మెయన్ ఫీచర్

అడుగుజాడలు అటల్జీవి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మలి అడుగు వేయాలా? లేక
యుద్ధం నుంచి విరమించుకోవాలా?
ఏ దారి నేను పయనించాలి?
ఒక కల జన్మించి మరణించింది
వసంతకాలంలో తోట ఎండిపోయింది
ఎండుటాకులను ఏరుతూ కూర్చోవాలా?
కొత్త విశ్వాన్ని సృజించాలా..?
ఏ దారి నేను పయనించాలి?’

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి రచించిన ‘రాహ్ కౌన్సీ జావూ మై’ అన్న కవితలో పంక్తులివి. ప్రజల హితం కోసం ఒక సంక్లిష్టమైన దారిని ఎంచుకున్నప్పుడు తు పానులూ, తాకిడులూ తప్పవు. వెనక్కి వెళ్లాలా? ముందుకు పయనించాలా? అన్న మీమాంస ప్రతి ఒక్కరికీ ఏదో సమయంలో ఎదురవుతుంది. పిరికివాళ్లు తొలి సమస్య ఏర్పడగానే వెనక్కివెళ్లిపోతారు. కాని మహానాయకులు ధైర్యంతో ప్రతి సమస్యనూ అవలీలగా ఎన్నుకుంటారు. అంతిమంగా తమ లక్ష్యాన్ని సాధిస్తారు. అటల్ బిహారీ అలాంటి విజేత. అందుకే ఆయన ఇవాళ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అటల్జీకి ప్రధాని పదవి అంత సులభంగా రాలేదు. ఒక సామాన్య అధ్యాపకుడి కుమారుడైన వాజపేయి జర్నలిస్టుగా తన వృత్తి జీవితం ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరి స్వదేశ్, వీరార్జున్, రాష్టధ్రర్మ, పాంచజన్య పత్రికలకు సంపాదకత్వం వహించారు. ఇటుకలే తలగడగా భావించి రాత్రివేళ ప్రెస్‌లో నిద్రిస్తూ, ప్రజలకు వెలుగు చూపేలా పత్రికల్ని నడిపారు. ఎమర్జెన్సీలో ఆయనను ఇందిరమ్మ ప్రభుత్వం జైలుపాలు చేసింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆయన నిబద్ధత కోల్పోలేదు. భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా, తర్వాత బిజెపి అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేశారు. 1957 నుంచి 2009 వరకు పదిసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మం త్రిగా భారతీయ విదేశాంగ విధానంపై తనదైన ముద్ర వేశారు. ఎన్నో పోరాటాలు, ఎన్నో సంఘర్షణల అనంతరం వాజపేయికి ప్రధాని పదవి లభించింది. ఆ పదవి లభించిన తర్వాత కూడా అడుగడుగునా ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తొలుత 13 రోజులు, తర్వాత 13 నెలలు, చివరకు దాదాపు ఐదేళ్లు దేశాన్ని పాలించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా చరిత్రకెక్కారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కన్నా దేశ అభివృద్ధికి తన పాలనలో పెద్దపీట వేశారు. అతి తక్కువ సమయంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుని వాటి ఫలితాలు చిరకాలం ప్రజలు అనుభవించేందుకు దోహదం చేశారు. ఎన్నో ఏళ్ల దుష్పరిపాలన తర్వాత ఒక సమర్థుడైన సారథి దేశానికి లభిస్తే ఒక కొత్త దశ, దిశ ఎలా ఏర్పడుతుందో ఆయన నిరూపించారు.
