మెయన్ ఫీచర్

అంతా ఆ తాను ముక్కలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనది విభిన్నమైన పార్టీ అన్నది భాజపా భావన. సి ద్ధాంతాల మడి కట్టుకున్న తాను సీతమ్మ లాంటి పునీతురాలినన్నది మరో నమ్మకం. దశాబ్దాలుగా కాంగ్రెస్ కుంభకోణాలను చూసి వెగటుపుట్టిన జనం, గత మూడేళ్ల మోదీ పాలనలో ఒక్క స్కామూ జరగకపోగా, ఎంతో కొంత మేలే జరుగుతుందని భావించారు. అందుకే బిజెపి ‘మడి’ గొప్పది కామోసనుకున్నారు. కానీ సిద్ధాంతాల మడిబట్ట విప్పేసి, దాన్ని జమ్మిచెట్టుపై పెట్టి తానూ మిగిలిన రాజకీయ పార్టీలకేమీ తక్కువ కాదని, తానూ ఆ తానులోని ముక్కనేనని నిర్మొహమాటంగా చాటుకున్న బిజెపి ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే.
రాజకీయాల్లో హత్యలుండవు, అన్నీ ఆత్మహత్యలే..! కావాలంటే గుజరాత్ కథే చూడండి. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో లెక్కప్రకారం రెండు బిజెపి, ఒకటి కాంగ్రెస్‌కు దక్కాల్సి ఉంది. కానీ చాణక్యుడిని చంపి పుట్టిన అమిత్ షా, కాంగ్రెస్‌కు దక్కాల్సిన ఆ ఒక్క సీటునూ కబ్జా చేసి, తనపై గతంలో కేసులు పెట్టించిన సోనియామాత ప్రధాన పూజారి అహ్మద్ పటేల్‌ను రాజకీయంగా శంకరగిరి మా న్యాలకు పంపించాలన్న తిరుగులేని పథకం వేశారు. అహ్మద్ పటేల్‌ను ఆ రకంగా దెబ్బతీసి కాంగ్రెస్ మాడు పగలకొట్టి, దెబ్బకుదెబ్బ తీయాలన్న అమిత్ షా వ్యూహం ఫలించి ఉంటే కథ మరోలా ఉండేది. వ్రతం చెడ్డా ఫలితం దక్కేది. అదే జరిగితే భాజపేయుల కంటే కాంగీయులే ఎక్కువ సంతోషపడేవారు. కాంగ్రెస్ దివాణంలో ఏళ్ల తరబడి పాతుకుపోయి, సోనియా కచేరీలో తిష్ఠవేసి, అధికారంలో ఉండగా ఎంతోమంది దిగ్గజాల రాజకీయ జీవితాలతో ఆడుకున్న పటేల్‌కు తగిన శాస్తి జరిగిందని కాంగ్రెస్ వారు సైతం చంకలు గుద్దుకునేవారు. ముఖ్యమంత్రులను మట్టిబొమ్మలను చేసి రిమోటును తన చేతిలో పెట్టుకుని ఆడించిన రింగుమాస్టరుకు తగిన గుణపాఠం జరిగిందని సంబరపడేవారు. ఎన్నికైన వాళ్లను చులకనగా చూసిన పటేల్‌కు ఇప్పుడు వారి విలువ తెలిసివచ్చిందని ఆనందపడేవారు. తన సలహాలతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పార్టీని విజయవంతంగా భ్రష్ఠుపట్టించి, దాని బలాన్ని నాలుగుపదులకు తీసుకువచ్చి సమాధి స్థితికి తీసుకువెళ్లిన గుజరాతీ బాబు, కనీసం ఎన్నికల్లో ఓడిపోతే సోనియమ్మ ఆయనను పక్కకుపెడతారన్న మెజారిటీ కాంగ్రెస్ నేతల కోరికా తీరేది.
