రాజగురువు మీడియా లో చాలాసార్లు వాంతులు చేసుకోవడం కూడా జరిగింది.
సుజనాచౌదరి గారు అసలు ఆ పనిమీదే కేం ద్రాన్ని కదిలిస్తున్నారని అనుకూల మీడియాలో గంటకు పదిసార్లు వచ్చాయి. హోదా తీసుకురాలేకపోయినా ఆ పేరుతో చౌదరి గారు పదేళ్లకు సరిపడా పబ్లిసిటీ పొందారు. తెలివంటే అదీ! జులై నెలాఖరులో జైట్లీ రాజ్యసభలో హోదాపై చేసిన ప్రకటనపై బాబుగారు కూడా ‘రక్తం మరి గే’లా మాట్లాడారు. ఇవన్నీ చూసిన అమాయక జనం పాలకుల వీరావేశం నిజమేకామోసనుకున్నారు. ఇంకేముంది? హోదా రాకపోతే తెలుగు తమ్ముళ్లు అగ్గిరాముళ్లయి, కేంద్రం అంతు చూ స్తారనుకున్నారు. కేంద్రంలో ఉన్న ఇద్దరు మం త్రులతో రాజీనామా చేయించి, లడాయికి లంగరెత్తుతారేమోననుకున్నారు.
కానీ, జైట్లీ ప్రకటన తర్వాత సహృదయ స్వాగత స్పందన చూసిన అమరావతీయులు ఆశల భ్రమల్లోంచి బయటకొచ్చారు. నిజానికి ఈ విషయంలో చంద్రబాబును విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హోదా ఇవ్వకపోయినా తెదేపా చేయగలిగిందేలేదు. అప్పటి ఎన్డీఏ వేరు. ఇప్పటి ఎన్డీఏ లేదు. తెదేపా భుజం మీద చేయవేయకుండానే తన కాలిపై తాను నడవడమే కాదు, ఆ బలంతో తనతో ఉన్న పార్టీలనూ తానే నడిపిస్తున్న అమోఘ శక్తిమంతుడయిన ప్రధాని ఈ దేశాన్ని పాలిస్తున్నాడు మరి! అందువల్ల ఇచ్చింది పుచ్చుకోవడం, సరిపోకపోతే అడగటం వినా చేసేదేమీలేదు. ఆ స్థానం లో ఎవరున్నా అంతే!! కాకపోతే ఒత్తిళ్లు చేస్తున్నామనడం, పోరాటం చేస్తున్నామనడం, అవసరమైతే విడాకులు తీసుకుందామనడం.. ఇవన్నీ మీ డియాలో రాయించుకుని అప్పటికి మురిసిపోవడానికి తప్ప, మరెందుకూ అక్కరకురావు. కాకపోతే బాబుపై జనంలో ఉన్న నమ్మకం ఇంకా సడలలేదు. బాబు కష్టపడుతున్నారన్న భావన ఇంకా పోలేదు. ఏమి చేసైనా ఆయన రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారన్న భరోసా ఉంది. అది జగన్ విషయంలో లేకపోవడం బాబుకు కలిసొచ్చే పా యింటు.
అతిసర్వత్రా వర్జయేత్. నవ్యాంధ్రలో ఇప్పు డు ఇదే కనిపిస్తోంది. హోదా విషయంలో అనుకూల మీడియా రాసిన రాతల వల్ల ఆ పొద్దు గడి చి ఉండవచ్చు. ప్రజలు కూడా పాలకుల ధైర్యా న్ని మెచ్చుకునేలా కథనాలు వండి వార్చుకోవచ్చు. కానీ, అది ముందురోజుల్లో అసలుకే ఎస రు తెస్తుందన్న వాస్తవం, అనుభవం అయిన తర్వాత గానీ తెలియదు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. హోదాపై బాబుగారి ధైర్యం గురించి లేనిపోని కథనాలు వండి వార్చిన అనుకూల మీడియా కథనాలను ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటారు కదా?