ఇవాళ మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే- దేశ పురోగతి కోసం ఎంత దూరదృష్టితో ఆయన ఎనె్నన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారో అనిపిస్తుంది. ఇవాళ మహానగరాల మధ్య విశాలమైన రహదారులు చూసినా, వేలాది గ్రామాల ప్రజలు సులభంగా పట్టణాలకు వెళ్ళేందుకు ఉపయోగపడుతున్న రోడ్లను చూసినా వాజపేయి మనకు గుర్తుకువస్తారు. ఆయన హ యా ంలో చేపట్టిన ‘స్వర్ణ చతుర్భుజి’, ‘గ్రామీణ సడక్ యోజన’ దేశ అభివృద్ధి చరిత్రలో మైలురాళ్లు అని చెప్పక తప్పదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపి దేశ రాజకీయ గమనానికి దిశానిర్దేశం చేశారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను మరింత విస్తృతంగా అ మలు చేసిన రాజనీతిజ్ఞుడు వాజపేయి. దేశ అభివృద్ధి కోసం ‘విదేశీ సంచార్ నిగం’ సహా అనేక సంస్థలను ప్రైవేటీకరించేందుకు ఆయన వెనుకాడలేదు. ప్రత్యేక ఎగుమతి మండలాలు, పారిశ్రామిక పార్కులు వంటి ఆవిష్కరణలతో విభిన్న రంగాల్లో వినూత్న మార్పులు తీసుకువచ్చి దేశం రూపురేఖల్ని మార్చేందుకు ఆయన నడుం కట్టారు. విదేశాల్లో వున్న భారతీయుల దృష్టిని స్వదేశం వైపు మళ్లించి వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములు చేసేందు కు తొలిసారిగా ‘ప్రవాస భారతీయ దివస్’ను ప్రవేశపెట్టింది ఆయనే. దేశంలో ‘అనుసంధాన ప్రక్రియ’ (కనెక్టివిటీ) విప్లవానికి నాంది పలికారు. వైమానిక, నౌకా, రైలు, జాతీయ రహదారి, గ్రామీణ రోడ్లు, టెలికామ్, ఐటి రంగాల్లో ప్రగతి ఆయన చలవే. అదే సమయంలో సామాన్య ప్రజల సంక్షేమం కోసం పరితపించారు. సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన, అంబేద్కర్ వాల్మీకి బస్తీ యోజన, జాతీయ పోషకాహార మిషన్ వంటి అనేక పథకాలను బడుగుజీవుల కోసం చేపట్టారు. ఆయన ప్రవేశపెట్టిన ‘సర్వశిక్షా అభియాన్’ దేశంలో లక్షలాదిమందిని నిరక్షరాస్యత నుంచి బయటపడేసింది.
ప్రధాని పదవి చేపట్టిన కొంతకాలానికే భారత అణుపాటవాన్ని పోఖ్రాన్‌లో పరీక్షల ద్వారా ప్రపంచానికి రుజువుచేసి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన ఆయన నిలబెట్టారు. దీంతో అమెరికా,బ్రిటన్, కెనడా నిరసన రాగాలు తీసినప్పటికీ, అభివృద్ధి పథంలో భారత్ ముందుకు దూసుకువెళ్లడం చూసి ఆ దేశాలు ఆంక్షల్ని సడలించక తప్పలేదు. తనదైన శైలిలో విదేశీ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించి, అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచేందుకు వాజపేయి సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు. చర్చల ద్వారా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించేందుకు పూనుకుంటూనే వ్యాపార సంబంధాలు మెరుగుపడేలా చైనాకు స్నేహహస్తం చాచారు. వాజపేయి ప్రధాని కాకముందు దాదాపు 20 ఏళ్ల వరకు అమెరికాతో మన సంబంధాలు అంతంత మాత్రమే. అటల్జీ హయాం నుంచి ఈ సంబంధాల్లో ఎంతో గుణాత్మకమైన మార్పు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జిమీ కార్టర్ భారత్‌కు వచ్చిన దాదాపు 22 ఏళ్ళ తర్వాత అగ్రరాజ్యాధినేత బిల్ క్లింటన్ మన దేశంలో అడుగుపెట్టారు. దీంతో అంతర్జాతీయంగా ప్రచ్ఛన్న యుద్ధకాలం సమాప్తమై అమెరికాతో వా ణిజ్య సంబంధాలు, వ్యూహాత్మక అంశాలపై పరస్పర సహకారం ప్రారంభమైంది. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు జరపాల్సిన అవసరాన్ని ఆయన ప్రపంచానికి చాటిచెప్పిన తర్వాత ఎంతో కాలానికి- 2011 సెప్టెంబర్ 11 దాడుల ఫలితంగా అమెరికా తాలిబన్, అల్ ఖాయిదాలపై పోరుకు వ్యతిరేకంగా భారత్ నుంచి వ్యూహాత్మక సహకారాన్ని కోరింది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొడుతూనే ఆ దేశానికి స్నేహ హస్తం అందించి, లాహోర్‌కు బస్సు యాత్రలో వెళ్లిన శాంతిదూత వాజపేయి. ఆయన స్ఫూర్తితో భారత సైనికులు ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో శత్రుసేనల్ని దునుమాడి కార్గిల్‌లో చొరబాటును తిప్పికొట్టారు. వాజపేయి ఒక సమర్థవంతమైన ‘రక్షణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ’ను ఏర్పరిచారు. పాక్ చొరబాటును తిప్పికొట్టిన తర్వాత ఆయన ఆగ్రాలో అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారప్‌తో చర్చలు జరిపారు. ఉపఖండంలో శాంతి నెలకొంటేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. ‘చర్చలపై మాకు నిరంతర విశ్వాసం ఉంది. అదే సమయంలో భారత సరిహద్దు దాటి లోపలికి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తే కర్కశంగా అణిచివేస్తాం..’ అని స్పష్టం చేశారు. ‘మనం 50 ఏళ్లుగా పోరాడుతున్నాం. ఇంకెన్ని సంవత్సరాలు మీరు యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఈ వైఖరి పాకిస్తాన్‌కు కానీ, భారత్‌కు కానీ ప్రయోజనం చేకూర్చదు. పరిమిత వనరులను అనవసరంగా యుద్ధాల్లో వృధా చేస్తున్నాం. యుద్ధమే లేకపోతే ఈ నిధులన్నింటినీ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉపయోగించవచ్చు.. యుద్ధం చేయాలంటే- పేదరికంపై, నిరుద్యోగంపై, వ్యాధులపై, వెనుకబాటుతనంపై చేద్దాం..’ అని 2001 ఆగస్టు 15న 54వ స్వాతంత్య్రదినోత్సవ దినం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై ప్రసంగిస్తూ ఆయన జాతికి పిలుపిచ్చారు.