కానీ, అమిత్‌షా వ్యూహం వికటించింది. అహ్మద్ పటేల్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకునే విషయంలో ఆయన కేసీఆర్ అన్నట్టు ‘భ్రమిత్ షా’ అయిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి, క్యాంపు పెట్టి నానాయాతన పడినా, పటేలుశ్రమ ఫలించలేదు. అయినా ఎ న్నికల కమిషన్ పుణ్యాన, ఇంకా దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది కాబట్టి పటేలు ‘బ తుకు జీవుడా’అని బయటపడ్డారు. ఇక్కడ మనం ‘చావుతప్పి కన్నులొట్టపోయిన’ పటేలు విజయం గురించి పెద్దగా ప్రస్తావించనక్కర్లేదు. ఆయనను ఓడించాలని ప్రయత్నించి భంగపడిన బిజెపి నయా రాజకీయ సిద్ధాంతం గురించి ప్రస్తావించుకోక తప్పదు. తన మానాన తన రెండు సీట్లకే పరిమితమై ఉంటే బిజెపికి నైతికంగా, సాంకేతికంగా, రాజకీయంగా పరాభవం తప్పేది. పోనీ వ్రతం చెడ్డా ఫలితం దక్కిందా అంటే అదీ లేదు. ఇప్పుడు ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌కు ఏమీ తీసిపోదన్న అపవాదు మూటకట్టుకుంది. నీతి నిజాయితీ, సిద్ధాంతాలతో ఏ రాజకీయపార్టీ ఎక్కువకాలం మనుగడ సాగించలేదని, ఆ గీత దాటితే తప్ప ఉనికి ఉండదన్న విషయం బిజెపి గుజరాత్ ఎన్నికల ద్వారా దేశానికి ఓ సందేశం ఇచ్చింది. దీనిపై ఓ బిజెపి సీనియర్ నేత మాట్లాడుతూ- ‘గుజరాత్‌లో మేం చేసింది తప్పుకాదు. పటేల్ యుపిఏ హయాంలో ఎన్ని అరాచకాలు చేశారు? మోదీ,అమిత్ షాలను ఎంత వేధించారు? ఎంతమంది సీఎంల జీవితాలతో ఆడుకున్నారు? దాంతో పోల్చితే ఇదెంత? ప్రజలు కోరుకున్నదే తమ పార్టీ చేసింద’ని విశే్లషించారు.
నిజమే.. మరి సిద్ధాంతాల మాటేమిటి? తనది భిన్నమైన పార్టీ అని మెడలో బోర్డు పెట్టుకుని చేసుకుంటున్న ప్రచారం మాటేమిటి? పొద్దున లేస్తే నిద్రపోయే వరకూ నిరంతరంగా చెప్పే సైద్ధాంతిక రాజకీయాలకు ఆ పార్టీ ఇచ్చిన విలువేమిటి? కాంగ్రెస్ గతంలో ఇలాంటి అరాచక చర్యలకు దిగి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వాపోయిన అదే భాజపా ఇప్పుడు గుజరాత్‌లో చేసిందేమిటి? అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో గవర్నర్ల దన్నుతో చేసిన నిర్వాకంతో ప్రజాస్వామ్యం ఏమైనా పరిఢవిల్లిందా? వీటి వల్ల మోదీ ఛాతీ జనం దృష్టిలో ఏమైనా పెరిగిందా? బిజెపి అప్రతిష్ఠ పాలవకుండా బయటపడిందా? కాంగ్రెస్‌కు, బిజెపికి తేడా ఏమిటన్న సామాన్యుల ప్రశ్నకు కాషాయ గళధారులే జవాబివ్వాలి.
* * *
ఏపిలో ఇప్పుడు చంద్రబా బు-జగన్ కంటే ‘అరువు మే ధావి’ ప్రశాంత్ కిశోర్ (పీకే) అందరినోటా నానుతున్నారు. ఆయన ఎన్ని రాష్ట్రాల్లో అరువు సలహాల్చి కోట్లు ఫీజు తీసుకున్నా, ఇంత ఉచిత ప్రచారం ఎక్కడా దక్కలేదు. పాపం జగన్ అమాయకత్వం వల్ల, తనకంటే ‘పీకే’నే గొప్పవాడని నిండుసభలో పరిచయం చేసినందుకు పీ.కే. జగన్ రుణం బాగానే తీర్చుకుంటున్నట్లునారు. సోషల్ మీడియాలో పాత అకౌంట్లకు దుమ్ము దులిపి, ఉత్తరాది పేర్లతో కామెంట్లు పెట్టి అడ్డంగా దొరికిపోయిన వైనం చూస్తే.. ఈ అరువు కిశోరం తెలివి తెల్లారినట్లే ఉందని, కాపీ కొట్టడం కూడా రాని ఈయన, జగన్‌బాబునేం ఉద్ధరించి పార్టీని గద్దెనెక్కిస్తారన్న సందేహం మెడ మీద తల ఉన్నవారికెవరికైనా వస్తుంది.
