మెయిన్ ఫీచర్

ఏకత్వమే జ్ఞానస్థితి( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీకు తెలియదు తాతయ్యా ‘‘టైమ్ ఈజ్ కిల్లింగ్ యు.’’ ఒకవేళ మీరన్నదే నిజమైతే ‘‘మీరు చంపుతున్న ఆ కాలాన్ని తీసుకొచ్చి నాకు చూపించండి’’ అన్నాను ఆయనతో.
‘‘కాలం కరిగిపోతోంది, వెళ్ళిపోతోంది’’లాంటి వ్యక్తీకరణలన్నీ కేవలం ఒక రకమైన ఓదార్పుమాత్రమే. బతికున్నంతవరకు కాలం వెళ్ళిపోతున్నట్లుగా భావించే మనిషి మరణిస్తున్నప్పుడు మాత్రం తాను వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తాడు. నిజానికి, ప్రతి క్షణం, మీ జీవితకాలాన్ని పోగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నది మీరే. కానీ, మీరే ఇక్కడ స్థిరంగా ఉంటున్నట్లు, కాలమే వెళ్ళిపోతున్నట్లు భావిస్తున్నారు. నిజానికి, కాలం స్థిరంగానే ఉంది. దానిని లెక్కించేందుకు మనిషి సృష్టించిన గడియారాలు కూడా ఇక్కడ స్థిరంగానే ఉన్నాయి.
మీరెప్పుడైనా భారతదేశంలోని పంజాబ్‌కు వెళ్తే, అక్కడ మీరు ఎవరినీ ‘‘టైమెంతైంది?’’అని అడగకండి. ఎందుకంటే, ఒకవేళ అప్పుడు సమయం పనె్నండు గంటలైతే వాళ్ళు మిమ్మల్ని చితకబాదుతారు. అందుకు వేదాంత పరమైన కారణముంది. ఒకవేళ మీరు వారి బారినుంచి బతికిబయటపడితే ఏదో అద్భుతం జరిగినట్లే, మీరు అదృష్టవంతులైనట్లే. వేదాంత తత్వం మూర్ఖుల చేతుల్లోపడితే అలాగే జరుగుతుంది.
జ్ఞానోదయ, సమాధి స్థితుల గురించి, మరణిస్తున్న మనిషి మానసిక స్థితి గురించి సిక్కు మత స్థాపకుడైన ‘‘గురునానక్’’వివరిస్తూ ‘‘పనె్నండు గంటల సమయంలో గడియారంలోని రెండుముళ్ళు ఒకటైనట్లుగా, సమాధి స్థితిలోను, మరణిస్తున్నప్పుడు మీలోని ద్వంద్వం నశించి మీరు ఏకత్వాన్ని పొంది అస్తిత్వంలో లీనమవుతారు’’అన్నారు. అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అయినా, అప్పటినుంచి ‘‘పనె్నండు గంటల సమయం’’ పంజాబ్‌లో మృత్యు సంకేతంగా పరిగణించబడుతోంది. అందుకే ఆ సమయంలో మీరు సర్ధార్జీని ‘‘టైమెంతైంది?’’అని అడిగితే, ‘‘అతను చావాలని మీరు శపిస్తున్నట్లుగా భావించిన’’ అతడు వెంటనే మిమ్మల్ని చితకబాదుతాడు. ఎవరైనా ఏడుపు ముఖంతో దయనీయంగా కనిపిస్తే ‘వాడకి పనె్నండైంది’అనడం పంజాబ్‌లో ఒక అలవాటుగామారింది. ఎందుకంటే, గడియారంలోని రెండు ముల్లులు కలుసుకోవడం విపరీతమైన దుఃఖాలకు, అనేక మానసిక వేదనలకు కారణమేకాక, అది మృత్యువుతో సమానమని వారు భావిస్తారు. అందువల్ల ‘‘పనె్నండు గంటల సమయం’’ దగ్గరపడుతుంటే సర్ధార్జీలందరూ గబగబా వారి గడియారంలోని సమయాన్ని ‘‘పనె్నండు గంటల ఐదునిముషాలకు’’ మార్చడం నేను చాలాసార్లు చూశాను. అంతేకానీ, గురునానక్ వివరించిన జ్ఞానోదయ, సమాధి స్థితుల గురించి వారు ఎప్పుడూ ఆలోచించరు. ఎందుకంటే, ఆ విషయాన్ని వారు పూర్తిగా మరచిపోయారు. మనిషి మరణిస్తున్నప్పుడు- అతనికి సమయం పనె్నండైనప్పుడు- గడచిన జీవితానే్న పట్టుకుని వేలాడతాడు. దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండకపోగా, భరించలేని బాధ అతనిని చుట్టుముట్టడంతో, అతడు అపస్మారక స్థితి (కోమా)లోకి వెళ్ళి, గత జీవితాన్ని పూర్తిగా మర్చిపోతాడు. అతడు గత జీవితాన్ని ఎప్పటికీ గుర్తుకు తెచ్చుకోలేదు. ఒకవేళ ఎలాంటి కోరికలు లేకుండా, దేనికీ పట్టుకుని వేలాడకుండా జీవిస్తున్న సమయంలో మరణం ఆసన్నమైతే, మిమ్మల్ని బలవంతంగా అపస్మారక స్థితి (కోమా)లోకి నెట్టే అవసరం ప్రకృతికి ఉండదు కాబట్టి, మీరు పూర్తి ఎరుకతో సచేతనంగా మరణిస్తారు. అప్పుడు గతంలో మీరుచేసిన వెధవ పనులన్నీ మీకు గుర్తొస్తాయి. కొన్ని కోరికలు తీరినా, తీరని కోరికలు తీర్చుకున్నా ఇంకా కొన్ని కోరికలు మిగిలే ఉంటాయి. అదొక వింత ఆట. ఆ ఆటలో మీరు ఎప్పుడూ కోల్పోవడమే జరుగుతుంది. ఆ ఆటలో మీరు నెగ్గినా, ఓడినా పెద్ద తేడాఏమీ ఉండదు.
మీ ఆనందాలన్నీ నీటి కెరటాలపైన, మీ బాధలన్నీ రాతి పలకలపైన రాసిన రాతలు మాత్రమే. అందుకు మీరు అనేక బాధలుపడ్డారు. కేవలం చిన్న చిన్న ఆనందాలకోసం మీ మొత్తం జీవితాన్ని పణంగా పెట్టారు. కానీ, పూర్తి ఎరుకతో సచేతనంగా మరణించే అత్యున్నత స్థితిలో మీరు మీ జీవితాన్ని పరికిస్తున్నప్పుడు అవి మీకు చిన్న చిన్న ఆటబొమ్మలుగా కనిపిస్తాయి.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.