వాజపేయి అసలైన బలం ఆయన వాగ్ధాటి. స్వతహాగా కవి అయిన ఆయన మాట్లాడుతూంటూ కవిత్వం పొంగి పొరలుతుంటుంది. ఆయన కవితా భాష, హావభావాలు, శైలి ఎవరినైనా ఆకర్షించక తప్పదు. పరవళ్లు తొక్కే గంగా ప్రవాహం ఆయన ప్రసంగం. అదే ఆయనకు వరమై జనసంఘ్, బిజెపిల్లో నాయకత్వ లక్షణాలను అందించింది. 1957లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైనప్పుడు చివరి వరసలో ఉన్నప్పటికీ ఆయన అనర్గళ ప్రసంగం అప్పటి ప్రధాని నెహ్రూ దృష్టిని ఆకర్షించింది. నెహ్రూ వాజపేయిని ఆలింగనం చేసకోవడమే కాక ‘ఎప్పటికైనా దేశ నాయకుడివి అవుతావ’ని చెప్పారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత నెహ్రూ మాటలు నిజమయ్యాయి. వాజపేయి రెండో బలం అజాత శత్రుత్వం. ఆయన ఎవర్నీ ద్వేషించలేదు. సమస్యలపైనే పోరాడారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్నా, ప్రధాని పదవిలో ఉన్నా అందరూ ఆదరించగల వ్యక్తిత్వం ఆయనది. ‘ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ, దేశం కంటే గొప్పవాడు కాదు. ఓ రాజకీయ పక్షం ఎంత శక్తివంతమైనదైనా కావచ్చు కానీ, ప్రజాస్వామ్యం కంటే శక్తివంతం కాజాలదు’ అన్న వాజపేయి తన రాజకీయ జీవితంలో ఉన్నత విలువలకు, అత్యున్నత ప్రమాణాలకు ప్రతీకగా నిలిచారు. స్వాతంత్య్రానంతర భారత రాజకీయాలకు నూతన సంస్కారం నేర్పారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తన దక్షత, విజ్ఞత, బాధ్యతలను మేళవించి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లినందువల్లే అటల్ బిహారీ పుట్టినరోజును ఎన్‌డిఏ ప్రభుత్వం సుపరిపాలనా దినోత్సవంగా నిర్వహిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. సాధారణ బడిపంతులు కొడుకైన వాజపేయి ప్రధాని అయితే, చాయ్‌వాలా కుమారుడైన మోదీ ప్రధాని అయ్యారు. ఇది భారత దేశ ప్రజాస్వామ్య విశిష్టత. వాజపేయి తర్వాత ప్రధాని అయిన బిజెపి నాయకుడు మోదీ. అటల్జీ అందించిన సుపరిపాలనను ధ్యేయంగా పెట్టుకుని మోదీ కూడా పాలనను పటిష్టవంతం చేయడం పైనే దృష్టి పెట్టారు. ‘తక్కువ ప్రభుత్వం, ఎక్కువ పాలన అవసరమ’ని చెప్పిన మోదీ సామాన్యుల కోసం వాజపేయి ప్రారంభించిన ఎన్నో పథకాలను మరింత వేగవంతం చేశారు. పొరుగు దేశాలతో మైత్రి, విదేశాలతో సంబంధాలను విస్తరించడం, ప్రపంచ దేశాల సరసన భారత్‌ను నిలబెట్టడం, సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడం మొదలైన అనేక అంశాల విషయాల్లో వాజపేయి ఆలోచనా విధానాన్ని మోదీ పరిగణనలోకి తీసుకున్నారనడంలో సందేహం లేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించిన వాజపేయితో పోలిస్తే పూర్తి మెజారిటీ అధికారంలోకి వచ్చిన మోదీ అవినీతిపై పోరాటం, నల్లధన నిర్మూలన విషయంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను, జన జీవనాన్ని కలుషితం చేసిన అవినీతి, నల్లధనంపై మోదీ యుద్ధం ప్రకటించారు. ‘అవినీతి నిరోధంలో ప్రజల