యుపి, బిహార్, దిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో తెరిచిన ఫేస్‌బుక్ పాత ఖాతాల్లో కామెంట్లను తొలగించకుండా, అదే ఉత్తరాది ముఖాలను ఏపిలోనూ తీసుకువచ్చి, వారి పేర్లతో సర్కారుకు వ్యతిరేకంగా పోస్టింగులు పెడితే చూస్తూ ఊరుకునేందుకు చంద్రబాబు ఏమైనా అమాయపు అఖిలేషు, రాహుల్‌గాంధీ అనుకున్నారేమో? అసలు టెక్నాలజీని ప్రమోట్ చేసిందే చంద్రబాబు! గత ఎన్నికల్లో ఇలాంటి ట్రిక్కులు బోలెడు చేసిన తెలుగుదేశం తాతల దగ్గర ‘ఉత్తర’ కిశోర దగ్గులు పనిచేస్తాయా? ఇప్పుడు సదరు అరువు మేధావిపై యుపిలో ఎన్ని కేసులున్నాయి? అతగాడిపై సైబర్ కేసు సంగతేమిటని ఆరా తీసే పనిలో తెలుగుదేశం బిజీ అయింది. మరి తన పుట్టలో వేలు పెడితే ఎవరైనా కుట్టకుండా ఉండరు కదా? జగన్ రాత్రింబవళ్లు కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన డబ్బును ఫీజు రూపంలో అప్పనంగా తీసుకుంటున్నా ఈ కక్కుర్తి పనులెందుకున్నది జగనన్న అభిమానుల ప్రశ్న. ఉత్తరాది పేర్లతో ఉన్న నకిలీ అకౌంట్ల స్థానంలో ఎంచక్కా తెలుగు పేర్లతో నకిలీవయినా కొత్త అకౌంట్లు తెరవకుండా, జగనన్న ఇచ్చిన డబ్బులు మిగిల్చుకునే ఈ కక్కుర్తి కిశోరాన్ని నమ్ముకుంటే వైకాపా అధినేతకు అధికారం ఎప్పుడు వచ్చేను? కుక్కతోక పట్టుకుని గోదారీదినట్లు కాపీ కొట్టడం కూడా రాని అరువు కిశోరాన్ని నమ్ముకుంటే జగన్ కలలు నెరవేరతాయా? ఆయన కలలు గన్న కలెక్టర్లకు పెన్షన్ ఎప్పుడు ఆపేను? నాన్న పక్కన తన ఫొటో ఉండాలన్న జీవితాశయం ఎన్నటికి నెరవేరేను? ఒకవైపు అన్న వస్తున్నాడని కార్యకర్తలు చొక్కాలు చించుకుంటే, ఉత్తరాది కిశోరం చేసిన కక్కుర్తి పోస్టింగు పనుల వల్ల.. ఇప్పటివరకూ సోషల్ మీడియాలో బాబు సర్కారుపై కనిపిస్తున్న వ్యతిరేకత అంతా నకిలీయే తప్ప, నిజం కాదన్న విషయం బయటపడిపోలేదూ?!
* * *
తెలుగుతేజం వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతి స్థా నంలో ఆశీనులయ్యారు. ఆయన కోసం ఇన్నాళ్లూ కష్టపడిన ‘తెలుగుమీడియా జాతి’ ఆ అద్భుతఘట్టాన్ని రంగు రంగుల పేజీల్లో అరపేజీకి తక్కువకాకుండా ఆవిష్కరించిన తీరు అనిర్వచనీయం. వెంకయ్యను రాజకీయాల నుంచి దూరం చేసుకుని ‘అనాథలైన’ వారి ఆవేదనయితే వర్ణనాతీతం. దేశంలో చాలామంది ఉప రాష్టప్రతులయ్యారు. కానీ ఈ స్థాయిలో ఆవేదన ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. కదిలిస్తే చాలు కన్నీరు కట్టలు తెంచుకునే దృశ్యాలే. ఏపిలో ఆయన వీరాభిమానుల శోకాలు చూస్తే ఈ ‘జాతి’కి ఆయనెంత సేవ చేయకపోతే అంత ఆవేదన ఉంటుందనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఆయననే నమ్ముకున్న పార్టీ విధేయులయితే తాము అనాథలమైపోయామని వాపోతున్నారు. ఎంత మేలు చేస్తే ఆ రుణానుబంధం కొనసాగుతుందనిపిస్తుంది. ఇది ఎంతమందికి సాధ్యమనిపిస్తుంది. ఏమాటకామాట.. రాష్ట్రానికి, పార్టీకి ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం ఇక దక్కదన్నట్లు అటు నాయుడు గారి గుండె కూడా బరువెక్కింది. ఏదేమైనా మన తెలుగువాడు, మన నెల్లూరు ఆ ణిముత్యంతో రాజ్యసభ మరింత శోభిల్లుతుందనేది నిర్వివాదం. *

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144