అప్పుడు విడాకులు తీసుకుంటామని చెప్పిన (?) బాబు ఇప్పుడు ప్యాకేజీ ఇస్తే విడాకుల ప్రకటన కాకుండా స్వాగతం చెప్పడాన్ని ప్రజలు స్వాగతించరు కదా? నిజానికి బాబు ఆ మాట చెప్పి ఉండకపోవచ్చు. మీడియా భజంత్రీనే ఆయన మెప్పు కోసం అలా రాసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నష్టం ఎవరికి? భజన చేసే వారి చేతులు ఎప్పుడూ ఒకరినే మోయవు. అందునా వ్యాపారం వంటబట్టిన మీడియా చేతులు అసలు మోయవు. బాబు కాకపోతే మరొకరు. కానీ, అనని మాటలతో అప్పటికి సంబరపడి, ఇప్పుడు కష్టాల్లో పడింది పాలకులే కదా?! ఆ ప్రకారంగా ఈ భజంత్రీలు తమకు మేలు చేస్తున్నాయా? కీడు చేస్తున్నాయా అన్నది ఆలోచించుకోవలసిందీ పాలకులే!
ఎన్నికల ముందు తమ పార్టీ పతనానికి సొంత మీడియానే కారణమని వైకాపా సీనియర్ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగానే చెప్పారు. లేని సానుకూల వాతావరణాన్ని ఉన్నట్లు సృష్టించి, బోగస్ సర్వే ఫలితాలిచ్చి పార్టీని ముంచిందని విరుచుకుపడ్డారు. ఇప్పుడు అమరావతిలో తెదే పా విషయంలో కూడా అదే జరుగుతోందని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. కేంద్ర ప్యాకేజీల మాదిరిగానే ‘తెలుగు సర్కారు ప్యాకేజీ’లు తీసుకునే అనుకూల మీడియా కృతజ్ఞత ప్రకటించుకునేందుకు చాలా మార్గాలున్నాయి. ఇంకొన్ని పవర్ ప్రాజెక్టులు, మరికొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, కావాలంటే మొత్తం సమాచారశాఖ బడ్జెట్టునే గుత్తగా తీసుకోవచ్చు.
కానీ పాలకుల మెరమెచ్చుల కోసం ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కట్టుకథలు అల్లితే జనం తాత్కాలికంగా నమ్మవచ్చు. అది అబద్ధమని తేలిన మరుక్షణం వారిలో స్థిరపడే వ్యతిరేకతను ఎన్ని చానెళ్లు, ఎన్ని పత్రికలు తొలగిస్తాయి? రాజకీయ పార్టీలను ఎవరు కాపాడతారు? 2004 అనుభవాలు గుర్తులేవా? అప్పటి కాంగ్రెసుకు ఒక్క పత్రిక తప్ప మిగిలిన మీడియా అంతా వ్యతిరేకమే కదా? మీడియా మొత్తం తెదేపాకు అంకితమయినవే కదా? మరి ఏమయిం ది? కాంగ్రెస్ గెలిచింది కదా? అన్ని భ్రమలు కల్పించినా తెదేపాకు అర్ధశతకం కూడా దక్కలేదు కదా? నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉం టాయి.
ఇప్పుడిక ప్యాకేజీ వల్ల వచ్చే మేలేంటో జనాలకు చెప్పి, వారిని ఒప్పించాల్సిన అవసరం బిజెపి కంటే తెదేపాకే ఎక్కువ. ఎందుకంటే బిజెపి బలం నామమాత్రమే. రెండున్నరేళ్లు మీనమేషాలు లెక్కించి, చివరాఖరకు తుస్సుమనిపించిన కేంద్రంపై కళ్లురుమడం తప్ప, కాలుదువ్వే సీను లేదు. వచ్చిన ప్యాకేజీనయినా సమర్థవంతంగా వినియోగించుకోవడం విజ్ఞత. పోలవరం, ఇతర ప్రాజెక్టుల్లో పాలకుల చుట్టూ తిరిగే కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు కేంద్రానికి ఉప్పందింది. చేసిన పనుల లెక్కలు చెప్పి, కొత్త నిధులు తీసుకుని, రెండున్నరేళ్లలో ఒక్కటయినా మర్చిపోలేని మేలు చేస్తే అదే పదివేలన్నది జనం భావన. తాను సైతం విభజన లేఖ ఇచ్చినా ఇతరులను బోనులో నిలబెట్టి అధికారంలోకి వచ్చిన తెలివైనే నేత బాబు, ప్యాకేజీ గురించి కూడా జనం మదిలో సానుకూల భావన కల్పిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
* * *
ఎటొచ్చీ దెబ్బతిని వాడిపోయేది కమలమే. రాజకీయాల్లో కేవలం ఆత్మహత్యలే ఉంటాయి. హోదా ఇవ్వలేమని రెండున్నరేళ్లకు చెప్పిన బిజెపిది కూడా ఆత్మహత్యనే. ఆ ముక్కేదో ఏడాది క్రితం చెప్పి ఉంటే, మూలన కూర్చున్న శివాజీ అనే మాజీ కుర్ర హీరో కూడా నాలుగుకాళ్లతో పైకి లేచేవారుకాదు కదా? స్వయంప్రకటిత మేధావుల సంఘాలకు కాళ్లొచ్చేవి కాదు కదా? అలాకాకుండా తెలుగు టివి సీరియల్ జీడిపాకం మాదిరిగా సాగదీసి, తీరా ఇప్పుడు చేయలేమని చేతులెత్తేయడం వల్ల ఉపయోగం ఎవరికి? ఇంతా చేస్తే విభజన చట్టంలో లేనివి కొత్తగా ఇచ్చిందేమిటి?
ఉన్న సంకట స్థితిలో హోదా ఇవ్వలేము కాబట్టి, దాని బదులు ప్యాకేజీ ఇస్తామంటే ప్రజలు భాజపా నిజాయితీని అర్ధం చేసుకునేవారు. ఏదో ఒకటి ఇచ్చిందని సర్దుకునిపోయే వా రు. రాజధాని విషయంలో రెండుసార్లు మోసం చేసిన రాజకీయ పార్టీలనే క్షమించిన ప్రజలు, ఆపాటి నిజాయితీని మన్నించలేరా? అలాకాకుండా మిత్రపక్షానికి బోలెడంత ఉచిత ప్రచారం ఇచ్చి, అందరినీ హీరోలను చేసి చివరకు తాను విలనయి కూర్చున్న కమలాన్ని చూసి జాలి పడటం తప్ప చేసేదేముంది? ఇప్పటికయినా మించిపోయింది లేదు. ప్యాకేజీ వల్ల వచ్చే మేలేంటో చెప్పి, త్వరగా నిధులు విడుదల చేసి, రాష్ట్రానికి తాము చేసిన పుణ్యకార్యాలేమిటో చెప్పుకుంటే కనీస నగుబాటు తప్పుతుంది.
* * *
జనసేన సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అది ఎంతకాలం ఆడుతుందో చెప్పడానికి పెద్ద మేధావులే కానక్కరలేదు. కాకినాడ కాజాలు, పాచిపోయిన లడ్ల మధ్య సాగిన పవర్‌స్టార్ గారి ప్రసంగంలో పస శూన్యం. రైల్వే జోన్ కోసం స్వయంగా తెదేపానే ఆందోళన మొదలెట్టింది. దానిపై కల్యాణ్‌బాబు ఏమైనా సెలవిస్తారేమో, అన్యా యం జరిగిన చోట ప్రత్యక్షమవుతామన్నారు కదా!? ఆ ప్రకారంగా ఉత్తరాంధ్ర జనం పక్షాన నిలబడతానని చెబుతారేమోననుకున్నారు. ఆ ఒక్కటీ తప్ప అన్నీ మాట్లాడారు. తెలుగుదేశాన్ని ఇప్పటికీ అభిమానిస్తా, గౌరవిస్తానన్న జనసేనాని(?) జైట్లీ ప్రకటనను స్వాగతించిన తెదేపా తీరుపై గబ్బర్‌సింగవలేదేమిటి చెప్మా?! కాం గ్రెస్-బిజెపిని పవన్ దూదేకేశారు. తెలుగుదేశం పార్టీని మాత్రం కరుణించారు. ఎప్పుడో క్షతగాత్రురాలయి ఐసియులో ఉన్న కాంగ్రెస్‌ను, బలం ఉన్న పార్టీ కరుణిస్తే తప్ప, తెరవు లేని బిజెపిని విమర్శిస్తే ఎవరికి లాభం? అసలు కాకినాడలో పవన్ వేసిన కేక ఎవరి కోసం? ఎందుకోసం? బాబు గారు కూడా పవన్ జోలికివెళ్లవద్దని ఆర్డరేశారు. లోగుట్టు పెరుమాళ్లకెరుక!
హోదాపై ఒకవైపు తాను పోరాడతానని చెప్పి, అదే పోరాటంలో భాగంగా ప్రతిపక్షాలు ఇచ్చిన బందులో పాల్గొనవద్దని చెప్పకనే చెప్పిన, పవన్ భారీ పొలిటికల్ బడ్జెట్ సినిమాకు ప్రొ డ్యూసర్/బయ్యర్ల సమస్య లేదని అర్ధమయిం ది. కానీ ఎంత భారీ బడ్జెట్ సినిమాలయినా జనం చూడకపోతే అది మరో బాషా అవుతుందే తప్ప బాద్‌షా కాలేదు.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144