ప్రమేయాన్ని పెంచాలి’ అన్న వాజపేయి మాటల్ని ఆయన అమలు చేస్తున్నారు. సుపరిపాలన అంటే ప్రజలకు చట్టబద్ధంగా లభించాల్సిన అన్ని సేవలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించడం. తమ హక్కులు, సాధికారికత కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, అవినీతి, వేధింపులు, వివక్షకు తావులేకుండా ప్రతి పనీ ప్రతి ఒక్కరికీ జరగడం. ప్రజల సుఖమయ జీవనం కోసం ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, కార్యాలయాల్లో బయోమెట్రిక్ అటెండన్స్, పారదర్శకత, జవాబుదారీ విధానం మొదలైనవి సుపరిపాలనకు చెందినవే. ఆదాయపు పన్ను రిటర్నుల్లో పేర్కొన్న రిఫండ్ సకాలంలో చెల్లించకపోతే సంబంధిత అధికారిపై చర్యలు ప్రవేశపెట్టడం లాంటి చర్యలు ఇందుకు నిదర్శనం.
ప్రజల జీవితాల్లో వెలుగు ప్రసరించడానికి, అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయడానికి మోదీ పలు చర్యలు తీసుకుంటున్నారు. జామ్ (జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్), ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులు, నగదు రహిత వ్యవస్థ దిశగా ప్రజలను మళ్లించడం ఈ కోవలోవే. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజల ఆర్థిక లావాదేవీలు సౌకర్యవంతంగా, నిర్విఘ్నంగా జరిగేలా చూడడమే ఈ కార్యక్రమాల ఉద్దేశం. అనవసరమైన చట్టాలను, నిబంధనలను రద్దుచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే మోదీ ప్రభుత్వ ఉద్దేశం. ఉదాహరణకు పింఛనుదారు ప్రతి ఏడాది ‘తాను జీవించి ఉన్నట్టు’ సర్ట్ఫికెట్ తెచ్చుకోవాల్సిన పద్ధతిని మోదీ సర్కార్ ఎత్తివేసింది. ప్రభుత్వ ఆలోచనలను ప్రజలతో పంచుకుని వారి సూచనలను స్వీకరించేందుకు ‘మై గవర్నమెంట్’, ‘నరేంద్ర మోదీ యాప్’ల ద్వారా ప్రజలతో నేరుగా సంప్రదించడం, తద్వారా నిర్ణయాల్లో వారిని భాగస్వాములు చేయడం మోదీ ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో చెప్పుకోదగ్గ అంశం.
నాడు వాజపేయి వేసిన ‘సుపరిపాలనా మార్గం’ మోదీ సారథ్యంలో మరింత విస్తరించి దేశ బంగారు భవిష్యత్తు కోసం సుస్థిరమైన బాటగా మారుతుందనడంలో సందేహం లేదు. ‘సంస్కరించు, ఆచరించు, పరివర్తన’ ద్వారా ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ (అందరితో కలిసి అందరినీ అభివృద్ధి చేయడమే) సాధించడమే మోదీ ధ్యేయం. గ్రామాలు, పేదలు, రైతులు, మహిళలు, యువతకే నా ప్రాధాన్యం అని ఆయన పదే పదే చెబుతున్నారు. ‘హర్ నహీ మానుంగా’ (ఓటమిని అంగీకరించేది లేదు) అన్న వాజపేయి స్ఫూర్తితో మోదీ కూడా మడమతిప్పని పోరాటం చేస్తూ జన హృదయాల్లో విజేతగా స్థానం సంపాదించుకున్నారు. *
**
- ముప్పవరపు వెంకయ్యనాయుడు
కేంద్ర సమాచార, ప్రసార, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి

- ముప్పవరపు వెంకయ్యనాయుడు కేంద్ర సమాచార, ప్రసార, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి